UPSC: పలు ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్‌.. 27 నుంచే దరఖాస్తులు

కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Published : 26 Jan 2024 16:53 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని పలు ఉద్యోగాల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 69 పోస్టుల నియామకం కోసం జనవరి 27 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. స్పెషలిస్ట్‌ గ్రేడ్‌ -III (40 పోస్టులు), సైంటిస్ట్‌ -‘బి’ (28), అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (1) ఉద్యోగాలకు అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ ఉద్యోగాలకు అవసరమైన విద్యార్హతలు, అనుభవం, వయో పరిమితి, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు రుసుం, వేతనం, తదితర పూర్తి వివరాలను ఈ కింది నోటిఫికేషన్‌లో చూడొచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని