బ్రేకింగ్

breaking
22 Apr 2024 | 23:45 IST

జైస్వాల్‌ శతకం.. రాజస్థాన్‌ విజయం

జైపుర్‌: ఐపీఎల్‌ 2024లో రాజస్థాన్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. ముంబయితో సొంతమైదానంలో జరిగిన పోరులో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ (65), వధేరా (49) చెలరేగారు. రాజస్థాన్‌ బౌలర్‌ సందీప్‌ శర్మ 5 వికెట్లతో అదరగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 18.4 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి ఛేదించింది. జైస్వాల్‌ (104*) శతకంతో వీరవిహారం చేశాడు. బట్లర్‌ (35), శాంసన్‌ (38*) రాణించారు.   

మరిన్ని

తాజా వార్తలు