Mysterious Object: ఆ అంతుచిక్కని వస్తువు.. భారత రాకెట్ శకలమే..!
ఇటీవల ఆస్ట్రేలియా తీరానికి కొట్టుకొచ్చిన ఓ అంతుచిక్కని వస్తువు.. భారత్కు చెందిన ‘పీఎస్ఎల్వీ’ రాకెట్ శకలంగా గుర్తించారు. ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.
కాన్బెర్రా: ఆస్ట్రేలియా తీరంలో ఓ అంతుచిక్కని వస్తువు (Mysterious Object) ఇటీవల కలకలం రేపిన విషయం తెలిసిందే. ధ్వంసమైన స్థితిలో భారీ స్థూపాకారపు రాగి రంగు లోహాపు వస్తువు ఇక్కడి గ్రీన్ హెడ్ పట్టణ తీరంలోకి కొట్టుకువచ్చింది. అయితే, అది భారత రాకెట్కు సంబంధించిన వస్తువని ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ (Australian Space Agency) తాజాగా వెల్లడించింది. ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి చేర్చే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) మూడో దశకు సంబంధించిన శకలంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిపింది. ఐరాస అంతరిక్ష ఒప్పందాలకు లోబడి.. తదుపరి చర్యల విషయంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) కలిసి పని చేస్తున్నట్లు పేర్కొంది.
ఆస్ట్రేలియా తీరంలో అంతుచిక్కని వస్తువు..!
జులై మూడో వారంలో ‘జురియన్ బే’లో ఈ భారీ వస్తువు వెలుగులోకి రాగా.. అది ఏంటనేది ఎవరికీ అంతుచిక్కలేదు. ఆ వస్తువుకు దూరంగా ఉండాలని స్థానికులను అధికారులు హెచ్చరించారు. అసలు అది ఎక్కడినుంచి వచ్చింది? ప్రమాదకరమా? కాదా? అని దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు.. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. అది 2014లో సముద్రంలో కూలిపోయిన మలేషియా విమానానికి సంబంధించిన శకలమేనని కొంతమంది చర్చించారు. ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ మాత్రం.. ఏదైనా విదేశీ అంతరిక్ష ప్రయోగ వాహనానికి సంబంధించినది కావొచ్చని అంచనా వేసింది. తాజాగా అది భారత్కు చెందిన పీఎస్ఎల్వీ రాకెట్కు సంబంధించిన శకలమని నిర్ధారించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సౌర కుటుంబంలో గ్రహాంతర జీవుల కోసం..
భూమికి వెలుపల ఈ సువిశాల విశ్వంలో ఎక్కడైనా జీవం ఉందా అన్నది అనాదిగా మానవుడిని వేధిస్తున్న ప్రశ్న. అయితే శతాబ్దాలుగా అది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. -
చైనాకు పుతిన్.. రేపటి నుంచి పర్యటన ప్రారంభం
ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్.. తన తొలి విదేశీ పర్యటన చైనాలో చేయనున్నారు. -
ఖర్కీవ్ను కాపాడుకోవాలంటే మరిన్ని ఆయుధాలు కావాలి
రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు అమెరికా దాదాపు 61 బిలియన్ డాలర్ల సైనిక సాయం ఇటీవలే ప్రకటించింది. అయినా ఇంకా ఆయుధాలు కావాలంటోంది ఉక్రెయిన్. లేకపోతే రష్యాను ఓడించడం కష్టమంటోంది. -
ఇరాన్తో ఒప్పందంపై భారత్కు అమెరికా హెచ్చరిక!
ఇరాన్లోని చాబహార్ ఓడరేవు నిర్వహణకు సంబంధించి భారత్ కీలక ఒప్పందం కుదుర్చుకున్న వేళ అమెరికా పరోక్ష హెచ్చరిక జారీ చేసింది. -
2050 కల్లా మరో 24.5 కోట్లమంది వృద్ధులపై ఎండ ప్రతాపం!
పర్యావరణంలో మార్పుల కారణంగా రాబోయే పాతికేళ్లలో.. ఇప్పుడున్న సంఖ్యకు అదనంగా మరో 24.5 కోట్ల మందికిపైగా వృద్ధులపై మండుటెండల ప్రభావం పడే ముప్పుందని తాజా అధ్యయన నివేదిక ఒకటి హెచ్చరించింది. -
పీవోకేలో ఆగని హింస
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో మళ్లీ హింస చెలరేగింది. పెరిగిన గోధుమ ధరలు, విద్యుత్తు బిల్లులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
శ్వేతసౌధంలో ‘సారే జహాసే అచ్ఛా..’
భారత్కు చెందిన ‘సారే జహాసే అచ్ఛా’ గీతం సోమవారం శ్వేతసౌధంలో అతిథులను అలరించింది. అంతేకాదు అతిథులకు వడ్డించిన ఆహారంలో భారతీయ వంటకమైన సమోసాతోపాటు పానీపూరీకి చోటు దక్కింది. -
అవసరమైతే బైడెన్ను హతమార్చాలనుకున్నా
అమెరికాలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి హిట్లర్ నాజీ నిరంకుశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే అధ్యక్ష భవనం శ్వేతసౌధంపై ట్రక్కుతో దాడి చేశానని కందుల సాయి రక్షిత్ (20) అంగీకరించాడు. -
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని.. వాటివల్ల భవిష్యత్తులో ముప్పు పొంచివుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు. -
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
సింగపూర్కు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్.. 34 ఏళ్లకే నానమ్మ అయ్యారు. తన 17ఏళ్ల కుమారుడు గతేడాది తండ్రి అయిన విషయాన్ని ఆమె ఇటీవల వెల్లడించారు. -
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
థాయ్లాండ్లో రాచరిక చట్టాలపై అసమ్మతి గళం వినిపించిన ఓ మహిళా కార్యకర్త నెలల తరబడి నిరాహార దీక్ష అనంతరం మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో పవనోత్సాహం.. అత్యధికంగా పోలింగ్ నమోదు
-
మధ్యవర్తి వంచన.. వలస జీవులు కాలినడకన
-
నిశిరాత్రిలో ఘోరం.. అయిదుగురి సజీవదహనం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!