Wanaparthy: వనపర్తి జిల్లాలో.. వరి పొలంలో భారీ మొసలి కలకలం

వనపర్తి జిల్లా భూత్కూర్‌లో భారీ మొసలి కలకలం రేపింది. స్థానికులు గంటన్నర పాటు శ్రమించి మొసలిని బంధించారు. మొసలిని జూరాల జలాశయంలో వదిలేశామని పోలీసులు వెల్లడించారు.

Published : 29 Apr 2024 13:03 IST

వనపర్తి జిల్లా భూత్కూర్‌లో భారీ మొసలి కలకలం రేపింది. గ్రామానికి చెందిన  శేఖర్ అనే రైతుకు వరి పొలంలో నిద్రించి ఉన్న పెద్ద మొసలి కనిపించింది. విషయం తెలుసుకున్న స్థానికులు గంటన్నర పాటు శ్రమించి మొసలిని బంధించారు. వారం వ్యవధిలో మొసలి దాడిలో రెండు గొర్రెలు, ఒక ఆవు దూడ మృతి చెందాయని గ్రామస్థులు తెలిపారు. బంధించిన మొసలిని జూరాల జలాశయంలో వదిలేశామని పోలీసులు వెల్లడించారు.

Tags :

మరిన్ని