జూన్‌ 20 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోని మొదటి ఈఎంఈ సెంటర్‌లో జూన్‌ 20 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Published : 06 May 2024 04:39 IST

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోని మొదటి ఈఎంఈ సెంటర్‌లో జూన్‌ 20 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అగ్నివీర్‌ (జీడీ), అగ్నివీర్‌ టెక్నికల్‌, అగ్నివీర్‌ క్లర్క్‌, అగ్నివీర్‌ టీడీఎన్‌ పోస్టుల భర్తీకి ఈ ర్యాలీని నిర్వహించనున్నారు. అర్హులైన వారు 20న తెల్లవారుజామున 5 గంటలకు మొదటి ఈఎంఈ సెంటర్‌, 4వ ట్రైనింగ్‌ బెటాలియన్‌, కోటేశ్వర్‌ద్వార్‌ వద్దకు రావాలన్నారు. మరిన్ని వివరాల కోసం awwaleagle@gmail.com, www.joinindianarmy@nic.in వెబ్‌సైట్లను లేదా 040-27863016 నంబరును సంప్రదించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని