PK Sidharth Ramkumar: కుటుంబానికి తెలియకుండా చదివి.. సివిల్స్లో నాలుగో ర్యాంక్ కొట్టి..!
కేరళకు చెందిన నాలుగో ర్యాంకర్ సిద్ధార్థ్ రామ్కుమార్(PK Sidharth Ramkumar) తన విజయంతో కుటుంబాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు.
కొచ్చి: అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (UPSC) నిర్వహించిన సివిల్స్ (Civils) - 2023 తుది ఫలితాల్లో కేరళకు చెందిన పీకే సిద్ధార్థ్ రామ్కుమార్ (PK Sidharth Ramkumar) నాలుగో ర్యాంక్ సొంతం చేసుకున్నారు. సిద్ధార్థ్ పేరు మీడియాలో వచ్చేవరకు ఆయన పరీక్ష రాసిన విషయం కుటుంబసభ్యులకు కూడా తెలియకపోవడం గమనార్హం. జాతీయ మీడియా కథనాల ప్రకారం..
‘‘మా అబ్బాయి ఈసారి సివిల్స్ పరీక్ష రాసిన విషయం మాకు తెలియదు. అందులో ఉత్తీర్ణుడై ఇంటర్వ్యూకు వెళ్లిన సంగతి మాకు చెప్పలేదు. టీవీలో పేరు కనిపించినప్పుడే ఇదంతా మాకు తెలిసింది. ఇంటికి వచ్చి పరీక్షలు రాసినా.. మాకు ఆ విషయం తెలియనివ్వలేదు. తన ర్యాంకు గురించి చెప్పడానికి ఫోన్ చేసి కొద్దిసేపే మాట్లాడాడు’’ అని సిద్ధార్థ్ తల్లి వెల్లడించారు. ప్రస్తుతం తన కుమారుడు ఐపీఎస్ను వీడి ఐఏఎస్లో చేరతారని ఆమె తెలిపారు. ర్యాంకర్ తండ్రి మాట్లాడుతూ..‘‘ఇది మేం అసలు ఊహించలేదు. ఇలాంటి అనూహ్య సంఘటనలు జరిగితే ఆనందం రెట్టింపు అవుతుంది’’ అని సంతోషం వ్యక్తంచేశారు.
UPSC: యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్.. తెలుగు అమ్మాయికి మూడో ర్యాంకు
సిద్ధార్థ్ ఈ పరీక్ష రాయడం ఇదే తొలిసారి కాదు. మొదట ఇండియన్ టెలీకమ్యూనికేషన్ సర్వీస్లో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత ఐపీఎస్కు ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఐపీఎస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల