UPSC Civils 2024: సివిల్స్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది..

అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి ఏటా నిర్వహించే యూపీఎస్సీ సివిల్స్‌ పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

Published : 14 Feb 2024 14:49 IST

UPSC CSE 2024 Notification | దిల్లీ: సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న వారికి గుడ్‌న్యూస్‌. అఖిల భారత సర్వీసుల్లో 1,056 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్(CSE) 2024 పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన క్యాలెండర్‌కు అనుగుణంగానే ఫిబ్రవరి 14న నోటిఫికేషన్‌ ఇచ్చింది. UPSC CSE 2024 పరీక్షకు నేటి నుంచి మార్చి 5వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష మే 26న, మెయిన్స్ అక్టోబర్ 19న నిర్వహించనున్నారు. దీంతో పాటు ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌లో 150 పోస్టులకు విడిగా నోటిఫికేషన్‌ ఇచ్చింది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయండి

సివిల్స్‌ నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..

  • విద్యార్హతలు: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన  విద్యాసంస్థల నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
  • వయో పరిమితి: అభ్యర్థుల వయసు 21నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఆయా వర్గాలకు రిజర్వేషన్ల ఆధారంగా మినహాయింపు ఉంది.
  • దరఖాస్తు రుసుం: ఓబీసి, ఇతర అభ్యర్థులకు రూ.100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ,  దివ్యాంగులకు ఫీజు మినహాయింపు)
  • ప్రిలిమినరీ పరీక్ష: ఇందులో ప్రశ్నలు ఆబ్జెక్టివ్  రూపంలో ఉంటాయి. ఈ  ప్రశ్నల్లో నెగెటివ్ మార్కులు కూడా  ఉంటాయి. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్‌ రాసేందుకు అనుమతిస్తారు. 
  • మెయిన్స్‌ పరీక్ష: ఇది డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించి రూల్‌ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. 
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమ్స్‌ పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, హైదరాబాద్‌, వరంగల్‌ 
  • మెయిన్స్‌ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ. పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని