అవినీతిని ఎత్తిచూపానని వైకాపా నేతల బెదిరింపులు: తెదేపా రాష్ట్ర కార్యదర్శి

బాపట్ల జిల్లా భట్టిప్రోలు వైకాపా నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని తెదేపా రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా స్పందనలో ఎస్పీ వకుల్ జిందాల్‌కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలు తనపై భౌతిక దాడులకు పాల్పడుతామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సాయిబాబా మాట్లాడుతూ.. భట్టిప్రోలులో చేసిన ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగిందని ఆధారాలతో గత నెల 27న తాను స్పందనలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అప్పటి నుంచి తనపై వైకాపా నేతలు కక్ష పెంచుకున్నారని తెలిపారు.

Updated : 12 Dec 2023 18:25 IST

బాపట్ల జిల్లా భట్టిప్రోలు వైకాపా నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని తెదేపా రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా స్పందనలో ఎస్పీ వకుల్ జిందాల్‌కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలు తనపై భౌతిక దాడులకు పాల్పడుతామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సాయిబాబా మాట్లాడుతూ.. భట్టిప్రోలులో చేసిన ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగిందని ఆధారాలతో గత నెల 27న తాను స్పందనలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అప్పటి నుంచి తనపై వైకాపా నేతలు కక్ష పెంచుకున్నారని తెలిపారు.

Tags :

మరిన్ని