Pawan Kalyan: ఆలయాల వద్ద భక్తుల రద్దీని క్రమబద్ధీకరించాలి: తొక్కిసలాట ఘటనపై పవన్ కల్యాణ్

ఇంటర్నెట్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 9 మంది భక్తులు మృతి చెందడం దురదృష్టకరమన్నారు. వారిలో చిన్నారి కూడా ఉండటం తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
‘‘బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది. ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉన్న ఆలయంలో జరిగిన ఈ ఘటనపై విచారణ చేపడతాం. ఆధ్యాత్మికంగా విశిష్టమైన రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల వద్ద యంత్రాంగం భక్తుల రద్దీని క్రమబద్ధీకరించాలి. ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా చూడాలి. క్యూలైన్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి. రద్దీ ఉండే ఆలయాల్లో పోలీసు బందోబస్తు, మెడికల్ క్యాంప్లు ఏర్పాటు చేయాలి’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు. (Andhra Pradesh News)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

త్వరలో ఆదరణ-3 పథకం అమలు: మంత్రి సవిత
త్వరలో ఆదరణ-3 పథకం అమలు చేయబోతున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత వెల్లడించారు. - 
                                    
                                        

సమర్థ నాయకత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: నారా లోకేశ్
యువతకు ఉపాధి కల్పిస్తే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. - 
                                    
                                        

బాబోయ్ ఎంత పొడుగో.. తిరుమలలో ఎత్తైన మహిళ సందడి
తిరుమలలో ఏడు అడుగుల ఎత్తైన మహిళ సందడి చేశారు.
 - 
                                    
                                        

దుబాయిలోని ఇండియన్ కాన్సుల్ ప్రతినిధులతో మంత్రి నారాయణ బృందం భేటీ
ఏపీ మంత్రి నారాయణ బృందం దుబాయిలో పర్యటిస్తోంది. తొలి రోజు దుబాయిలోని ఇండియన్ కాన్సుల్ ప్రతినిధులు బీజీ కృష్ణన్, సెలీనా శశికాంత్తో మంత్రి భేటీ అయ్యారు. - 
                                    
                                        

నెల్లూరు జిల్లా జైలుకు మాజీ మంత్రి జోగి రమేశ్
నకిలీ మద్యం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, వైకాపా నేత జోగి రమేశ్, ఆయన సోదరుడు రాముకు న్యాయస్థానం ఈ నెల 13 వరకు రిమాండ్ విధించిన నేపథ్యంలో వారిద్దర్నీ విజయవాడ జైలు నుంచి నెల్లూరు జైలుకు తరలించారు. - 
                                    
                                        

బీసీల గురించి మాట్లాడే అర్హత జోగి రమేశ్కు లేదు: కొల్లు రవీంద్ర
కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ను పూర్తి సాక్ష్యాలతో పోలీసులు అరెస్టు చేశారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. - 
                                    
                                        

ఉద్యోగాల పేరిట రూ.5 కోట్లు వసూలు.. విడదల రజని అనుచరులపై ఫిర్యాదు
మాజీ మంత్రి, వైకాపా నేత విడదల రజని పీఏ, అనుచురులపై దోర్నాలకు చెందిన బీ ఫార్మసీ విద్యార్థి కృష్ణ, మరికొందరు పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. - 
                                    
                                        

కార్తిక మాసం రద్దీ.. కాకినాడలోని ఆలయాల్లో భద్రతపై పవన్ కీలక ఆదేశాలు
పవిత్ర కార్తిక మాసం(Karthika Masam) సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో కాకినాడ జిల్లా పరిధిలోని ప్రముఖ క్షేత్రాల్లో భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సూచించారు. - 
                                    
                                        

అప్పలరాజు మాస్టారూ.. మీ కళాత్మక బోధనా శైలి చూడముచ్చటగా ఉంది: మంత్రి లోకేశ్
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు బల్లెడ అప్పలరాజును మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అభినందించారు. - 
                                    
                                        

మంత్రి అనిత మానవత్వం.. రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆస్పత్రికి తరలించి!
రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు సకాలంలో వైద్య సహాయం అందేలా చేసి ఏపీ హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు.
 - 
                                    
                                        

కార్తిక సోమవారం.. ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ
కార్తిక సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజామునుంచే ఆలయాలకు భక్తులు బారులు తీరారు. విజయవాడ దుర్గా ఘాట్ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భక్తిశ్రద్ధలతో ప్రమిదలు వెలిగించి, అభిషేకాలు నిర్వహించారు. దీంతో అంతటా ఆధ్యాత్మిక శోభ నెలకొంది.
 - 
                                    
                                        

ఆధారాలతో బయటపడిన అసలు రంగు
తామే నకిలీ మద్యం వ్యవహారాన్ని వెలికి తీయించామని.. మేం లేకపోతే కూటమి ప్రభుత్వం నీరుగార్చేది అంటూ ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం యూనిట్, సీసాలను స్వాధీనం చేసుకున్న సమయంలో మాజీ మంత్రి జోగి రమేష్ అక్కడకు వచ్చి నానా యాగీ చేశారు. - 
                                    
                                        

అన్నపూర్ణ భర్తకు నైవేద్యాలకు కొదవా?
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలోని సీతారామాలయంలో శనివారం రాత్రి గౌరీ పరమేశ్వరుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. - 
                                    
                                        

జాతీయ రహదారి 2 నెలలకే.. రెండు ముక్కలు!
కొత్తగా వేసిన రోడ్డుపై రాకపోకలు ప్రారంభించి రెండు నెలలైనా కాలేదు. అప్పుడే పగుళ్లిచ్చింది. దీంతో వివిధ సాకులతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. - 
                                    
                                        

బాపట్ల జిల్లాలో కారు, లారీ ఢీ.. నలుగురు మృతి
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం సత్యవతిపేటలో ఆదివారం అర్ధరాత్రి దాటక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. - 
                                    
                                        

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్కు రిమాండ్
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్కు ఈ నెల 13 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. - 
                                    
                                        

రాయిచేప అందం.. ముళ్లకప్ప చందం
విశాఖలోని రుషికొండ బీచ్ సమీప సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు విభిన్న రకాల జీవులు చిక్కాయి. ఆకర్షణీయంగా పసుపు తోక కలిగిన రాయి చేపలతో పాటు ములుగుపాములు, ముళ్లకప్పలు లభ్యమయ్యాయి. - 
                                    
                                        

జోగి పాత్ర తేలడంతోనే అరెస్టు: ఎక్సైజ్ మంత్రి రవీంద్ర
నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఉన్నట్లు విచారణలో తేలడంతో అరెస్టయ్యారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. - 
                                    
                                        

సచిన్ను కలిసిన లోకేశ్ దంపతులు
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు ఆదివారం క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ను కలిశారు. ‘‘ఇది ఫ్యాన్ బాయ్ క్షణం. ఈ రోజు లెజెండ్ను కలిసే అదృష్టం లభించింది. ఆయన వినయం, ఆప్యాయతల గురించి ఇప్పటి వరకూ వినడమే. - 
                                    
                                        

తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు
కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోందని, దర్యాప్తు పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

కరూర్ తొక్కిసలాట ఘటన..విజయ్ కార్యాలయానికి సీబీఐ
 - 
                        
                            
అభిమాని హత్య కేసు.. దర్శన్, పవిత్రపై నేరాభియోగాలు
 - 
                        
                            

కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్.. అదరగొట్టిన ‘మంజుమ్మల్ బాయ్స్’.. విజేతలు వీళ్లే
 - 
                        
                            

ఏపీలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న హిందుజా గ్రూప్!
 - 
                        
                            

‘క్యాప్’ పెట్టుకోకుండానే కప్ కొట్టాడు..
 - 
                        
                            

క్యూ2 ఫలితాలు.. ఎయిర్టెల్ లాభం డబుల్
 


