APPSC Group 2 Results: గ్రూప్ -2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. క్వాలిఫై అయిన అభ్యర్థుల జాబితా ఇదే..
ఏపీపీఎస్సీ గ్రూప్ -2 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తంగా 92,250 మంది మెయిన్స్కు క్వాలిఫై అయినట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది.
APPSC Group 2 Result| అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్ -2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు (APPSC Group II Prelims Results) విడుదలయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 899 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 21 నుంచి జనవరి 17 వరకు దరఖాస్తులు స్వీకరించిన ఏపీపీఎస్సీ.. ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది అభ్యర్థులు కొన్ని వారాల నుంచి ఎంతో ఉత్కంఠతో ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వేళ.. ఎట్టకేలకు ఏపీపీఎస్సీ ఈ పరీక్ష ఫలితాలను ప్రకటించింది. 92,250 మంది మెయిన్స్కు క్వాలిఫై కాగా.. 2557 మంది అభ్యర్థుల్ని వివిధ కారణాలతో రిజెక్ట్ చేశారు. ఈ మేరకు క్వాలిఫై అయిన, రిజెక్ట్ అయిన అభ్యర్థుల జాబితాలను వేర్వేరుగా అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షకు దాదాపు 4లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరు కాగా.. గ్రూప్- 2 మెయిన్స్ పరీక్షలు జులై 28న నిర్వహించనున్నారు. మెయిన్స్కు క్వాలిఫై అయిన అభ్యర్థుల జాబితా ఇదే..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!