Kenya: కెన్యా విద్యార్థుల వింత ప్రవర్తన.. మాస్ హిస్టీరియా కావొచ్చని అనుమానం!
కెన్యాలో (Kenya) ఓ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. వారిలో వింత లక్షణాలు కనిపించాయి.
నైరోబి: వింత లక్షణాలతో బాధపడుతూ దాదాపు 100 కెన్యా (Kenya) విద్యార్థులు ఆస్పత్రిలో చేరారు. వారంతా కకామెగాలోని ఎరెగి బాలికోన్నత పాఠశాలకు చెందిన వారని ఓ వార్తా సంస్థ పేర్కొంది. ఆస్పత్రిపాలైన విద్యార్థులంతా నడవడానికి ఇబ్బంది పడుతూ, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లు తెలిసింది. మరికొందరిలో మూర్ఛ లక్షణాలు కనిపించాయి. అందుకు సంబంధించిన ఓ వీడియో సైతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అందులో విద్యార్థుల వింత ప్రవర్తనను చూసి కొందరు మాస్ హిస్టీరియా కావొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నార్వే రచయితకు సాహిత్య నోబెల్
ఈ విషయం తెలిసి కెన్యా విద్యాశాఖ ప్రతినిధి ఒకరు పాఠశాలను సందర్శించారు. పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పాఠశాలలోని మిగిలిన విద్యార్థులకు యథావిధిగా తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. ‘విద్యాశాఖ, ప్రజారోగ్య శాఖ, కౌంటీ ప్రభుత్వం సమన్వయంతో విద్యార్థులకు చికిత్సను అందజేస్తున్నామని’ విద్యాశాఖ రీజినల్ డైరెక్టర్ జారేద్ ఒబిరో తెలిపారు. బాధిత విద్యార్థుల నుంచి సేకరించిన మూత్ర, రక్త నమూనాలను ల్యాబోరేటరీకి పంపించారు. వచ్చే వారంలో ఆ ఫలితాలు రానున్నాయి. అయితే, విద్యార్థుల అనారోగ్యానికి కారణం మాత్రం ఇప్పటివరకు వైద్యులకు అంతు చిక్కలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనాకు పుతిన్
ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్.. తన తొలి విదేశీ పర్యటన చైనాలో చేయనున్నారు. -
ఖర్కీవ్ను కాపాడుకోవాలంటే మరిన్ని ఆయుధాలు కావాలి
రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు అమెరికా దాదాపు 61 బిలియన్ డాలర్ల సైనిక సాయం ఇటీవలే ప్రకటించింది. అయినా ఇంకా ఆయుధాలు కావాలంటోంది ఉక్రెయిన్. లేకపోతే రష్యాను ఓడించడం కష్టమంటోంది. -
ఇరాన్తో ఒప్పందంపై భారత్కు అమెరికా హెచ్చరిక!
ఇరాన్లోని చాబహార్ ఓడరేవు నిర్వహణకు సంబంధించి భారత్ కీలక ఒప్పందం కుదుర్చుకున్న వేళ అమెరికా పరోక్ష హెచ్చరిక జారీ చేసింది. -
2050 కల్లా మరో 24.5 కోట్లమంది వృద్ధులపై ఎండ ప్రతాపం!
పర్యావరణంలో మార్పుల కారణంగా రాబోయే పాతికేళ్లలో.. ఇప్పుడున్న సంఖ్యకు అదనంగా మరో 24.5 కోట్ల మందికిపైగా వృద్ధులపై మండుటెండల ప్రభావం పడే ముప్పుందని తాజా అధ్యయన నివేదిక ఒకటి హెచ్చరించింది. -
పీవోకేలో ఆగని హింస
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో మళ్లీ హింస చెలరేగింది. పెరిగిన గోధుమ ధరలు, విద్యుత్తు బిల్లులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
శ్వేతసౌధంలో ‘సారే జహాసే అచ్ఛా..’
భారత్కు చెందిన ‘సారే జహాసే అచ్ఛా’ గీతం సోమవారం శ్వేతసౌధంలో అతిథులను అలరించింది. అంతేకాదు అతిథులకు వడ్డించిన ఆహారంలో భారతీయ వంటకమైన సమోసాతోపాటు పానీపూరీకి చోటు దక్కింది. -
అవసరమైతే బైడెన్ను హతమార్చాలనుకున్నా
అమెరికాలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి హిట్లర్ నాజీ నిరంకుశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే అధ్యక్ష భవనం శ్వేతసౌధంపై ట్రక్కుతో దాడి చేశానని కందుల సాయి రక్షిత్ (20) అంగీకరించాడు. -
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని.. వాటివల్ల భవిష్యత్తులో ముప్పు పొంచివుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు. -
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
సింగపూర్కు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్.. 34 ఏళ్లకే నానమ్మ అయ్యారు. తన 17ఏళ్ల కుమారుడు గతేడాది తండ్రి అయిన విషయాన్ని ఆమె ఇటీవల వెల్లడించారు. -
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
థాయ్లాండ్లో రాచరిక చట్టాలపై అసమ్మతి గళం వినిపించిన ఓ మహిళా కార్యకర్త నెలల తరబడి నిరాహార దీక్ష అనంతరం మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
మధ్యవర్తి వంచన.. వలస జీవులు కాలినడకన
-
నిశిరాత్రిలో ఘోరం.. అయిదుగురి సజీవదహనం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!