బ్రేకింగ్

breaking
20 Apr 2024 | 18:40 IST

22న ఏపీ పదోతరగతి ఫలితాలు

అమరావతి: ఏపీలో పదోతరగతి ఫలితాలను ఏప్రిల్‌ 22 (సోమవారం)న విడుదల చేయనున్నారు. విజయవాడ ఎంజీ రోడ్డులోని గ్రాండ్‌ సెంట్రల్‌ హాల్‌లో ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌కుమార్‌ ఫలితాలను వెల్లడించనున్నారు. ఈమేరకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 18 నుంచి 30 వరకు పరీక్షలు జరిగాయి. మొత్తం 3,473 కేంద్రాల్లో దాదాపు 6.30 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

మరిన్ని

తాజా వార్తలు