Abducting: భారీ ‘కిడ్నాప్’ కథ సుఖాంతం.. 300 మంది చిన్నారుల విడుదల!
నైజీరియాలో దాదాపు 300 మంది విద్యార్థులను అపహరించిన కిడ్నాపర్లు.. ఎట్టకేలకు వారిని సురక్షితంగా విడిచిపెట్టినట్లు అధికారులు వెల్లడించారు.
అబుజా: ఆఫ్రికా దేశమైన నైజీరియా (Nigeria)లో దాదాపు 300 మంది విద్యార్థుల అపహరణ వ్యవహారం ఎట్టకేలకు సుఖాంతమైంది. రెండు వారాల తర్వాత కిడ్నాపర్లు వారిని సురక్షితంగా విడిచిపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా ఏజెన్సీల సమన్వయం, వ్యూహరచనతో ఇది సాధ్యమైనట్లు స్థానిక గవర్నర్ తెలిపారు. పిల్లలను క్షేమంగా వెనక్కి తీసుకురావడంలో దేశాధ్యక్షుడు బోలా టినుబు చొరవ చూపారని పేర్కొన్నారు.
కడునా రాష్ట్రం కురిగా పట్టణంలోని ఓ పాఠశాల నుంచి విద్యార్థులను ఈ నెల 7న సాయుధ వ్యక్తులు అపహరించుకుపోయారు. అడ్డుకునేందుకు యత్నించిన ఓ వ్యక్తిని కాల్చిచంపారు. విద్యార్థుల్ని తమతోపాటు సమీప అడవుల్లోకి తీసుకుపోయారు. చిన్నారుల్లో 12 ఏళ్లలోపు వారే కనీసం 100 మంది వరకు ఉన్నారు. వారిని విడుదల చేసేందుకు రూ.5 కోట్లు ఇవ్వాలని.. లేనిపక్షంలో పిల్లల్ని చంపేస్తామని బెదిరించారు.
రూ.ఐదుకోట్లు ఇవ్వకపోతే.. చిన్నారుల్ని చంపేస్తాం..!
నైజీరియాలో పిల్లల అపహరణ ఉదంతాలు గతంలోనూ ఉన్నా.. ఇంత భారీసంఖ్యలో జరగడం కలకలం రేకెత్తించింది. ఒక్కపైసా చెల్లించకుండా విద్యార్థులను కాపాడే ప్రయత్నం చేస్తామని అధ్యక్షుడు టినుబు చెప్పారు. ఈ క్రమంలోనే వారు విడుదల కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. కిడ్నాపర్లకు డబ్బులు చెల్లించారా? లేదా? అన్న విషయం తెలియరాలేదు. ఇదిలా ఉండగా స్థానికంగా 2014 నుంచి ఇప్పటివరకు దాదాపు 1,400 మంది విద్యార్థులు కిడ్నాప్ అయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.