TSPSC: గ్రూప్‌-1కు 4.03 లక్షల దరఖాస్తులు

గ్రూప్‌-1 దరఖాస్తుల గడువు శనివారంతో ముగిసింది. ఇప్పటి వరకు 4.03లక్షల దరఖాస్తులు అందినట్టు టీఎస్‌పీఎస్సీ అధికారులు వెల్లడించారు. 

Updated : 16 Mar 2024 22:26 IST

హైదరాబాద్‌: గ్రూప్‌-1 దరఖాస్తుల గడువు శనివారంతో ముగిసింది. ఇప్పటి వరకు 4.03లక్షల దరఖాస్తులు అందినట్టు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) అధికారులు వెల్లడించారు. మార్చి 23 నుంచి 27 వరకు సవరణకు అవకాశం కల్పించినట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గత నెల 19న నోటిఫికేషన్‌ విడుదలైంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21నుంచి నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని