APPSC: ఏపీలో డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ ఉద్యోగ నియామక పరీక్ష వాయిదా

ఏపీలో డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి జరగాల్సిన స్క్రీనింగ్ టెస్ట్‌ను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. 

Published : 28 Mar 2024 20:09 IST

అమరావతి: ఏపీలో 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే స్క్రీనింగ్‌ పరీక్షను ఏపీపీఎస్సీ (APPSC) వాయిదా వేసింది. షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 13న ఈ పరీక్ష జరగాల్సి ఉండగా.. సార్వత్రిక ఎన్నికలు, డీఎస్సీ పరీక్షలు ఉండటంతో పాటు అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ పరీక్షలను రీషెడ్యూల్‌ చేస్తున్నట్లు తెలిపింది. ఈ స్క్రీనింగ్‌ పరీక్షను మే 25న నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పేర్కొంది. డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు జనవరిలో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని