Pawan Kalyan: ఆలయాల వద్ద భక్తుల రద్దీని క్రమబద్ధీకరించాలి: తొక్కిసలాట ఘటనపై పవన్‌ కల్యాణ్‌

Eenadu icon
By Andhra Pradesh News Team Updated : 01 Nov 2025 13:49 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 9 మంది భక్తులు మృతి చెందడం దురదృష్టకరమన్నారు. వారిలో చిన్నారి కూడా ఉండటం తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

‘‘బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది. ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉన్న ఆలయంలో జరిగిన ఈ ఘటనపై విచారణ చేపడతాం. ఆధ్యాత్మికంగా విశిష్టమైన రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల వద్ద యంత్రాంగం భక్తుల రద్దీని క్రమబద్ధీకరించాలి. ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా చూడాలి. క్యూలైన్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి. రద్దీ ఉండే ఆలయాల్లో పోలీసు బందోబస్తు, మెడికల్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేయాలి’’ అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. (Andhra Pradesh News)

Tags :
Published : 01 Nov 2025 13:44 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని