బ్రేకింగ్

breaking
28 Apr 2024 | 19:37 IST

మాఫియా డాన్‌లతో పోరాడుతున్నాం: పవన్‌

ప్రత్తిపాడు: ఇవి ఏపీ ప్రజల దశ, దిశ మార్చే ఎన్నికలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి వారి జిల్లాల్లోకి బయటివారిని రానివ్వరని, వారు మాత్రం ఇతర జిల్లాలకు వెళ్లి దోచుకోవచ్చని విమర్శించారు. ప్రస్తుత ఎన్నికల్లో మాఫియా డాన్‌లతో పోరాడుతున్నామని, జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజవర్గం పరిధిలోని ఏలేశ్వరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్‌ పాల్గొని ప్రసంగించారు. ఎన్డీయే ప్రభుత్వం రాగానే ఎయిడెడ్‌ విద్యాసంస్థలను పునరుద్ధరిస్తామన్నారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

మరిన్ని

తాజా వార్తలు