NZ vs IND: మూడో టీ20 మ్యాచ్ టై.. భారత్దే సిరీస్
మూడు టీ20ల సిరీస్ను భారత్ 1-0 ఆధిక్యంతో దక్కించుకొంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. ఇక మూడో మ్యాచ్ వర్షం కారణంగా టైగా ముగిసింది. నేపియర్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ త్రుటిలో ఓటమి నుంచి తప్పించుకొంది. 161 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 9 ఓవర్లకు 75/4 స్కోరుతో ఉన్నప్పుడు వర్షం భారీగా రావడంతో మ్యాచ్ను నిలిపివేశారు. డక్వర్త్లూయిస్ పద్ధతి ప్రకారం 76 పరుగులు చేస్తే భారత్ విజయం సాధించేది. అయితే 75 కొట్టడంతో టైగా ముగిసింది.
Updated : 22 Nov 2022 16:18 IST