సమయమే సంపద
మనిషి తనకు ఇష్టమైన పని అయితే ఎంత సమయమైనా వెచ్చిస్తాడు. ఇష్టం కాని పనిని కష్టంగా భావించి అసలు సమయమే కేటాయించడు. జీవితం ఎంతో అమూల్యమైంది. సమయం అంతకు మించి విలువైంది.
మనిషి తనకు ఇష్టమైన పని అయితే ఎంత సమయమైనా వెచ్చిస్తాడు. ఇష్టం కాని పనిని కష్టంగా భావించి అసలు సమయమే కేటాయించడు. జీవితం ఎంతో అమూల్యమైంది. సమయం అంతకు మించి విలువైంది. మనకు తెలియకుండానే క్షణాలు గడిచిపోతుంటాయి. మనం సంతోషం కోసం, ఆనందం కోసం వెదుకుతుంటాం. అది ధర్మబద్ధమైనదో, అలౌకికమైనదో అయితే మంచిదే. కేవలం భౌతికమైనదో, ఐహికమైనదో అయితే గడుపుతున్న సమయం గురించి ఆలోచించాల్సిందే! ఏ పనికి ఎంత సమయం కేటాయించాలన్న సమయజ్ఞతను ఎరిగినవాడే గ్రహించగలడు.
మనకు తెలియకుండానే అనేక సందర్భాల్లో కాలాన్ని వృథా చేస్తుంటాం. సంభాషణ ఎంత సంక్షిప్తంగా ఉంటే సమయం అంతగా సద్వినియోగమవుతుంది. విధ్యుక్త ధర్మ నిర్వహణలో కొందరికి సమయం సరిపోని మాట సత్యమే! అయితే ఎవరైనా మిగతా సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారో తమకు తాముగా ఆలోచించాలి. ఏ వ్యవహారాన్ని అయినా సమయాన్ని దృష్టిలో పెట్టుకునే ముగించుకోవాలి. మన జీవితంలో బాల్య, కౌమార, యౌవన, గృహస్థ, వృద్ధాప్య దశలనేవి అనివార్యం. ఈ దశల్లో దొరికే అవకాశాలను అందిపుచ్చుకొని నిర్ణీత సమయాలలో నిర్ణీత జీవన విధానాలను, విధులను అనుసరించాలి. ఏ దశలోనైనా విలువలకు, సంస్కృతీ సంప్రదాయాలకు, ధార్మిక నిబద్ధతకు సమయం ఇచ్చి తీరాలి. సమయాన్ని మించిన సంపద లేదు. సమయానికి ముందే ఒక్కొక్కప్పుడు పరుగెత్తాల్సి వస్తుంది. ఒక్కొక్కప్పుడు సమయంతో పాటు పరుగులు తీయాల్సి వస్తుంది. సమయాన్ని నియంత్రించుకోవడం వల్ల, సమయ నియంత్రణలోనే ఉండటం వల్ల విజయం సాధించగలం.
తాత్కాలిక భోగలాలసతకు, విలాసాలకు బానిసలైనవాళ్లు సమయాన్ని పట్టించుకోరు. జీవితంలోని అమూల్య క్షణాలను జారవిడుచుకుంటున్నామన్న సత్యాన్ని గ్రహించలేరు. వార్ధక్యంలో అటువంటివాళ్లకు మిగిలేది పశ్చాత్తాపమే.
‘కష్టాలొచ్చినప్పుడే కరుణా సింధువును శరణు వేడుతాం. సుఖశాంతులు ఉన్నప్పుడే, జవసత్వాలు ఉన్నప్పుడే జగత్పతిని స్మరిస్తే కష్టాలే రావు కదా!’ అంటాడు ప్రాచీన హిందీ భక్తకవి కబీర్దాసు. ఏ క్షణాన ఏ మార్పును చూస్తామో తెలియదని సాగర కెరటమే చెబుతోంది. ‘లెక్కించే వాటిలో కాలాన్ని నేను’ అన్నాడు గీతాచార్యుడు. మనిషి సర్వదా లక్ష్యపెట్టాల్సింది కాలాన్నే అని అర్థం.
పూర్వం రుషులు, యోగులు, కవులు, అవధూతలు సమయాన్ని స్వాధీనంలో ఉంచుకోవడం వల్లనే జాతికి అమృతభాండంలాంటి జ్ఞాన భాండాగారాన్ని అందించగలిగారు. సమ్మతికైనా, దుర్మతికైనా ఒక క్షణం చాలు- యశోశిఖరాగ్రానికి చేరడానికి, అథఃపాతాళానికి పడిపోవడానికి. ఖ్యాతికి, అపఖ్యాతికి బీజం సమయమే.
లంకకు చేరిన హనుమ సీతాన్వేషణలోనే నిమగ్నమై తిరిగాడు తప్ప, లంకాపురి సౌందర్య వీక్షణానికి ఏ క్షణమూ వినియోగించలేదు. కాలం పాండవులను అరణ్య-అజ్ఞాత వాస బంధనాలతో కట్టి పడేసింది. అయినా ఆ సమయాన్ని వారు సద్వినియోగ పరచుకున్నారు. అది ధీరుల లక్షణం. సమయమే సర్వేశ్వర స్వరూపం. దాన్ని గౌరవించాలి. ప్రేమించాలి. పాలించాలి. పాటించాలి. ఇతరుల సమయాన్ని సంగ్రహించకూడదన్న సత్యం నిత్యం గుర్తుంచుకోవాలి. సంకల్ప శుద్ధి కలవాడు సమయం చాలడం లేదనలేడు. సమయజ్ఞుడి కోసం సమయం, అవకాశం నిరీక్షిస్తూనే ఉంటాయి!
చిమ్మపూడి శ్రీరామమూర్తి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్పర్శ... సాంత్వన!
స్పర్శ అంటే తాకడం. అది- తనువుకు తనువుకు; తనువుకు మనసుకు మధ్య మాత్రమే కాదు... అనేక ఇంద్రియాలకు ఆనుసంధాన వారధి. దాని శక్తి అమోఘం, అమేయం. భౌతికమైన అనుభవం, మానసికమైన అనుభూతి, ఆధ్యాత్మికంగా పరిణతిలతోపాటు మనసును, ప్రకృతిని పులకింపజేయడం, రంజింప చేయడం స్పర్శ లక్షణం. -
మౌనం మధురం
మౌనం అనేది ఉద్దేశపూర్వక నిశ్శబ్దాన్ని నొక్కి చెప్పే తపస్సు. ఇది మనిషి మాటల్ని పరిమితం చేసే పవిత్రమైన అభ్యాసం. ఆధ్యాత్మిక అనుభవానికి అవసరమైన క్రమశిక్షణ. మౌనం మనసుకు సంబంధించిన నిశ్శబ్దం. ఇది గ్రహణశక్తిని పెంపొందిస్తుంది. సత్యాన్ని ప్రతిబింబించే ప్రశాంత జలాల మాదిరి నిశ్శబ్దం విషయాలను మరింత స్పష్టంగా చూసేందుకు సహాయపడుతుంది. -
దాన విధానం
చేసిన పుణ్యం చెడని పదార్థమన్నారు తాత్వికులు. భూమ్మీద కీర్తి ఎంతకాలం ఉంటుందో మానవులు అంతకాలం స్వర్గంలో ఉంటారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల బతికిన నాలుగురోజులూ పుణ్యకార్యాలు చేసి శాశ్వతమైన యశస్సును ఆర్జించుకోవాలి. ధర్మాచరణమే పుణ్యకార్యం. సత్యం, శుచిత్వం, దయ, దానం అనే నాలుగూ ధర్మదేవతకు నాలుగు పాదాలని సంప్రదాయ భావన. -
విద్యా వినయ సంపన్నత
మనిషి కొత్త విషయాలు తెలుసుకునేందుకు, నేర్చుకొనేందుకే పుడతాడంటారు. గడచే ప్రతి క్షణం జ్ఞానాన్ని బోధిస్తూనే ఉంటుంది. పుడమి తల్లి, కన్న తల్లికన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతాయి. అరిషడ్వర్గాలు ప్రమాదకరమైనవని, సద్గుణాలు ఆనందాన్నిస్తాయని సాధనతో తెలుసుకుంటాం. అందరూ అన్నింటా మేటి అనిపించుకోవడం సాధ్యం కాదు. -
పలుకుతేనెలు
మానవులందరూ మాట్లాడతారు. కాని, అందరి మాటలు ఒకే రీతిలో ఉండవు. కొందరి మాటలు కటువుగా రాళ్లలా ఉంటాయి. కొందరి మాటలు చక్కెర పలుకుల్లా ఉంటాయి. కొందరి మాటలు విషం చిమ్ముతాయి. కొందరి మాటలు తేనెలొలుకుతాయి. -
కష్టేఫలే
ఈ సృష్టిలో గ్రీష్మరుతువు, వర్షరుతువు ఎలాగైతే ఒకదాని తరవాత మరొకటి మారుతూ ఉంటాయో అలాగే జీవితంలోను కష్టాల వెంబడి సుఖాలు వస్తూ ఉంటాయి. కాని కష్టాలు ఆవహించినప్పుడు మాత్రం కొందరు బెదిరిపోతారు. ఈ ప్రకృతిలో ఎండ తగలకుండా పెరిగిన చెట్టులేదు. కష్టం లేకుండా ఎదిగిన మనిషి లేడు. -
జీవిత సాక్షాత్కారం
చెట్టు జీవిస్తోంది. పక్షి జీవిస్తోంది. పాము జీవిస్తోంది. ఎడతెగక పారుతూ నది జీవిస్తూ ఇతరులను జీవింపజేస్తోంది. జీవనం తన స్వరూపాన్ని చూపించాలని అనుకుంటే ఆ మానవ జీవితం గొప్పదే. ఒక జీవితంలో వంద జీవితాలు అనుభవించాను అన్నారు స్వామి వివేకానంద. జీవనసారం తెలుసుకుని ధార్మిక జీవనానికి కట్టుబడి ఉండాలి అంటున్నాయి శాస్త్రాలు. -
బోనం... భాగ్యం!
ప్రశస్తమైన ప్రకృతి సకల శక్తులకు ఆలంబన. ప్రకృతి నుంచే సమస్త చైతన్యం ఉత్పన్నమవుతుంది. ఆ చైతన్యశక్తిని ఆర్ష ధర్మం పలు రూపాల్లో దర్శిస్తోంది. శక్తి లేనిదే సృష్టి మనుగడ లేదు. శక్తి నిత్యత్వం ప్రకృతికి సర్వదా నూతనత్వాన్ని ఆపాదిస్తోంది. అందుకే ప్రకృతిని పరమాత్మ రూపంగా మనం ఆరాధిస్తున్నాం. -
లోకప్రియం
ఒక్కొక్కరికీ ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. మనుషులకే కాకుండా పశువులు, పక్షులు, వృక్షాలు లాంటి వాటికి కూడా ఇష్టాలుంటాయిని ప్రకృతి పరిశీలకుల మాటల వల్ల తెలుస్తోంది. వృక్షాలకు కూడా ప్రాణం ఉంటుందని, వాటికి ప్రియమైన వాతావరణ పరిస్థితులకు స్పందించి సుఖదుఃఖాల అనుభూతి చెందుతాయని జగదీష్ చంద్రబోస్ నిరూపించారు. -
ధన్య జీవితం
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు జన్మించాక ఎప్పుడో ఒకప్పుడు మరణం అనివార్యం. -
ధర్మ పోరాటం
ఒకరిని ప్రేమించి అభిమానించి వారి రక్షణ కోసం ధర్మ సమ్మతంగా పోరాడితే అది సముచితమైందిగా హదీసులు వివరిస్తున్నాయి. అన్యాయానికి తోడ్పాటునందిస్తే అది ఆత్మహత్యా సదృశమని దివ్య ఖురాన్ గ్రంథం బోధిస్తుంది. ధర్మాధర్మాలలో ఏ వైపున ఉన్నా నా వారు నా వారే అనుకుంటే అది దురభిమానమవుతుంది. -
శుభ ఏకాదశి
ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు పంచమి, దశమి, ఏకాదశి... వంటి మంచి రోజులను ఎంచుకోవడం చాలామందికి అలవాటు. -
మహోన్నతం
మనిషికి భగవంతుడిచ్చిన వరం- మాట. మాట్లాడే శక్తి మనిషికే ఉంది. అయితే అయినదానికి, కానిదానికి మాట్లాడవలసిన అవసరంలేదు. -
హారతి
శాస్త్రోక్తంగా చేసే పూజ- పునస్కారాల్లో పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, దక్షిణ, మంత్రపుష్పం, హారతి, ప్రదక్షిణం వంటివన్నీ దేవతార్చనలోని అంశాలే. -
నాలుగు మంచి మాటలు
మైత్రి, కరుణ, ముదిత (సానుకూల మానసిక స్థితి), ఉపేక్ష అనే నాలుగు సాధనాలతో జీవితాన్ని చింతనా రహితంగా అలంకరించుకోవచ్చు. ఈ నాలుగు భావనలూ ప్రతి మనిషిలోనూ ఉంటాయి. వాటిని అభివృద్ధి చేసుకోవడంలోనే ధన్యత ఉంది. -
ఆధ్యాత్మిక సాధన
ఇహలోక బంధాల నుంచి విముక్తి కలిగించి, పారలౌకిక మార్గమేదో తెలిపి, ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపకరించే ప్రక్రియనే సాధన అంటారు. ధ్యానం, జపం, నామస్మరణ మొదలైన క్రియలతో చిత్తవృత్తుల పరుగులకు కళ్ళెం వేయడానికి చేసే ప్రయత్నమే సాధన. -
అదృష్టం - దురదృష్టం
మన జీవితంలో అదృష్టం, దురదృష్టం అనే మాటలు తరచుగా ప్రస్తావనకు వస్తాయి. కొందరిని అదృష్టవంతులుగాను, కొందరిని దురదృష్టవంతులుగాను పేర్కొంటుంటాం. దృష్టమంటే కంటికి కనిపించేది. దురదృష్టం దానికి వ్యతిరేకమైనది. కనబడనిది మనం ఊహించలేనిది. హఠాత్తుగా అనూహ్యంగా ఏదైనా మంచి జరిగినా, ప్రమాదం తప్పిపోయినా అదృష్టమనుకుంటాం. -
కష్టం-సుఖం
తన జీవితం సమస్యా రహితంగా, సుఖంగా సాగాలని ప్రతీ మనిషికి ఉండటం సమంజసమే. కాని తనకే ఏ సమస్యా రాకూడదు, తాను సుఖంగా బతికితే చాలు అనుకోవడం అనేక కష్టాలకు మూలం అవుతుంది. -
వెలుగు నుంచి చీకటికి...
కష్టసుఖాలు, సుఖదుఃఖాలు, చీకటివెలుగులన్నవి పడుగుపేకలు. అవి జీవితంలో సర్వసాధారణమని మాటవరసకు అంటాం కాని కష్టానికి, నష్టానికి, బాధకు వెరవని వారుండరు. -
అన్నమహిమ
అసంఖ్యాక ప్రాణికోటికి ఆహారం ‘అన్నం’. జఠరాగ్ని మండిపోతున్నప్పుడు ఆకలివేస్తుంది. ఆకలిని చల్లార్చడానికి అన్నం కావాలి. భోజన పదార్థాలన్నీ అన్నాలే. అన్నాన్ని తింటేనే ఆకలి చల్లారుతుంది. ఆత్మారాముడు సంతోషిస్తాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం