పారమార్థిక సత్యాలు
మానవ స్వభావం- సుఖం తప్ప దుఃఖాన్ని ఆమోదించనీయదు. సుఖదుఃఖాల మూలాలు ఉండేది అపారమైన తన కోరికలలోనని అతడు సామాన్య జ్ఞానంతో తెలుసుకోలేడు. ఆ పారమార్థిక సత్యం గ్రహించినప్పుడు జ్ఞానోదయమై అతడు మహనీయుడవుతాడు.
మానవ స్వభావం- సుఖం తప్ప దుఃఖాన్ని ఆమోదించనీయదు. సుఖదుఃఖాల మూలాలు ఉండేది అపారమైన తన కోరికలలోనని అతడు సామాన్య జ్ఞానంతో తెలుసుకోలేడు. ఆ పారమార్థిక సత్యం గ్రహించినప్పుడు జ్ఞానోదయమై అతడు మహనీయుడవుతాడు. సుఖదుఃఖాలు రెండింటిలో సంయమనం పాటిస్తూ భౌతిక జీవన గమనంపై నియంత్రణ సాధించుకోవడమెలాగో మనిషికి చెప్పడానికి భగవంతుడి మాటల్లోనే గీతోపదేశం జరిగింది. భౌతిక జీవనం జీవనది లాంటిది. అందులో ప్రవాహం ఆగిపోనంత కాలం ఎక్కడివరకు అది తీసుకువెళితే, దానితోపాటే సాగిపోవాలన్నది మనుషులు గ్రహించని మొట్టమొదటి జీవనసత్యం.
మనిషిలో జీవంపోసి భూమిపైకి పంపినప్పుడే అక్కడ అతడు జీవించడానికి భగవంతుడు అంతులేని అవకాశాలనూ సృష్టించాడు. కళ్ల ఎదుట కనబడుతున్నా అవి గుర్తించడానికి అతడు తడబడుతుంటాడు. జీవనమార్గంలో ఎదురవుతున్న ఎత్తుపల్లాలను తన అదృష్ట దురదృష్టాలతో సరిపోలుస్తూ విధిని, భగవంతుడిని అందుకు కారణంగా చూపిస్తాడు. మనిషి కార్యాచరణలన్నీ స్వయంకృతాలని అందుకు బాధ్యత అతడే వహించాలని గీతలో భగవంతుడు అన్నమాట అతడికి గుర్తురాదు.
జీవనగమనంలో ఎదురయ్యే ఏ చిన్న అడ్డంకినైనా మనిషి అదొక సమస్య అనుకుంటాడు. భగవంతుడి సృష్టిలో అవకాశాలు తప్ప సమస్యలుండవు. జీవం ఉన్నచోటనే సమస్యలు తలెత్తుతాయి. సమస్యలు ఎన్ని ఉంటే అక్కడ అంతగా జీవం ఉందని చెప్పడానికి అవి సంకేతాలు. మానసిక వైజ్ఞానికులు పరిష్కారం ఉండని సమస్యలే లేవంటారు. అది వెదకలేకపోవడమే మనిషికి ఉన్న నిజమైన సమస్య అని చమత్కరిస్తారు. చిరునవ్వుతో స్వీకరించగలిగినప్పుడు సమస్యల నుకున్నవి కనిపించవంటారు.
ఆదిశంకరులు మానవజన్మ దుర్లభమన్నారు. ఇహలోక జీవితం నేర్పుతున్న అనుభవాల పాఠాలు పునశ్చరణ చేసుకుని, అన్ని దృక్కోణాల నుంచి సమీక్షించుకుంటూ సాగినప్పుడు, భౌతిక ప్రపంచంలో సౌలభ్యం కానిదేదీ మనిషికి ఉండదు. ‘దైవత్వమే తనలో నిబిడీకృతమై ఉన్నప్పుడు మనిషి శక్తిహీనుడు ఎలాగ అవుతాడని ఆలోచించండి’ అని వివేకానందుడు అనేవారు. ఆత్మహత్యకు తెగబడుతున్న వారికి అర్థంకాని భౌతిక జీవనసత్యమది.
అవకాశాలను గుర్తించగానే చేజారిపోకుండా చూసుకోవలసిన బాధ్యత మనిషిదే అనేవారు అబ్రహాం లింకన్. దేశాధ్యక్ష పీఠం అధిరోహించడానికి అన్ని విధాలా అర్హుడినని తన సామర్థ్యానికి తగిన లక్ష్యం అదేనని భావించేవారు. ఆత్మవిశ్వాసాన్ని ఇంధనంగా తనలో నింపుకొని రాజకీయ జీవన ప్రస్థానం ప్రారంభించారు. ప్రాథమిక ఎన్నికలన్నింటిలో ఓటముల పరంపర వేధించినా ఆత్మన్యూనతకు లోను కాలేదు. పట్టుదలతో ప్రయత్నిస్తూ, చిట్టచివరకు అనుకున్నట్లు అమెరికా అధ్యక్ష సింహాసనంపై కూర్చున్నారు. ఓటమిని అంగీకరించినవాడెప్పుడూ గెలవలేడు. గెలుపు ఓటములు శాశ్వతం కాదు. అవి ఒకే నాణానికి ఇరుపక్కలు. మనిషి జీవితం ప్రయోగశాల వంటిది. ప్రయత్నలోపం లేకుండా అక్కడ ప్రయోగాలు చేసుకుపోతుంటే ఫలితం ఆలస్యమైనా రాక మానదు.
భౌతిక, ఆధ్యాత్మిక జీవితాలు భిన్నమైనవి కావు. అవి ఎగిరే పక్షికి రెండు రెక్కలవంటివి. ఆ రెక్కల్లో సమతుల్యం ఉన్నప్పుడు పక్షిలా ఎగిరి మనిషి భగవంతుణ్ని చేరుకోగల శక్తిమంతుడవుతాడు. భౌతిక జీవన సత్యాలను, భగవంతుడెవరో చెబుతున్న పారమార్థిక సత్యాలతో అనుసంధానించి లౌకిక జీవితాన్ని అర్థవంతంగా ముగిస్తాడు.
జొన్నలగడ్డ నారాయణమూర్తి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్పర్శ... సాంత్వన!
స్పర్శ అంటే తాకడం. అది- తనువుకు తనువుకు; తనువుకు మనసుకు మధ్య మాత్రమే కాదు... అనేక ఇంద్రియాలకు ఆనుసంధాన వారధి. దాని శక్తి అమోఘం, అమేయం. భౌతికమైన అనుభవం, మానసికమైన అనుభూతి, ఆధ్యాత్మికంగా పరిణతిలతోపాటు మనసును, ప్రకృతిని పులకింపజేయడం, రంజింప చేయడం స్పర్శ లక్షణం. -
మౌనం మధురం
మౌనం అనేది ఉద్దేశపూర్వక నిశ్శబ్దాన్ని నొక్కి చెప్పే తపస్సు. ఇది మనిషి మాటల్ని పరిమితం చేసే పవిత్రమైన అభ్యాసం. ఆధ్యాత్మిక అనుభవానికి అవసరమైన క్రమశిక్షణ. మౌనం మనసుకు సంబంధించిన నిశ్శబ్దం. ఇది గ్రహణశక్తిని పెంపొందిస్తుంది. సత్యాన్ని ప్రతిబింబించే ప్రశాంత జలాల మాదిరి నిశ్శబ్దం విషయాలను మరింత స్పష్టంగా చూసేందుకు సహాయపడుతుంది. -
దాన విధానం
చేసిన పుణ్యం చెడని పదార్థమన్నారు తాత్వికులు. భూమ్మీద కీర్తి ఎంతకాలం ఉంటుందో మానవులు అంతకాలం స్వర్గంలో ఉంటారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల బతికిన నాలుగురోజులూ పుణ్యకార్యాలు చేసి శాశ్వతమైన యశస్సును ఆర్జించుకోవాలి. ధర్మాచరణమే పుణ్యకార్యం. సత్యం, శుచిత్వం, దయ, దానం అనే నాలుగూ ధర్మదేవతకు నాలుగు పాదాలని సంప్రదాయ భావన. -
విద్యా వినయ సంపన్నత
మనిషి కొత్త విషయాలు తెలుసుకునేందుకు, నేర్చుకొనేందుకే పుడతాడంటారు. గడచే ప్రతి క్షణం జ్ఞానాన్ని బోధిస్తూనే ఉంటుంది. పుడమి తల్లి, కన్న తల్లికన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతాయి. అరిషడ్వర్గాలు ప్రమాదకరమైనవని, సద్గుణాలు ఆనందాన్నిస్తాయని సాధనతో తెలుసుకుంటాం. అందరూ అన్నింటా మేటి అనిపించుకోవడం సాధ్యం కాదు. -
పలుకుతేనెలు
మానవులందరూ మాట్లాడతారు. కాని, అందరి మాటలు ఒకే రీతిలో ఉండవు. కొందరి మాటలు కటువుగా రాళ్లలా ఉంటాయి. కొందరి మాటలు చక్కెర పలుకుల్లా ఉంటాయి. కొందరి మాటలు విషం చిమ్ముతాయి. కొందరి మాటలు తేనెలొలుకుతాయి. -
కష్టేఫలే
ఈ సృష్టిలో గ్రీష్మరుతువు, వర్షరుతువు ఎలాగైతే ఒకదాని తరవాత మరొకటి మారుతూ ఉంటాయో అలాగే జీవితంలోను కష్టాల వెంబడి సుఖాలు వస్తూ ఉంటాయి. కాని కష్టాలు ఆవహించినప్పుడు మాత్రం కొందరు బెదిరిపోతారు. ఈ ప్రకృతిలో ఎండ తగలకుండా పెరిగిన చెట్టులేదు. కష్టం లేకుండా ఎదిగిన మనిషి లేడు. -
జీవిత సాక్షాత్కారం
చెట్టు జీవిస్తోంది. పక్షి జీవిస్తోంది. పాము జీవిస్తోంది. ఎడతెగక పారుతూ నది జీవిస్తూ ఇతరులను జీవింపజేస్తోంది. జీవనం తన స్వరూపాన్ని చూపించాలని అనుకుంటే ఆ మానవ జీవితం గొప్పదే. ఒక జీవితంలో వంద జీవితాలు అనుభవించాను అన్నారు స్వామి వివేకానంద. జీవనసారం తెలుసుకుని ధార్మిక జీవనానికి కట్టుబడి ఉండాలి అంటున్నాయి శాస్త్రాలు. -
బోనం... భాగ్యం!
ప్రశస్తమైన ప్రకృతి సకల శక్తులకు ఆలంబన. ప్రకృతి నుంచే సమస్త చైతన్యం ఉత్పన్నమవుతుంది. ఆ చైతన్యశక్తిని ఆర్ష ధర్మం పలు రూపాల్లో దర్శిస్తోంది. శక్తి లేనిదే సృష్టి మనుగడ లేదు. శక్తి నిత్యత్వం ప్రకృతికి సర్వదా నూతనత్వాన్ని ఆపాదిస్తోంది. అందుకే ప్రకృతిని పరమాత్మ రూపంగా మనం ఆరాధిస్తున్నాం. -
లోకప్రియం
ఒక్కొక్కరికీ ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. మనుషులకే కాకుండా పశువులు, పక్షులు, వృక్షాలు లాంటి వాటికి కూడా ఇష్టాలుంటాయిని ప్రకృతి పరిశీలకుల మాటల వల్ల తెలుస్తోంది. వృక్షాలకు కూడా ప్రాణం ఉంటుందని, వాటికి ప్రియమైన వాతావరణ పరిస్థితులకు స్పందించి సుఖదుఃఖాల అనుభూతి చెందుతాయని జగదీష్ చంద్రబోస్ నిరూపించారు. -
ధన్య జీవితం
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు జన్మించాక ఎప్పుడో ఒకప్పుడు మరణం అనివార్యం. -
ధర్మ పోరాటం
ఒకరిని ప్రేమించి అభిమానించి వారి రక్షణ కోసం ధర్మ సమ్మతంగా పోరాడితే అది సముచితమైందిగా హదీసులు వివరిస్తున్నాయి. అన్యాయానికి తోడ్పాటునందిస్తే అది ఆత్మహత్యా సదృశమని దివ్య ఖురాన్ గ్రంథం బోధిస్తుంది. ధర్మాధర్మాలలో ఏ వైపున ఉన్నా నా వారు నా వారే అనుకుంటే అది దురభిమానమవుతుంది. -
శుభ ఏకాదశి
ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు పంచమి, దశమి, ఏకాదశి... వంటి మంచి రోజులను ఎంచుకోవడం చాలామందికి అలవాటు. -
మహోన్నతం
మనిషికి భగవంతుడిచ్చిన వరం- మాట. మాట్లాడే శక్తి మనిషికే ఉంది. అయితే అయినదానికి, కానిదానికి మాట్లాడవలసిన అవసరంలేదు. -
హారతి
శాస్త్రోక్తంగా చేసే పూజ- పునస్కారాల్లో పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, దక్షిణ, మంత్రపుష్పం, హారతి, ప్రదక్షిణం వంటివన్నీ దేవతార్చనలోని అంశాలే. -
నాలుగు మంచి మాటలు
మైత్రి, కరుణ, ముదిత (సానుకూల మానసిక స్థితి), ఉపేక్ష అనే నాలుగు సాధనాలతో జీవితాన్ని చింతనా రహితంగా అలంకరించుకోవచ్చు. ఈ నాలుగు భావనలూ ప్రతి మనిషిలోనూ ఉంటాయి. వాటిని అభివృద్ధి చేసుకోవడంలోనే ధన్యత ఉంది. -
ఆధ్యాత్మిక సాధన
ఇహలోక బంధాల నుంచి విముక్తి కలిగించి, పారలౌకిక మార్గమేదో తెలిపి, ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపకరించే ప్రక్రియనే సాధన అంటారు. ధ్యానం, జపం, నామస్మరణ మొదలైన క్రియలతో చిత్తవృత్తుల పరుగులకు కళ్ళెం వేయడానికి చేసే ప్రయత్నమే సాధన. -
అదృష్టం - దురదృష్టం
మన జీవితంలో అదృష్టం, దురదృష్టం అనే మాటలు తరచుగా ప్రస్తావనకు వస్తాయి. కొందరిని అదృష్టవంతులుగాను, కొందరిని దురదృష్టవంతులుగాను పేర్కొంటుంటాం. దృష్టమంటే కంటికి కనిపించేది. దురదృష్టం దానికి వ్యతిరేకమైనది. కనబడనిది మనం ఊహించలేనిది. హఠాత్తుగా అనూహ్యంగా ఏదైనా మంచి జరిగినా, ప్రమాదం తప్పిపోయినా అదృష్టమనుకుంటాం. -
కష్టం-సుఖం
తన జీవితం సమస్యా రహితంగా, సుఖంగా సాగాలని ప్రతీ మనిషికి ఉండటం సమంజసమే. కాని తనకే ఏ సమస్యా రాకూడదు, తాను సుఖంగా బతికితే చాలు అనుకోవడం అనేక కష్టాలకు మూలం అవుతుంది. -
వెలుగు నుంచి చీకటికి...
కష్టసుఖాలు, సుఖదుఃఖాలు, చీకటివెలుగులన్నవి పడుగుపేకలు. అవి జీవితంలో సర్వసాధారణమని మాటవరసకు అంటాం కాని కష్టానికి, నష్టానికి, బాధకు వెరవని వారుండరు. -
అన్నమహిమ
అసంఖ్యాక ప్రాణికోటికి ఆహారం ‘అన్నం’. జఠరాగ్ని మండిపోతున్నప్పుడు ఆకలివేస్తుంది. ఆకలిని చల్లార్చడానికి అన్నం కావాలి. భోజన పదార్థాలన్నీ అన్నాలే. అన్నాన్ని తింటేనే ఆకలి చల్లారుతుంది. ఆత్మారాముడు సంతోషిస్తాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్