Suryapet: సెల్‌ టవర్‌ ఎక్కి దివ్యాంగుడి హల్‌చల్‌

తాను సాగు చేస్తున్న భూమిని కబ్జా చేశారంటూ ఓ వికలాంగుడు సెల్‌ టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. ఈ ఘటన సూర్యాపేట (Suryapet) నడిగూడెం మండల పరిధిలో చోటుచేసుకుంది. నాగరాజు అనే వికలాంగుడు 20 గుంటల భూమిని గత 20 ఏళ్లుగా సాగుచేస్తున్నాడు. తనకు తెలియకుండా భూమిని వేరే వ్యక్తి కబ్జా చేశాడని రెవిన్యూ అధికారుల వద్దకు వెళ్తే పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ సెల్ టవర్ ఎక్కాడు. తహసీల్దార్ వచ్చి సమాధానం చెప్పేంత వరకు దిగనని బెదిరించారు. తనకు న్యాయం జరగకపోతే దూకి బలవన్మరణానికి పాల్పడతనని హెచ్చరిచాడు. పోలీసులు, తహసీల్దార్  నచ్చజెప్పడంతో నాగరాజు కిందికి దిగాడు.

Updated : 17 Aug 2023 16:32 IST

Suryapet: సెల్‌ టవర్‌ ఎక్కి దివ్యాంగుడి హల్‌చల్‌

తాను సాగు చేస్తున్న భూమిని కబ్జా చేశారంటూ ఓ వికలాంగుడు సెల్‌ టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. ఈ ఘటన సూర్యాపేట (Suryapet) నడిగూడెం మండల పరిధిలో చోటుచేసుకుంది. నాగరాజు అనే వికలాంగుడు 20 గుంటల భూమిని గత 20 ఏళ్లుగా సాగుచేస్తున్నాడు. తనకు తెలియకుండా భూమిని వేరే వ్యక్తి కబ్జా చేశాడని రెవిన్యూ అధికారుల వద్దకు వెళ్తే పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ సెల్ టవర్ ఎక్కాడు. తహసీల్దార్ వచ్చి సమాధానం చెప్పేంత వరకు దిగనని బెదిరించారు. తనకు న్యాయం జరగకపోతే దూకి బలవన్మరణానికి పాల్పడతనని హెచ్చరిచాడు. పోలీసులు, తహసీల్దార్  నచ్చజెప్పడంతో నాగరాజు కిందికి దిగాడు.

Tags :

మరిన్ని