Maldives: మొన్న చైనాతో సైనిక ఒప్పందం.. నేడు తుర్కియే నుంచి డ్రోన్లు..!
భారత్ను తీవ్రంగా వ్యతిరేకించే తుర్కియేతో ముయిజ్జు సర్కారు తాజాగా సంబంధాలను బలోపేతం చేసుకొంది. ఆ దేశం నుంచి నిఘా డ్రోన్లను కొనుగోలు చేసింది.
ఇంటర్నెట్డెస్క్: మాల్దీవులు (Maldives) వేగంగా భారత వ్యతిరేక కూటమిలో చేరుతోంది. ఇటీవలే చైనాతో ఓ సైనిక ఒప్పందం చేసుకొంది. దీని వివరాలను గోప్యంగా ఉంచింది. తాజాగా తరచూ భారత్ను విమర్శించే తుర్కియే నుంచి డ్రోన్లను కొనుగోలు చేసింది. వీటిని సముద్ర తీరంలోని తమ ఈఈజెడ్లో గస్తీ కాయడానికి ఉపయోగిస్తామని చెబుతోంది. వచ్చే వారంలో ఈ డ్రోన్ల వినియోగాన్ని ప్రారంభించనుంది. మొత్తం ఎన్నింటిని కొనుగోలు చేసిందో మాత్రం వివరాలు వెల్లడించలేదని ఆ దేశ మీడియా సంస్థ పేర్కొంది. ఈ విషయంపై మాలె రక్షణ మంత్రిత్వ శాఖ లేదా విదేశాంగ శాఖ పెదవి విప్పడంలేదు.
అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు చైనా పర్యటన నుంచి తిరిగి వచ్చాక.. నిఘా డ్రోన్ల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నామని ప్రకటించారు. ‘‘తుర్కియే కంపెనీతో చేసుకొన్న ఒప్పందంతో తొలిసారి మాల్దీవుల్లోకి సైనిక డ్రోన్లను తీసుకొచ్చారు. వీటిని దేశ సముద్ర తీరం పహారాకు వినియోగిస్తారు. మార్చి 3వ తేదీన ఆ కంపెనీ వీటిని డెలివరీ చేసింది. ప్రస్తుతం అవి ‘నూను మఫారు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు’లో ఉన్నాయి’’ అని ఓ ప్రభుత్వ అధికారి ఇచ్చిన సమాచారాన్ని ఆ పత్రిక ఉటంకించింది. ముయిజ్జు అధ్యక్షుడిగా నవంబర్లో బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి పర్యటించిన దేశం తుర్కియే కావడం గమనార్హం. నాడు ఈ డ్రోన్ల కోసం ఒప్పందం చేసుకొన్నారు. వీటి కొనుగోలు కోసం కొన్ని రకాల దిగుమతి సుంకాల్లో మార్పులు చేశారు. ఈ డీల్ నిమిత్తం 37 మిలియన్ డాలర్లను ముయిజ్జు సర్కారు కేటాయించింది.
చైనా పర్యటన నుంచి వచ్చిన తర్వాత నుంచి ముయిజ్జు భారత్ విషయంలో ఉపయోగించే భాషలో మార్పు వచ్చింది. ఆయన జనవరిలో ఎయిర్ మాట్లాడుతూ ‘‘మాది చిన్న ద్వీపాల సమూహమే అయినా.. దాదాపు 9 లక్షల చదరపు కిలోమీటర్ల ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంది. ఈ సముద్రం ఎవరి సొత్తు కాదు’’ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. నేటితో భారత సైనిక సిబ్బంది ఉపసంహరణకు గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో డ్రోన్ల విషయం వెలుగులోకి రావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
తండ్రికి వచ్చే పింఛన్ తీసుకొంటున్న ఓ మహిళ.. అతడి మృతదేహాన్ని ఇంట్లోనే ఏళ్లపాటు దాచిపెట్టినట్లు వెల్లడైంది. -
29వసారి ఎవరెస్టు అధిరోహణ.. చరిత్ర సృష్టించిన నేపాల్ షెర్పా
నేపాల్కు చెందిన షెర్పా కమీ రీటా.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని 29 సార్లు విజయవంతంగా అధిరోహించి చరిత్ర సృష్టించాడు. -
తొలిసారిగా పంది కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తి మృతి
ప్రపంచంలోనే తొలిసారిగా పంది కిడ్నీని మార్పిడి చేయించుకున్న అమెరికాకు చెందిన రిచర్డ్ స్లేమాన్(62) శనివారం మరణించినట్లుగా అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. -
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!
అర్జెంటీనాలో తప్పనిసరి ఓటింగ్ అమల్లోకి వచ్చి 112 ఏళ్లు దాటింది. ప్రస్తుతం అక్కడ పాలకుల కారణంగా ఈ వ్యవస్థ కొంత మసక బారింది. -
పోలీసును కొట్టి చంపిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
ద్రవ్యోల్బణం, ఇస్లామాబాద్ దోపిడీపై పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆగ్రహ జ్వాలలు ఎగసి పడుతున్నాయి. ప్రజలు పోలీసులపై దాడి చేసి చితకబాదుతున్నారు. -
ఇజ్రాయెల్కు ఇరాన్ ‘అణు’ బెదిరింపులు..
తాము అవసరమైతే అణుబాంబు తయారీకి వెనుకాడమని ఇరాన్ తేల్చిచెప్పింది. -
కష్టంగా కాదు.. ఇష్టంగా ఓటింగ్ : ఆస్ట్రేలియాలో ఎన్నికల శైలి
పేరుకే అక్కడ నిర్బంధ ఓటింగ్.. కానీ, ఓటర్లకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకొంటుంది. అయినా కానీ, ఓటు వేసేందుకు ఎవరైనా మొరాయిస్తే కొరడా ఝుళిపిస్తుంది. ఆ విశేషాలేంటో చూద్దాం.. -
నిజ్జర్ హత్య కేసు.. మరో అనుమానితుడి అరెస్టు
Canada: నిజ్జర్ హత్య కేసులో బ్రాంప్టన్ ప్రాంతంలో నివాసముంటున్న అమర్దీప్ సింగ్ను కెనడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
జెలెన్స్కీ హత్యకు కుట్ర
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ సహా మరికొందరు సైనిక అధికారులు, రాజకీయ నేతలను హతమార్చేందుకు రష్యా పన్నిన కుట్రను తాము భగ్నం చేశామని ఉక్రెయిన్ అధికారులు కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. -
సౌమ్యా స్వామినాథన్కు గౌరవ డాక్టరేట్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చీఫ్ సైంటిస్ట్గా విధులు నిర్వహించిన డాక్టర్ సౌమ్యా స్వామినాథన్కు ప్రతిష్ఠాత్మక మెక్గిల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ లభించింది. -
అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
అఫ్గానిస్థాన్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బదాక్షాన్, బగ్లాన్, ఘోర్, హెరాత్ ప్రావిన్సుల్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బగ్లాన్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. -
రఫాపై భారీ దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్
రఫాపై భారీ దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ -
విశ్రాంతి కరవైన చోదకుడు బస్సును నదిలోకి నడిపాడు
రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం వీడియో ఆన్లైన్లో వైరల్గా మారింది. అదుపుతప్పిన బస్సు వాహనాలను ఢీకొంటూ వెళ్లి నేరుగా వంతెన పైనుంచి నదిలో పడిపోయిన దృశ్యాలు అందులో ఉన్నాయి. -
బాలుడి మృతదేహాన్ని వదిలేసిన విమాన సంస్థ
తల్లిదండ్రుల వెంట విమానంలో పాక్ ఆక్రమిత గిల్గిట్ బాల్టిస్థాన్కు వెళ్లాల్సిన ఆరేళ్ల బాలుడి మృత దేహాన్ని పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ) సిబ్బంది ఇస్లామాబాద్ విమానాశ్రయంలో వదిలేశారు. -
ట్రంప్నకు బైడెన్ చురక
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఇందుకోసం విరాళాలు సేకరించే పనిలో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు నిమగ్నమయ్యాయి. -
రాకెట్ లాంచింగ్ వ్యవస్థను పరీక్షించిన ఉత్తర కొరియా
కిమ్జోంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా మరోసారి తన ఆయుధ పాటవాన్ని ప్రదర్శించింది. బహుళ రాకెట్ లాంచింగ్ వ్యవస్థ సన్నాహక పరీక్షను నిర్వహించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ శనివారం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్తో ప్రాంతీయ పార్టీల పొత్తు.. శశిథరూర్ ఏమన్నారంటే?
-
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం.. రైతులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్రెడ్డి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్
-
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
-
పేలిన ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంక్.. 10 మందికి గాయాలు