బ్రేకింగ్

breaking
23 Apr 2024 | 14:42 IST

కవిత, కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

దిల్లీ మద్యం విధానం కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ కేసులో ఇద్దరికీ మరో 14 రోజుల పాటు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. దీంతో మే 7వరకు వీరిద్దరూ తిహాడ్‌ జైలులోనే ఉండనున్నారు. ఈడీ తరఫున న్యాయవాది జోయబ్‌ హుస్సేన్‌ వాదనలు వినిపించారు. కవితకు బెయిల్‌ ఇవ్వొద్దని కోరారు. ఆమె అరెస్టు చట్టబద్ధంగానే జరిగిందని కోర్టుకు వివరించారు.

మరిన్ని

తాజా వార్తలు