USA: హౌతీ దాడులను తిప్పికొట్టి.. 18 నౌకలను కాపాడి..!
వాణిజ్య నౌకలే లక్ష్యంగా ఎర్ర సముద్రంలో హౌతీలు ప్రయోగించిన ఓ యాంటీ-షిప్ బాలిస్టిక్ క్షిపణిని, డ్రోన్ను తమ యుద్ధనౌక కూల్చేసినట్లు అమెరికా ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం (Israel Hamas Conflict) నేపథ్యంలో ఎర్ర సముద్రం (Red Sea)లో అంతర్జాతీయ రవాణా నౌకలపై యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు దాడులకు తెగబడుతున్నారు. హెలికాప్టర్లు, డ్రోన్లు, క్షిపణులతో చేస్తున్న ఈ దాడులు జల రవాణాను దెబ్బతీస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి నౌకలపై దాడికి యత్నించగా.. దాన్ని తిప్పికొట్టినట్లు అమెరికా ప్రకటించింది.
‘‘దక్షిణ ఎర్ర సముద్రంలో హౌతీలు ప్రయోగించిన ఓ డ్రోన్ను, యాంటీషిప్ బాలిస్టిక్ క్షిపణిని మా యుద్ధనౌక ‘యూఎస్ఎస్ మాసన్’ కూల్చేసింది. ఆ సమయంలో అక్కడే ఉన్న 18 నౌకల్లో దేనికీ నష్టం వాటిల్లలేదు. సిబ్బంది ఎవరూ గాయపడలేదు’’ అని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఓ ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ వాణిజ్య నౌకలే లక్ష్యంగా అక్టోబర్ 19వ తేదీ నుంచి హౌతీలు ఇప్పటి వరకు 22 సార్లు నౌకలపై దాడులకు పాల్పడినట్లు వెల్లడించింది.
దాడులతో ‘ఎర్ర’బారుతున్న సముద్రం
మరోవైపు.. హౌతీ దాడులకు ఆర్థికంగా తోడ్పడుతున్న నెట్వర్క్పై ఆంక్షలు విధించినట్లు అమెరికా వెల్లడించింది. ఇరాన్ ఆదేశాల మేరకు హౌతీలకు లక్షలాది డాలర్లను బదిలీ చేయడంలో ఈ నెట్వర్క్ సాయపడినట్లు ఆరోపించింది. యెమెన్, తుర్కియేలోని మూడు నగదు మార్పిడి సంస్థలతోపాటు సనాలోని ఓ ఆర్థిక సంస్థ అధిపతిని ఈ జాబితాలో చేర్చినట్లు తెలిపింది. రవాణా నౌకలకు రక్షణ కల్పించేందుకు ‘ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్’ను అమెరికా మిత్రదేశాలు చేపట్టాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకూ మోదీలాంటి నాయకుడు రావాలి: పాక్-అమెరికన్ వ్యాపారవేత్త
Modi: మోదీలాంటి నాయకత్వం కేవలం భారత్కే కాకుండా యావత్ ప్రపంచానికి మంచి చేస్తుందని పాక్-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ అన్నారు. పాక్లో సమస్యలన్నింటినీ పరిష్కరించగలిగే నాయకుడొకరు రావాలని ఆకాంక్షించారు. -
సౌర కుటుంబంలో గ్రహాంతర జీవుల కోసం..
భూమికి వెలుపల ఈ సువిశాల విశ్వంలో ఎక్కడైనా జీవం ఉందా అన్నది అనాదిగా మానవుడిని వేధిస్తున్న ప్రశ్న. అయితే శతాబ్దాలుగా అది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. -
చైనాకు పుతిన్.. రేపటి నుంచి పర్యటన ప్రారంభం
ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్.. తన తొలి విదేశీ పర్యటన చైనాలో చేయనున్నారు. -
ఖర్కీవ్ను కాపాడుకోవాలంటే మరిన్ని ఆయుధాలు కావాలి
రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు అమెరికా దాదాపు 61 బిలియన్ డాలర్ల సైనిక సాయం ఇటీవలే ప్రకటించింది. అయినా ఇంకా ఆయుధాలు కావాలంటోంది ఉక్రెయిన్. లేకపోతే రష్యాను ఓడించడం కష్టమంటోంది. -
ఇరాన్తో ఒప్పందంపై భారత్కు అమెరికా హెచ్చరిక!
ఇరాన్లోని చాబహార్ ఓడరేవు నిర్వహణకు సంబంధించి భారత్ కీలక ఒప్పందం కుదుర్చుకున్న వేళ అమెరికా పరోక్ష హెచ్చరిక జారీ చేసింది. -
2050 కల్లా మరో 24.5 కోట్లమంది వృద్ధులపై ఎండ ప్రతాపం!
పర్యావరణంలో మార్పుల కారణంగా రాబోయే పాతికేళ్లలో.. ఇప్పుడున్న సంఖ్యకు అదనంగా మరో 24.5 కోట్ల మందికిపైగా వృద్ధులపై మండుటెండల ప్రభావం పడే ముప్పుందని తాజా అధ్యయన నివేదిక ఒకటి హెచ్చరించింది. -
పీవోకేలో ఆగని హింస
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో మళ్లీ హింస చెలరేగింది. పెరిగిన గోధుమ ధరలు, విద్యుత్తు బిల్లులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
శ్వేతసౌధంలో ‘సారే జహాసే అచ్ఛా..’
భారత్కు చెందిన ‘సారే జహాసే అచ్ఛా’ గీతం సోమవారం శ్వేతసౌధంలో అతిథులను అలరించింది. అంతేకాదు అతిథులకు వడ్డించిన ఆహారంలో భారతీయ వంటకమైన సమోసాతోపాటు పానీపూరీకి చోటు దక్కింది. -
అవసరమైతే బైడెన్ను హతమార్చాలనుకున్నా
అమెరికాలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి హిట్లర్ నాజీ నిరంకుశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే అధ్యక్ష భవనం శ్వేతసౌధంపై ట్రక్కుతో దాడి చేశానని కందుల సాయి రక్షిత్ (20) అంగీకరించాడు. -
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని.. వాటివల్ల భవిష్యత్తులో ముప్పు పొంచివుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు. -
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
సింగపూర్కు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్.. 34 ఏళ్లకే నానమ్మ అయ్యారు. తన 17ఏళ్ల కుమారుడు గతేడాది తండ్రి అయిన విషయాన్ని ఆమె ఇటీవల వెల్లడించారు. -
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
థాయ్లాండ్లో రాచరిక చట్టాలపై అసమ్మతి గళం వినిపించిన ఓ మహిళా కార్యకర్త నెలల తరబడి నిరాహార దీక్ష అనంతరం మృతి చెందారు.