Alert: ఆ ఉద్యోగ ప్రకటన ఫేక్‌.. నమ్మొద్దు: కేంద్రం

రైల్వే శాఖలో 4,660 ఉద్యోగాలంటూ చక్కర్లు కొడుతున్న ఓ ప్రకటన నకిలీది అని కేంద్రం స్పష్టం చేసింది.

Updated : 26 Feb 2024 20:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రైల్వే శాఖలో 4,660 ఉద్యోగాలంటూ చక్కర్లు కొడుతున్న ఓ ప్రకటనపై కేంద్రప్రభుత్వం స్పందించింది. ఆ ఉద్యోగ ప్రకటన నకిలీదని స్పష్టం చేసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ (RPF), రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌లో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి రైల్వేశాఖ ఏప్రిల్‌ 15 నుంచి మే 14వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తుందని పేర్కొంటూ విస్తృతంగా జరుగుతున్న ప్రచారాన్ని  ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (PIB) ఖండించింది. 

అలాంటి నోటీసు ఏదీ రైల్వే మంత్రిత్వశాఖ విడుదల చేయలేదని పీఐబీ స్పష్టం చేసింది. ఎప్పుడూ వ్యక్తిగత/ఆర్థికపరమైన సమాచారాన్ని షేర్‌ చేయొద్దని ప్రజలకు సూచించింది. ఆర్‌పీఎఫ్‌లో 452 ఎస్సై, 4,208 కానిస్టేబుల్‌ పోస్టుల సంఖ్య, వేతనం, వయో పరిమితి, విద్యార్హతలు, ఉద్యోగ నియామక ప్రక్రియ, దరఖాస్తు రుసుం తదితర అంశాలతో కూడిన ఈ నకిలీ ప్రకటనను ఎవరూ నమ్మొద్దని పేర్కొంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని