అనుభవ సారం
జీవితం ప్రతీ క్షణం ఒక అనుభవమే. అటువంటి అనుభవాలే జ్ఞాపకాలుగా కాలక్రమంలో పాఠాలను చెబుతాయి. జీవితానికి మార్గదర్శనం చేస్తాయి. కానీ ఎల్లకాలం ఒకే రకమైన అనుభవాలుంటే మాత్రం విసుగు పుట్టిస్తాయి. అప్పుడు జీవితం నిస్తేజంగా తయారవుతుంది. అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకునే ఉద్దేశంతో, గాలి మార్పు పేరుతో వేరువేరు ప్రదేశాలను పర్యటించమని పెద్దలు చెబుతారు.
జీవితం ప్రతీ క్షణం ఒక అనుభవమే. అటువంటి అనుభవాలే జ్ఞాపకాలుగా కాలక్రమంలో పాఠాలను చెబుతాయి. జీవితానికి మార్గదర్శనం చేస్తాయి. కానీ ఎల్లకాలం ఒకే రకమైన అనుభవాలుంటే మాత్రం విసుగు పుట్టిస్తాయి. అప్పుడు జీవితం నిస్తేజంగా తయారవుతుంది. అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకునే ఉద్దేశంతో, గాలి మార్పు పేరుతో వేరువేరు ప్రదేశాలను పర్యటించమని పెద్దలు చెబుతారు. పూర్వకాలపు విద్యావిధానంలో మహారాజు బిడ్డయినా సరే సామాన్య పౌరుల సంతానంతో సమానంగా విద్యను అభ్యసించాలని చేసిన కట్టుబాటు ఇందుకే. దానితోపాటు విద్యాభ్యాసం తరవాత పట్టాభిషేకానికి ముందు దేశ పర్యటన చేయాలనే నియమం ఉండేది. అలా చేయడంవల్ల ఎన్నెన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. జీవితంలో ఆటుపోట్లు అనుభవంలోకి వస్తాయి. లోకజ్ఞానం పెరుగుతుంది. మార్పు అభిలషణీయం. నిజమైన సుఖానుభవం కలగాలంటే మనిషి కష్టాలను అనుభవించవలసి రావడం తప్పనిసరి అంటారు అనుభవజ్ఞులు.
‘ఒక మనిషి జీవితంలో ఆనందాన్ని అనుభవించాలంటే ప్రాకృతిక ధర్మం ఎప్పటికప్పుడు మార్పు చెందుతుండాలి. ప్రతి అంశానికీ భిన్నమైన అనుభవం ఒకటుందనే అవగాహన కలగాలి. అప్పుడే ఓ కొత్త సుఖం అందుబాటులోకి వస్తుంది’ అంటాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆనందాన్ని, కొత్త కొత్త సుఖాలను అనుభవిస్తున్న మనిషికి ఒకానొక సమయంలో అసలు సుఖాలంటేనే ముఖం మొత్తుతుంది. అప్పుడు అతడికి కావాల్సింది- ఇంతకు ముందు అనుభవించని మరొక నూతన అనుభవం. వినడానికి వింతగా ఉన్నా అతడికి అప్పుడు కావలసింది దుఃఖమే. ఒకసారి కుంతీదేవి శ్రీకృష్ణుడితో- కష్టాల్లోనే మనిషి స్థితప్రజ్ఞ వ్యక్తమవుతుందని, కాబట్టి కష్టాలు కలిగించే సంఘటనలు అంటేనే తనకిష్టమని చెప్పిందట.
భగవంతుడు సైతం తన సృష్టిలో సుఖం విలువ తెలియజెయ్యడానికి కష్టాన్ని, వెలుగు విలువ తెలపడానికి చీకటిని, తెలుపురంగు స్పష్టత తెలియడానికి నలుపురంగును... ఇలా ప్రతి విషయానికీ వ్యతిరేకతలను సృష్టించాడంటారు. మనిషి వాటి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకుని జీవితాన్ని మలచుకోవాలి.
చిత్రకారుడు తన చిత్రానికి వేసిన రంగుల అందం ఇనుమడించడానికి వాటి వ్యతిరేక రంగులను అంచులుగా చిత్రిస్తాడు. మానవుడు కష్టాలు కలిగినప్పుడు కుంగిపోకుండా, సుఖాలు కలిగినప్పుడు పొంగిపోకుండా నిండుకుండలా దేనికీ చలించని మనస్తత్వంతో ఉండాలి. కష్టమొచ్చినా సుఖమొచ్చినా తటస్థంగా ఉండగలగాలి. అప్పుడే జీవితంలో మాధుర్యం తెలుస్తుంది. ఆ తత్వం అలవడాలంటే అన్నిరకాల అనుభవాలూ చవిచూడాలి.
నేటితరం పిల్లలకు ఏ కష్టమూ తెలియకుండా పెంచాలనే తాపత్రయంతో వారి అవసరానికి మించిన సుఖాలను, సౌకర్యాలను కల్పిస్తున్నారు తల్లిదండ్రులు. దానికి కారణం తాము బాల్యంలో ఎన్నో కష్టాలు పడ్డామని, వారికి కూడా అవి దాపురించకూడదనే ఆలోచన! కానీ అది సరికాదు. ఎందుకంటే... కష్టం, బాధ, ఇబ్బంది లాంటివి తెలిస్తేనే- సుఖం విలువ, అందులోని మాధుర్యం తెలుస్తాయి. విపత్కర పరిస్థితులు కలిగినా తట్టుకుని నిలబడగలుగుతారు. అలాగని వారిని కావాలని కష్టాల్లోకి నెట్టేయమని కాదు. అవసరానికి మించిన సుఖాలు అలవాటు చేయకుండా ఉంటే చాలు!
గోపాలుని రఘుపతిరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సహనానికీ హద్దుంటుంది...
సహనం సంస్కారవంతమైన పదం. సహనశీలత గొప్ప మానవతా గుణం. సహనంతోనే శాంతిని సాధించాలి. నిజమే! ఎంతవరకు సహనం వహించాలనేదీ ఆలోచించాలి. కొంతవరకే సహనానికి మంచి ఫలితం ఉంటుంది. హద్దు మీరితే ఎంతటి సహనశీలుడైనా తిరగబడతాడు. సహనాన్ని కొందరు బలహీనతగా, చేతగానితనంగా భావిస్తారు. అనువుగాని చోట అధికులమనరాదు. ఒదిగి ఉండటం వల్ల చిన్నతనం రాదు. -
ధర్మమే సర్వం
‘ధర్మం పాటించండి’ అనే మాట సాధారణంగా వినిపిస్తుంది. రెండక్షరాల ఈ పదం వెనక చాలా పెద్దభావం ఉంది. లోతైన వివరణ ఉంది. చేయదగినపని, లక్షణం, స్వభావం, పద్ధతి, తగినది, దానగుణం అనే వివిధ అర్థాల్లో ఈ పదాన్ని వాడతారు. సమాజంలో ప్రతివారికీ ఏదో ఒక చేయదగిన పని ఉంటుంది. -
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది.