Kamareddy: కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గ విభేదాలు..!

కామారెడ్డి జిల్లా బాన్సువాడ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. బాన్సువాడ ఇంఛార్జీ, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, చందూర్ జడ్పీటీసీ అంబర్ సింగ్  మధ్య తీవ్ర స్థాయి వాగ్వాదం జరిగింది.

Published : 28 Apr 2024 18:26 IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. బాన్సువాడ ఇంఛార్జీ, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, చందూర్ జడ్పీటీసీ అంబర్ సింగ్  మధ్య తీవ్ర స్థాయి వాగ్వాదం జరిగింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చందూర్‌లో రవీందర్ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో స్వల్ప తోపులాట జరిగింది. ఏనుగు రవీందర్  రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ అంబర్ సింగ్ అభ్యంతరం తెలిపారు. పీసీసీ ఆదేశాలు లేకుండా కొత్త కమిటీలు ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. జడ్పీటీసీ హోదాలో ఉన్న తనకు.. పార్టీ కార్యక్రమాలపై కనీస సమాచారం ఇవ్వడంలేదని ఆక్షేపించారు.

Tags :

మరిన్ని