Navodaya Jobs: ‘నవోదయ’లో 1,377 పోస్టులు.. దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు
నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన వారు మే 14వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలోని నవోదయ విద్యాలయాల్లో బోధనేతర (నాన్ టీచింగ్) సిబ్బంది నియామకానికి దరఖాస్తుల గడువును నవోదయ విద్యాలయ సమితి (NVS) మరోసారి పొడిగించింది. నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 30తో గడువు ముగియగా.. ఇటీవల మే 7వరకు పొడిగించిన అధికారులు తాజాగా ఆ గడువును సైతం పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అభ్యర్థులు మే 14వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. మొత్తం 1,377 నాన్ టీచింగ్ సిబ్బంది భర్తీకి గత నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఉద్యోగ స్థాయిని బట్టి భారీ వేతనాలు ఇవ్వనున్నారు. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఉద్యోగ ఖాళీల వివరాలివే..: ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులు 121 కాగా, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 5; ఆడిట్ అసిస్టెంట్ 12; జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ 4; లీగల్ అసిస్టెంట్ 1; స్టెనోగ్రాఫర్ 23; కంప్యూటర్ ఆపరేటర్ 2; క్యాటరింగ్ సూపర్వైజర్ 78; జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 381; ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ 128; ల్యాబ్ అటెండెంట్ 161; మెస్ హెల్పర్ 442; మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 19 చొప్పున పోస్టులను భర్తీ చేస్తారు.
- అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని చేసిన అనుభవం ఉండాలి.
- పోస్టుల వారీగా వేతనాలు ఇలా.. ఫిమేల్ స్టాఫ్ నర్స్ (లెవెల్-7) వేతనం రూ.44,900 - రూ.1,42,400 కాగా; అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్సిలేషన్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్ పోస్టులకు రూ.35,400-1,12,400; స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, క్యాటరింగ్ సూపర్వైజర్, రూ.25,500-81,100; జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(హెచ్క్యూ/ఆర్వో క్యాడర్), జూనియర్ సెక్రటేరియట్ (జేఎన్వీ క్యాడర్), ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ రూ.19,900-63,200, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కొలువులకు రూ.18,000-56,900 చొప్పున వేతనం ఇవ్వనున్నారు.
- ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష హిందీ, ఇంగ్లిష్లో మాత్రమే ఉంటుంది. తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు.
- దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500(ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులకు) రూ.1000 (ఇతర పోస్టులకు). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.500.
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే..: అనంతపురం, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, మహబూబ్నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్
- ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులకు ఉండాల్సిన విద్యార్హతలు, వయో పరిమితి, రిజర్వేషన్లు, పోస్టుల వారీగా పరీక్ష ఎన్ని మార్కులకు ఉంటుంది? తదితర పూర్తి వివరాలను ఈ కింది పీడీఎఫ్లో తెలుసుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట