‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది.
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. ఋతువులలో వసంతం భగవద్విభూతి కలిగినదని భగవద్గీత చెబుతోంది. చిగురింతలతో, పూతలతో ప్రకృతి నూతనత్వాన్ని ప్రదర్శించేవేళ నూతన వత్సరాన్ని ఏర్పరచారు ఋషులు. ఏడాదిలో మొదటి తొమ్మిదిరోజులు ఒక పూర్ణత్వం. అందుకే వసంత నవరాత్రులను దేవతారాధనలతో, సత్సంకల్పాలతో పవిత్రంగా నిర్వహించడం ఆనవాయితీ. ఆరంభం బాగుంటే అంతా బాగుంటుందని ఒక భావన. అందుకే సంవత్సరానికి ఆది అయిన పాడ్యమిని శుభంగా, మంగళప్రదంగా పండుగగా జరుపుకొని ఏడాదిని స్వాగతిస్తాం.
ఈ కాలమానం చంద్రుడు నక్షత్రాల్లో సంచరించే గమనాన్ని ఆధారంగా ఏర్పరచినది. ఉడు(నక్షత్ర) గమనమే ‘ఉగం’. ఉత్తర, దక్షిణాయనాల యుగళం(జంట)‘యుగం’. అందుకే యుగనామం సంవత్సరానికి పర్యాయం. కనుక ఉగాది, యుగాది అని కూడా వ్యవహరించవచ్చు.
పురాణ శాస్త్రాల ప్రకారం చైత్రమాసం ప్రథమ దివసమే బ్రహ్మ సృష్టిని ఆరంభించాడట. అందుకే సృష్టికి ఆది, ‘కల్పాది’ అని కూడా శాస్త్రోక్తి. మత్స్యావతారం ఆవిర్భవించిన సమయంగానూ దీన్ని కొందరు పరిగణిస్తారు. గత కల్పాంతంలో మత్స్య మూర్తిగా వ్యక్తమైన నారాయణుడు, ఆనాటి సృష్టిబీజాలను భద్రపరచి, తరవాతి కల్పంలో వేదాలను ఉద్ధరించి, విధాతకు ప్రసాదించాడని పురాణకథనం.
ఈ రోజున కొన్ని ముఖ్యకర్తవ్యాలను సంప్రదాయ పద్ధతులుగా ధర్మశాస్త్రాలు నిర్దేశించాయి. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి, భగవత్ స్మరణతో ఏడాదిని స్వాగతించాలి. అభ్యంగస్నానం ముఖ్యవిధి. ముగ్గులతో, మంగళ తోరణాలతో అలంకరించుకున్న ఇంటిలో, నూతన వస్త్రాలు ధరించి ఇంటిల్లపాదీ గణపతిని, సరస్వతిని, ఇష్టదేవతలను అర్చించాలి. అటుపై దైవజ్ఞుడి ద్వారా పంచాంగ శ్రవణం చేయాలి. ఈ విధిలో సంవత్సర స్వరూపాన్ని తెలుసుకోవడం ముఖ్యాంశం. ఈ ఏడాది ప్రత్యేకతలు, పర్వాలు, చేయవలసిన కృత్యాలు... ఈ శ్రవణంలో అవగాహనకు వస్తాయి.
తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలనే అయిదు అంగాల కాలగణనే పంచాంగం. కల్పం ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎన్ని మన్వంతరాలు, ఎన్ని యుగాలు గడిచాయో, ఇప్పుడు ఏ శకం నడుస్తున్నదో, కలియుగం ఆరంభమై ఎన్నేళ్లు గడిచాయో కూడా లెక్కకట్టి అందిస్తుంది భారతీయ పంచాంగం. కాలాన్నీ కాలభాగాలైన తిథి వారాదులనీ దేవతా స్వరూపాలుగా భావించే శాస్త్రం వాటి స్మరణ వల్ల ఆయా కాలభాగాల్లో అధిదేవతల అనుగ్రహం లభిస్తుందని చెబుతోంది.
నింబసుమం(వేపపూత), మామిడి, బెల్లం, ఆవునేయి కలిపిన ఉగాది ప్రసాదాన్ని, దేవతకు నివేదించిన తరవాత, భక్తితో స్వీకరించాలన్నది ముఖ్య విధి. చలివేంద్రాలను ఆరంభించడం, నీటి కడవల దానం కూడా మంచిదని ధర్మశాస్త్ర వచనం.
ప్రభవాది అరవై సంవత్సరాలలో ముప్ఫై ఎనిమిదోది ‘క్రోధి’ నామసంవత్సరం. ఈ అరవై పేర్లలో కొన్ని సౌమ్యంగా ఉంటే, మరికొన్ని తీవ్రంగా అనిపిస్తాయి. ఇవి కాలశక్తికి సంకేతాలుగా ఉన్న నామాలు. కాలంలో ఉండే సౌమ్య, తీవ్రభావాలే ఈ పేర్లు. క్రోధాన్ని ప్రతికూల గుణంగా చాలామంది భావిస్తారు. కానీ ధర్మరక్షణకోసం అధర్మంపై; నీతి పాలనకోసం అవినీతిపై; సాధుక్షేమంకోసం దుష్టత్వంపై చూపించే క్రోధం దివ్యమైనదేనని ఆర్షభావన. మంచీచెడూ, సుఖదుఃఖాలు కాలంలో, లోకంలో అనివార్యంగా రెండూ ఉంటాయి. అయితే సద్భావంతో దైవశక్తిని అనుసంధానించి, శుభంగా స్వాగతిస్తే కాలపురుషుడు పరిణామంలో అన్నీ మంగళకరంగానే మలుస్తాడు.!
సామవేదం షణ్ముఖశర్మ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్పర్శ... సాంత్వన!
స్పర్శ అంటే తాకడం. అది- తనువుకు తనువుకు; తనువుకు మనసుకు మధ్య మాత్రమే కాదు... అనేక ఇంద్రియాలకు ఆనుసంధాన వారధి. దాని శక్తి అమోఘం, అమేయం. భౌతికమైన అనుభవం, మానసికమైన అనుభూతి, ఆధ్యాత్మికంగా పరిణతిలతోపాటు మనసును, ప్రకృతిని పులకింపజేయడం, రంజింప చేయడం స్పర్శ లక్షణం. -
మౌనం మధురం
మౌనం అనేది ఉద్దేశపూర్వక నిశ్శబ్దాన్ని నొక్కి చెప్పే తపస్సు. ఇది మనిషి మాటల్ని పరిమితం చేసే పవిత్రమైన అభ్యాసం. ఆధ్యాత్మిక అనుభవానికి అవసరమైన క్రమశిక్షణ. మౌనం మనసుకు సంబంధించిన నిశ్శబ్దం. ఇది గ్రహణశక్తిని పెంపొందిస్తుంది. సత్యాన్ని ప్రతిబింబించే ప్రశాంత జలాల మాదిరి నిశ్శబ్దం విషయాలను మరింత స్పష్టంగా చూసేందుకు సహాయపడుతుంది. -
దాన విధానం
చేసిన పుణ్యం చెడని పదార్థమన్నారు తాత్వికులు. భూమ్మీద కీర్తి ఎంతకాలం ఉంటుందో మానవులు అంతకాలం స్వర్గంలో ఉంటారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల బతికిన నాలుగురోజులూ పుణ్యకార్యాలు చేసి శాశ్వతమైన యశస్సును ఆర్జించుకోవాలి. ధర్మాచరణమే పుణ్యకార్యం. సత్యం, శుచిత్వం, దయ, దానం అనే నాలుగూ ధర్మదేవతకు నాలుగు పాదాలని సంప్రదాయ భావన. -
విద్యా వినయ సంపన్నత
మనిషి కొత్త విషయాలు తెలుసుకునేందుకు, నేర్చుకొనేందుకే పుడతాడంటారు. గడచే ప్రతి క్షణం జ్ఞానాన్ని బోధిస్తూనే ఉంటుంది. పుడమి తల్లి, కన్న తల్లికన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతాయి. అరిషడ్వర్గాలు ప్రమాదకరమైనవని, సద్గుణాలు ఆనందాన్నిస్తాయని సాధనతో తెలుసుకుంటాం. అందరూ అన్నింటా మేటి అనిపించుకోవడం సాధ్యం కాదు. -
పలుకుతేనెలు
మానవులందరూ మాట్లాడతారు. కాని, అందరి మాటలు ఒకే రీతిలో ఉండవు. కొందరి మాటలు కటువుగా రాళ్లలా ఉంటాయి. కొందరి మాటలు చక్కెర పలుకుల్లా ఉంటాయి. కొందరి మాటలు విషం చిమ్ముతాయి. కొందరి మాటలు తేనెలొలుకుతాయి. -
కష్టేఫలే
ఈ సృష్టిలో గ్రీష్మరుతువు, వర్షరుతువు ఎలాగైతే ఒకదాని తరవాత మరొకటి మారుతూ ఉంటాయో అలాగే జీవితంలోను కష్టాల వెంబడి సుఖాలు వస్తూ ఉంటాయి. కాని కష్టాలు ఆవహించినప్పుడు మాత్రం కొందరు బెదిరిపోతారు. ఈ ప్రకృతిలో ఎండ తగలకుండా పెరిగిన చెట్టులేదు. కష్టం లేకుండా ఎదిగిన మనిషి లేడు. -
జీవిత సాక్షాత్కారం
చెట్టు జీవిస్తోంది. పక్షి జీవిస్తోంది. పాము జీవిస్తోంది. ఎడతెగక పారుతూ నది జీవిస్తూ ఇతరులను జీవింపజేస్తోంది. జీవనం తన స్వరూపాన్ని చూపించాలని అనుకుంటే ఆ మానవ జీవితం గొప్పదే. ఒక జీవితంలో వంద జీవితాలు అనుభవించాను అన్నారు స్వామి వివేకానంద. జీవనసారం తెలుసుకుని ధార్మిక జీవనానికి కట్టుబడి ఉండాలి అంటున్నాయి శాస్త్రాలు. -
బోనం... భాగ్యం!
ప్రశస్తమైన ప్రకృతి సకల శక్తులకు ఆలంబన. ప్రకృతి నుంచే సమస్త చైతన్యం ఉత్పన్నమవుతుంది. ఆ చైతన్యశక్తిని ఆర్ష ధర్మం పలు రూపాల్లో దర్శిస్తోంది. శక్తి లేనిదే సృష్టి మనుగడ లేదు. శక్తి నిత్యత్వం ప్రకృతికి సర్వదా నూతనత్వాన్ని ఆపాదిస్తోంది. అందుకే ప్రకృతిని పరమాత్మ రూపంగా మనం ఆరాధిస్తున్నాం. -
లోకప్రియం
ఒక్కొక్కరికీ ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. మనుషులకే కాకుండా పశువులు, పక్షులు, వృక్షాలు లాంటి వాటికి కూడా ఇష్టాలుంటాయిని ప్రకృతి పరిశీలకుల మాటల వల్ల తెలుస్తోంది. వృక్షాలకు కూడా ప్రాణం ఉంటుందని, వాటికి ప్రియమైన వాతావరణ పరిస్థితులకు స్పందించి సుఖదుఃఖాల అనుభూతి చెందుతాయని జగదీష్ చంద్రబోస్ నిరూపించారు. -
ధన్య జీవితం
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు జన్మించాక ఎప్పుడో ఒకప్పుడు మరణం అనివార్యం. -
ధర్మ పోరాటం
ఒకరిని ప్రేమించి అభిమానించి వారి రక్షణ కోసం ధర్మ సమ్మతంగా పోరాడితే అది సముచితమైందిగా హదీసులు వివరిస్తున్నాయి. అన్యాయానికి తోడ్పాటునందిస్తే అది ఆత్మహత్యా సదృశమని దివ్య ఖురాన్ గ్రంథం బోధిస్తుంది. ధర్మాధర్మాలలో ఏ వైపున ఉన్నా నా వారు నా వారే అనుకుంటే అది దురభిమానమవుతుంది. -
శుభ ఏకాదశి
ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు పంచమి, దశమి, ఏకాదశి... వంటి మంచి రోజులను ఎంచుకోవడం చాలామందికి అలవాటు. -
మహోన్నతం
మనిషికి భగవంతుడిచ్చిన వరం- మాట. మాట్లాడే శక్తి మనిషికే ఉంది. అయితే అయినదానికి, కానిదానికి మాట్లాడవలసిన అవసరంలేదు. -
హారతి
శాస్త్రోక్తంగా చేసే పూజ- పునస్కారాల్లో పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, దక్షిణ, మంత్రపుష్పం, హారతి, ప్రదక్షిణం వంటివన్నీ దేవతార్చనలోని అంశాలే. -
నాలుగు మంచి మాటలు
మైత్రి, కరుణ, ముదిత (సానుకూల మానసిక స్థితి), ఉపేక్ష అనే నాలుగు సాధనాలతో జీవితాన్ని చింతనా రహితంగా అలంకరించుకోవచ్చు. ఈ నాలుగు భావనలూ ప్రతి మనిషిలోనూ ఉంటాయి. వాటిని అభివృద్ధి చేసుకోవడంలోనే ధన్యత ఉంది. -
ఆధ్యాత్మిక సాధన
ఇహలోక బంధాల నుంచి విముక్తి కలిగించి, పారలౌకిక మార్గమేదో తెలిపి, ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపకరించే ప్రక్రియనే సాధన అంటారు. ధ్యానం, జపం, నామస్మరణ మొదలైన క్రియలతో చిత్తవృత్తుల పరుగులకు కళ్ళెం వేయడానికి చేసే ప్రయత్నమే సాధన. -
అదృష్టం - దురదృష్టం
మన జీవితంలో అదృష్టం, దురదృష్టం అనే మాటలు తరచుగా ప్రస్తావనకు వస్తాయి. కొందరిని అదృష్టవంతులుగాను, కొందరిని దురదృష్టవంతులుగాను పేర్కొంటుంటాం. దృష్టమంటే కంటికి కనిపించేది. దురదృష్టం దానికి వ్యతిరేకమైనది. కనబడనిది మనం ఊహించలేనిది. హఠాత్తుగా అనూహ్యంగా ఏదైనా మంచి జరిగినా, ప్రమాదం తప్పిపోయినా అదృష్టమనుకుంటాం. -
కష్టం-సుఖం
తన జీవితం సమస్యా రహితంగా, సుఖంగా సాగాలని ప్రతీ మనిషికి ఉండటం సమంజసమే. కాని తనకే ఏ సమస్యా రాకూడదు, తాను సుఖంగా బతికితే చాలు అనుకోవడం అనేక కష్టాలకు మూలం అవుతుంది. -
వెలుగు నుంచి చీకటికి...
కష్టసుఖాలు, సుఖదుఃఖాలు, చీకటివెలుగులన్నవి పడుగుపేకలు. అవి జీవితంలో సర్వసాధారణమని మాటవరసకు అంటాం కాని కష్టానికి, నష్టానికి, బాధకు వెరవని వారుండరు. -
అన్నమహిమ
అసంఖ్యాక ప్రాణికోటికి ఆహారం ‘అన్నం’. జఠరాగ్ని మండిపోతున్నప్పుడు ఆకలివేస్తుంది. ఆకలిని చల్లార్చడానికి అన్నం కావాలి. భోజన పదార్థాలన్నీ అన్నాలే. అన్నాన్ని తింటేనే ఆకలి చల్లారుతుంది. ఆత్మారాముడు సంతోషిస్తాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?