పొన్నవోలుకు హడావుడిగా మేలు చేశారంటే మీకోసం పనిచేసినట్లేగా?: వైఎస్ షర్మిల
వైకాపా (YSRCP) పాత మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని.. ఇప్పుడు కొత్త దాన్ని ప్రజలు ఎలా నమ్మాలని సీఎం జగన్(YS Jagan)ను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు.
విశాఖపట్నం: వైకాపా (YSRCP) పాత మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని.. ఇప్పుడు కొత్త దాన్ని ప్రజలు ఎలా నమ్మాలని సీఎం జగన్(YS Jagan)ను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. మద్యనిషేధం చేయకపోగా.. ప్రభుత్వమే విక్రయిస్తోందన్నారు. మెగా డీఎస్సీకి బదులు దగా డీఎస్సీ ఇచ్చారని ఆక్షేపించారు. ఏటా సంక్రాంతికి ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏమైందని నిలదీశారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు. జగన్పై ఆయన స్వామిభక్తిని చాటుకున్నారని ఎద్దేవా చేశారు.
పాత హామీలే నెర్చవేర్చనపుడు కొత్త మ్యానిఫెస్టోకు విలువేంటి?
‘‘ఐదు సంక్రాంతులు వెళ్లాయి.. ఒక్క జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? యువతకు ఎందుకు ఉద్యోగావకాశాలు కల్పించలేదు?ప్రభుత్వశాఖల్లోని ఖాళీలను ఇంతవరకు ఎందుకు భర్తీ చేయలేకపోయారు? మీ కార్యకర్తలకు మాత్రం వాలంటీర్ పోస్టులు ఇచ్చారు. వాటిని ప్రభుత్వ ఉద్యోగాలుగా చెబుతారా? ఎన్నికల ముందు హడావుడిగా డీఎస్సీ ఇస్తారా? జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టులను పూర్తిచేస్తామని గత మ్యానిఫెస్టోలో వైకాపా హామీ ఇచ్చింది. ఒక్క ప్రాజెక్టునూ ఎందుకు పూర్తిచేయలేకపోయారు. రైతులకు ధరల స్థిరీకరణ నిధి పేరిట రూ.3వేల కోట్లు కేటాయిస్తామన్నారు.. ఒక్క ఏడాదైనా కేటాయించారా? మీ హామీలను మీరే నిలబెట్టుకోలేనపుడు ప్రజలు ఎలా నమ్ముతారు.. వైకాపాను ఎందుకు నమ్మాలి? పాత మ్యానిఫెస్టోలోని హామీలనే నెరవేర్చనపుడు.. కొత్తదానికి విలువేముంటుంది?
జగన్ ఆదేశాల మేరకే పొన్నవోలు పిటిషన్లు
ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదు. మహిళ అనే సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలినైన నన్ను ఏకవచనంతో సంబోధిస్తున్నారు. నిజానికి అక్రమాస్తుల కేసు ఎఫ్ఐఆర్లో వైఎస్ఆర్ పేరును సీబీఐ చేర్చలేదు. దాని నుంచి బయటపడాలంటే వైఎస్ఆర్ పేరును ఛార్జిషీట్లో చేర్చాలనేది జగన్ ఉద్దేశం. ఆయన ఆదేశాల మేరకే 3 కోర్టుల్లో పొన్నవోలు పిటిషన్లు వేశారు. వైఎస్ఆర్ అంటే గౌరవమంటూనే ఆయన పేరును చేర్చాలని తిరుగుతారా? 2019 మే 30న జగన్ సీఏంగా పదవి చేపట్టిన 6 రోజుల్లోనే జూన్ 6న పొన్నవోలుకు ఏఏజీ పోస్టు కట్టబెట్టారు. ఏ సంబంధమూ లేకపోతే ఆయనకు ఏఏజీగా ఎందుకు అవకాశం ఇచ్చారు?తండ్రి పేరును ఛార్జిషీట్లో చేర్చేలా చేసిన వ్యక్తికి పదవి ఎందుకు కట్టబెట్టారు?హడావుడిగా ఆ మేలు చేశారంటే మీకోసం పనిచేసినట్లేగా?’’ అని జగన్ను ఉద్దేశించి షర్మిల వ్యాఖ్యానించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదే ఉత్సాహం ఓటేయడంలోనూ చూపాలి!
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద శుక్రవారం మందుబాబులు బారులుతీరారు. -
వైట్ కాలర్ రాజకీయ మాఫియా!
ఆ సంస్థ ఒక వైట్ కాలర్ రాజకీయ మాఫియా.. విష ప్రచారానికి పుట్టినిల్లు.. అన్నీ కుట్రలు, కుతంత్రాలే.. అంతా మాయాప్రచారమే.. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు వక్రీకరించడమే. -
జగన్.. మీ తల్లీ చెల్లెళ్లకు సమాధానమివ్వండి: సీఎం రేవంత్ కౌంటర్
ఏపీ సీఎం జగన్ మాటలను సొంత చెల్లెలు, కన్న తల్లి కూడా నమ్మడం లేదని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. -
పవన్కల్యాణ్ను భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపిద్దాం: ముద్రగడ కుమార్తె క్రాంతి
పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్కల్యాణ్, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్శ్రీనివాస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి చట్టసభలకు పంపిద్దామని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి కోరారు. -
ఎమ్మెల్సీ అనంతబాబు స్వగ్రామంలో తెదేపా కార్యకర్తపై వైకాపా దాడి
అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలంలోని ఎమ్మెల్సీ అనంతబాబు స్వగ్రామం ఎల్లవరంలో తెదేపా కార్యకర్తపై వైకాపా మూకలు దాడిచేసి గాయపర్చాయి. -
జులై 1న రూ.7,000 పింఛను
సామాజిక పింఛన్లు ప్రవేశపెట్టింది.. దాన్ని రూ.200 నుంచి 2 వేలు చేసిందీ తెదేపా ప్రభుత్వమేనని.. ఈసారి కూటమి అధికారంలోకి రాగానే పింఛను మొత్తాన్ని రూ.4వేలకు పెంచుతామని తెదేపా అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. -
భాజపాకు ఏ టీం బాబు.. బీ టీం జగన్
‘భాజపాకు ఏ టీం చంద్రబాబు, బీ టీం జగన్మోహన్రెడ్డి... వీరిలో ఎవరికి ఓటేసినా భాజపాకు వేసినట్లే. -
ముఖ్యమంత్రి పదవికి జగన్ అనర్హుడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు కడప ఎంపీ అవినాష్రెడ్డే అని సీబీఐ నిర్ధారించినా.. లోకమంతా కోడై కూస్తున్నా.. ముఖ్యమంత్రి జగన్ ఆయన్ను ఎందుకు వెనకేసుకొస్తున్నారని వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత ప్రశ్నించారు. -
‘ప్రజల జీవితాల్లో సంతోషమే’ చంద్రబాబు ఆకాంక్ష
‘చంద్రబాబు నాయకత్వం గురించి ప్రజలకు తెలుసు. ఆయన తప్పకుండా అధికారంలోకి వస్తారు. ప్రజా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారు. హామీలన్నింటినీ నెరవేరుస్తారు. అంతటితోనే ఆయన ఆగరు. -
ధగధగలా? దగానా?.. యువతా ఎవరు కావాలో తేల్చుకో?
ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు, పెట్టుబడులు రావడం కీలకం. కానీ, మన రాష్ట్రంలో అంతా రివర్స్ పాలన కదా! యువత ఉపాధి మార్గాలపై దెబ్బ కొట్టిన వైకాపా కావాలో.. కొలువులు అందించడంతోపాటు ఉద్యోగార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చిన తెదేపా కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. -
రాష్ట్రానికి పట్టిన అరిష్టం జగన్
రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, జగన్ దిగిపోతే గానీ ఏపీకి పట్టిన అరిష్టం నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి లేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. -
నెల రోజుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం.. ఆర్టీసీ బస్సులో బాలకృష్ణ సతీమణి ప్రచారం
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర శుక్రవారం వినూత్నంగా ప్రచారం చేపట్టి ఓటర్లను ఆకట్టుకున్నారు. -
రూ.10కి మద్యం.. రూ.50కి బియ్యం బస్తా
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో వైకాపా నాయకులు ప్రలోభాల పర్వాన్ని ముమ్మరం చేశారు. -
ప్రశాంతత వైపు పల్నాడు ప్రజల చూపు!
పల్నాడు జిల్లాలో ప్రశాంతత తీసుకురావాలని ఓటర్లు భావిస్తున్నారు. రాజకీయ హత్యలు, దాడులు, దౌర్జన్యాలతో అట్టుడికిపోతున్న ఈ ప్రాంతానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు ఓటర్లు కృతనిశ్చయంతో ఉన్నారు. ఎన్డీయే కూటమి అభ్యర్థుల వైపు మొగ్గుచూపుతున్నారు. -
ఆ నలుగురూ.. ఆ తాను ముక్కలే!
ఆంధ్రుల వాణిని దేశమంతా వినిపించాల్సినోళ్లు.. దిల్లీ వేదికగా తెలుగు వారి హక్కుల్ని సాధించాల్సినోళ్లు.. రాష్ట్ర ప్రజల అవసరాలను పక్కనబెట్టి.. సొంత మేలుకే పరుగులు పెట్టారు. -
పట్టుకుంటారని రూ.2 కోట్లు పడేశారు!
చిత్తూరు జిల్లా నుంచి శ్రీసత్యసాయి జిల్లా హిందూపురానికి గురువారం రాత్రి 1 గంట సమయంలో కారులో వైకాపా నాయకులు రూ.2 కోట్లను సంచుల్లో తీసుకొస్తున్నారు. -
గుడివాడలో అభివృద్ధి లేకే వలసలు: కుమారి ఆంటీ
కృష్ణా జిల్లా గుడివాడలో ఎటువంటి అభివృద్ధి లేకే తాను పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కు వలస వెళ్లాల్సి వచ్చిందని ఇటీవల యూట్యూబ్ ద్వారా ఆదరణ పొందిన హోటల్ నిర్వాహకురాలు కుమారి ఆంటీ అన్నారు. -
కూటమికి మద్దతుగా కృష్ణంరాజు సతీమణి ప్రచారం
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ పరిధిలో కూటమికి మద్దతుగా కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు దివంగత కృష్ణంరాజు సతీమణి శ్యామలదేవి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. -
వైకాపాకు ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపాలే
‘వైకాపాకు ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపాలే. వాటిని కాపాడుకోవాలంటే జనసేన, తెదేపా, భాజపా కూటమి అభ్యర్థులకు ఓటేయండి. -
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకి జగన్ని ఓడించండి: మందకృష్ణ మాదిగ
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సీఎం జగన్ను ఓడించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. -
ముస్లిం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని, వారి సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టంచేశారు.