TS PGECET: తెలంగాణలో పీజీఈసెట్‌ పరీక్ష వాయిదా

Published : 17 May 2024 18:23 IST

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మ్‌ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసెట్‌ (PGECET)పరీక్షను వాయిదా వేయాలని జేఎన్టీయూ హెచ్‌ నిర్ణయించింది. గ్రూప్-1, స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్ పరీక్షల నేపథ్యంలో పీజీఈసెట్‌ పరీక్ష తేదీలను మారుస్తున్నట్టు ప్రకటించింది. జూన్ 6 నుంచి 9 వరకు జరగాల్సిన పీజీఈసెట్‌ను జూన్ 10 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ప్రకటనలో పేర్కొంది. మరింత సమాచారం కోసం విద్యార్థులు ఉన్నత విద్యామండలి వెబ్ సైట్‌ని సందర్శించాలని తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా పీజీఈసెట్‌ పరీక్షను వాయిదా వేయాలని జేఎన్టీయూ హెచ్‌ నిర్ణయించింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని