బ్రేకింగ్

breaking
28 Apr 2024 | 11:05 IST

పొన్నవోలుకు ఏఏజీ పదవి ఎలా కట్టబెట్టారు?: షర్మిల

విశాఖ: నిజానికి అక్రమాస్తుల కేసులోని ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్‌ఆర్‌ పేరును సీబీఐ చేర్చలేదని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘జగన్‌ ఆదేశాల మేరకే ఛార్జిషీట్‌లో రాజశేఖర్‌రెడ్డి పేరును పొన్నవోలు చేర్చే ప్రయత్నం చేశారు. జగన్‌ బయటపడాలంటే ఆయన పేరును చేర్చాలనేది వారి ఉద్దేశం. జగన్‌ సీఎం పదవి చేపట్టిన 6 రోజుల్లోనే పొన్నవోలుకు ఏఏజీ కట్టబెట్టారు. ఏ సంబంధం లేకపోతే హడావుడిగా ఏఏజీ పదవిని ఎందుకు ఇచ్చారు? తండ్రి పేరును ఛార్జిషీట్‌లో చేర్చిన వ్యక్తికి పదవి ఎందుకిచ్చారు?’’ అని షర్మిల ప్రశ్నించారు.

మరిన్ని

తాజా వార్తలు