APPSC: పరీక్ష తేదీలో మార్పు కోరుతూ ఎస్‌బీఐకి ఏపీపీఎస్సీ కార్యదర్శి లేఖ

క్లర్కు నియామకాల కోసం నిర్వహించే పరీక్ష తేదీల్లో మార్పు చేయాలని కోరుతూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కి ఏపీపీఎస్సీ కార్యదర్శి లేఖ రాశారు.

Updated : 19 Feb 2024 15:15 IST

అమరావతి: క్లర్క్‌ ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించే పరీక్ష తేదీల్లో మార్పు చేయాలని కోరుతూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)కి ఏపీపీఎస్సీ కార్యదర్శి లేఖ రాశారు. ఫిబ్రవరి 25న ఎస్‌బీఐ క్లర్కు నియామక పరీక్షను నిర్వహిస్తోంది. అదే రోజు గ్రూప్‌ 2 పరీక్షను ఏపీపీఎస్సీ షెడ్యూల్‌ చేసింది. రాష్ట్రానికి చెందిన కొందరు అభ్యర్థులు రెండు పరీక్షలకూ దరఖాస్తు చేసుకున్నారని, వారు అవకాశం కోల్పోకుండా ఎస్‌బీఐ ఆరోజు పరీక్షను మరో తేదీకి వాయిదా వేయాలని లేఖలో పేర్కొన్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని