Abdulla Yameen: భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది.
మాలే: చైనా (China) అనుకూలవాది, భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు (Maldives) మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ (Abdulla Yameen)కు పడిన జైలుశిక్షను హైకోర్టు రద్దు చేసింది. ఆదివారం పార్లమెంటు ఎన్నికల వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. 2013-18 మధ్యకాలంలో అధికారంలో ఉన్న సమయంలో ఆయన అవినీతి, మనీలాండరింగ్కు పాల్పడ్డారనే అభియోగాలు ఉన్నాయి.
పర్యటకం అభివృద్ధి కోసం ఒక చిన్న దీవిని లీజుకు ఇచ్చేందుకు ఓ ప్రైవేటు సంస్థ నుంచి లంచం తీసుకున్నట్లు ట్రయల్ కోర్టు గుర్తించింది. ఈ క్రమంలోనే 2002లో దోషిగా తేల్చి.. 11ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన జైలుకు వెళ్లారు. 2023లో తన స్నేహితుడైన మహమ్మద్ ముయిజ్జు గెలిచిన అనంతరం గృహ నిర్బంధానికి మారారు. విచారణలో లోపాలు ఉన్నాయంటూ తాజాగా ఈ శిక్షను హైకోర్టు పక్కన పెట్టింది. క్రిమినల్ విచారణను పునఃప్రారంభించాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. దీంతో ఆయన విడుదలయ్యారు.
భారత్- మాల్దీవుల మధ్య దశాబ్దాలుగా కొనసాగిన ద్వైపాక్షిక మైత్రి 2013లో యమీన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక కుదుపులకు లోనైంది. చైనా నుంచి ఆయన భారీగా రుణాలు తీసుకున్నారు. భారత వ్యతిరేక విధానాలను అవలంబించారు. తీరప్రాంతాల్లో గస్తీ కోసం దిల్లీ స్నేహపూర్వకంగా అందించిన రెండు హెలికాప్టర్లను వెనక్కి ఇచ్చేశారు. స్థానికంగా విమానాశ్రయ ఆధునికీకరణ కాంట్రాక్టు దక్కించుకున్న భారతీయ కంపెనీని పక్కకు తప్పించి, చైనా సంస్థకు కట్టబెట్టారు.
పర్యటకం కుదేలు.. దిగొచ్చిన మాల్దీవులు!
2018లో ఇబ్రహీం సొలిహ్ పాలన సమయంలో.. హిందూ మహాసముద్రంలో భారత్ సైనిక బలగాలను మోహరిస్తోందని ఆరోపిస్తూ యమీన్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ‘భారత్ వెళ్లిపోవాలి (ఇండియా ఔట్)’ పేరుతో పెద్దయెత్తున దుష్ప్రచారం నిర్వహించాయి. 2019లోనూ ఆయన ఒకసారి జైలుకు వెళ్లి.. రెండేళ్ల తర్వాత బయటకు వచ్చారు.
మాల్దీవులు ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు సైతం చైనాకు అనుకూలుడిగా పేరుంది. దేశ పాలకుడిగా ఎన్నికైనప్పటినుంచి ఆయన కూడా భారత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోన్న విషయం తెలిసిందే. భారత్కు చెందిన భద్రతా బలగాలను తమ దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటలకందని విషాదమే.. రఫాలో ఇజ్రాయెల్ దాడులపై ఐరాస ఆందోళన
Israel: రఫాపై దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్న వేళ దాని పరిణామాలపై ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎలాగైనా దీన్ని ఆపేందుకు కృషి చేయాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. -
వారానికి 24 గంటలే పని
కెనడాలో చదువుకుంటున్న భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులు సెప్టెంబరు నెల నుంచి విద్యాసంస్థ ప్రాంగణం వెలుపల వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసుకునేందుకు వీలు కల్పించే కొత్త నిబంధన ఒకటి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. -
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు
చైనాలో వెలుగుచూసి ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన శాస్త్రవేత్త ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు. -
కోర్టు ధిక్కరణకు పాల్పడిన ట్రంప్.. 9వేల డాలర్ల జరిమానా
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్నకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాగ్ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడ్డారని న్యూయార్క్ కోర్టు జడ్జి మంగళవారం నిర్ధారించారు. -
భార్య దారుణహత్య.. భారతీయుడికి జీవితఖైదు
భార్య హత్య కేసులో ఓ భారతీయుడికి లండన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. గతేడాది జరిగిన ఈ ఘటనలో తాజాగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. -
భారత్ సూపర్ పవర్ కలలు కంటుంటే.. మనం అడుక్కుంటున్నాం
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
లండన్లో కత్తితో దాడి
తూర్పు లండన్లో మంగళవారం ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. హైనాల్ట్ ప్రాంతంలో వాహనంలో ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన అనంతరం దాడికి దిగాడు. -
‘ఇజ్రాయెల్’ కేసులో జర్మనీకి ఊరట
గాజాలో పాలస్తీనియన్లపై నరమేధానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్కు ఆయుధాలు సరఫరా చేస్తున్న జర్మనీని నిరోధించాలని కోరుతూ నికరాగువా దేశం చేసిన విజ్ఞప్తిని మంగళవారం అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తిరస్కరించింది. -
కొవిషీల్డ్తో కొన్ని దుష్పరిణామాలు నిజమే
కొవిడ్ టీకా కొవిషీల్డ్తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనకా అంగీకరించింది. -
కొలంబియా వర్సిటీలో ఉద్రిక్తతలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనల్లో కీలక పాత్ర పోషిస్తున్న న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పరిస్థితులు మంగళవారం ఉద్రిక్తంగా మారాయి. -
హమాస్ నాశనమే మా లక్ష్యం: ఇజ్రాయెల్
కాల్పుల విరమణపై ఈజిప్టు రాజధాని కైరోలో కీలక చర్చలు ప్రారంభమవుతున్న వేళ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. -
అమెరికాలో మరోసారి కాల్పుల మోత
కాల్పుల మోతతో అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. నార్త్ కరోలినాలోని షార్లెట్లో వారెంటు అందించేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండగుడు. -
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా (China).. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న విషయాన్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CPC) అంగీకరించింది.