పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు.
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు.ఆ సమయంలో స్థితప్రజ్ఞ అవసరం అవుతుంది. అనుకున్నది సాధించే విషయంలో పట్టువిడుపులను ప్రదర్శించడం గొప్ప నేర్పరితనం. పట్టి విడుచుట కంటే పడిచచ్చుటే మేలు అన్నాడు వేమన. అందుచేత ఆ విడుపును తాత్కాలికం చేసి విజయానికి ఉపయోగపడే విధంగా మలచుకోవాలి.
పరాజయం పదేపదే పలకరిస్తున్నప్పుడు గతంలోని గెలుపు శాతం గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. ఉరకలెత్తే ఉత్సాహానికి కొంత విరామమివ్వాలి. ఆలోచనలో కానీ ఆచరణలో కానీ నాణ్యత కొరవడిందేమో తెలుసుకోవడానికి ఆత్మ విమర్శ చేసుకోవాలి. మనల్ని మనం తరచి చూసుకోవడం వల్ల బలహీనతలే కాదు, అంతర్గతంగా దాగివున్న బలాలను మరొక్కసారి సమీక్ష చేసుకున్నట్లు అవుతుంది. ఏ రంగంలో అయినా ఆత్మవిమర్శ ప్రయోజనకారిగానే ఉంటుంది.
అనుకున్న విజయాన్ని సాధించడంలో సమయం కీలక పాత్ర వహిస్తుంది.ఆశయ సాధనకు ప్రణాళిక రచించగానే అద్భుతాలు జరిగిపోవాలనుకోకూడదు. విత్తనం నుంచి అంకురించిన మొక్క వృక్ష రూపాన్ని పొందే క్రమంలో మలమల మాడ్చే ఎండకు తలవంచి నిలుస్తుంది. ఏటి ఒడ్డున పెరిగే గరికపోచలు ప్రవాహ ఉద్ధృతిలో ఉనికిని కాపాడుకోవడానికే ప్రాధాన్యమిస్తాయి. నీటి వాలుకు వీలుగా నిలిచి సమయానుకూలత లభించగానే సరైన క్రమంలో ఎదుగుతాయి. లక్ష్యసాధకుడు కూడా ఆ తత్వాన్నే ఒంటపట్టించుకోవాలి. పరాజయం ప్రవాహ ఉద్ధృతిలా పెకలించబోతున్నప్పుడు స్థిరంగా నిలిచేందుకు ప్రయత్నించాలి తప్పించి మొండిగా ప్రవర్తించి ఉనికినే కోల్పోకూడదు.
గెలుపు ఓటముల మాట ఎలా ఉన్నా మొక్కవోని దీక్షతో నెరవేర్చుకోవాలనుకున్న లక్ష్యంపై పట్టు సడలించడం వల్ల ఒత్తిడి కొంతమేర తగ్గుతుంది. అయితే పరిస్థితులు మన మీద పైచేయి సాధించే లోపు కార్యసాధనకు పునరంకితం కాగల దక్షత ఉండి తీరాలి. మనిషిని అత్యున్నత శిఖరాలకు చేర్చగలిగిన అతడి ఆలోచనా సరళే ఒక్కొక్కసారి దారి తప్పి అధఃపాతాళానికి పడవేస్తుంది. విజయం సాధించగలనన్న అతి విశ్వాసం గెలుపుపై పట్టును కోల్పోయేలా చేస్తుంది. ఆ వైఖరి క్రమంగా అపజయానికి చేరువ అవుతుంది. అది నిర్లక్ష్యానికి లభించిన ప్రతిఫలం.
పట్టు విడుపులను ప్రదర్శించే నైజం అపజయాన్ని అంగీకరించడం కాదు. అలాగే పరాజయాన్ని చూసి వెనకడుగు వేయడం కూడా కాదు. అది ఒక వ్యూహరచన. కౌరవులు తమకు ఎంతగా అన్యాయం చేస్తున్నా, భీమార్జునుల వంటి వీరులు చెంతనే ఉన్నా ధర్మరాజు కౌరవులతో యుద్ధానికి సై అనలేదు. తమ వాదన గెలవాలనే మొండిపట్టు పట్టలేదు. ప్రణాళికాబద్ధంగా విడుపును ప్రదర్శిస్తూ వ్యవహరించాడు. కృష్ణుడిలాంటి రాయబారిని పంపి మంతనాలు సాగించాడు. అర్ధరాజ్యం కాకపోయినా ఐదు ఊళ్లనైనా ఇమ్మని అభ్యర్థించాడు. ఈ వేడుకోలు ఫలించదన్న విషయం ధర్మరాజుకు తెలియనిది కాదు. జరగబోయే నష్టం వల్ల రాబోయే అపకీర్తి తమపై పడకూడదన్నది అతడి వ్యూహం. అందుకే తిక్కన ధర్మరాజును మెత్తని పులిగా అభివర్ణించాడు.
గోలి రామచంద్రరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్పర్శ... సాంత్వన!
స్పర్శ అంటే తాకడం. అది- తనువుకు తనువుకు; తనువుకు మనసుకు మధ్య మాత్రమే కాదు... అనేక ఇంద్రియాలకు ఆనుసంధాన వారధి. దాని శక్తి అమోఘం, అమేయం. భౌతికమైన అనుభవం, మానసికమైన అనుభూతి, ఆధ్యాత్మికంగా పరిణతిలతోపాటు మనసును, ప్రకృతిని పులకింపజేయడం, రంజింప చేయడం స్పర్శ లక్షణం. -
మౌనం మధురం
మౌనం అనేది ఉద్దేశపూర్వక నిశ్శబ్దాన్ని నొక్కి చెప్పే తపస్సు. ఇది మనిషి మాటల్ని పరిమితం చేసే పవిత్రమైన అభ్యాసం. ఆధ్యాత్మిక అనుభవానికి అవసరమైన క్రమశిక్షణ. మౌనం మనసుకు సంబంధించిన నిశ్శబ్దం. ఇది గ్రహణశక్తిని పెంపొందిస్తుంది. సత్యాన్ని ప్రతిబింబించే ప్రశాంత జలాల మాదిరి నిశ్శబ్దం విషయాలను మరింత స్పష్టంగా చూసేందుకు సహాయపడుతుంది. -
దాన విధానం
చేసిన పుణ్యం చెడని పదార్థమన్నారు తాత్వికులు. భూమ్మీద కీర్తి ఎంతకాలం ఉంటుందో మానవులు అంతకాలం స్వర్గంలో ఉంటారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల బతికిన నాలుగురోజులూ పుణ్యకార్యాలు చేసి శాశ్వతమైన యశస్సును ఆర్జించుకోవాలి. ధర్మాచరణమే పుణ్యకార్యం. సత్యం, శుచిత్వం, దయ, దానం అనే నాలుగూ ధర్మదేవతకు నాలుగు పాదాలని సంప్రదాయ భావన. -
విద్యా వినయ సంపన్నత
మనిషి కొత్త విషయాలు తెలుసుకునేందుకు, నేర్చుకొనేందుకే పుడతాడంటారు. గడచే ప్రతి క్షణం జ్ఞానాన్ని బోధిస్తూనే ఉంటుంది. పుడమి తల్లి, కన్న తల్లికన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతాయి. అరిషడ్వర్గాలు ప్రమాదకరమైనవని, సద్గుణాలు ఆనందాన్నిస్తాయని సాధనతో తెలుసుకుంటాం. అందరూ అన్నింటా మేటి అనిపించుకోవడం సాధ్యం కాదు. -
పలుకుతేనెలు
మానవులందరూ మాట్లాడతారు. కాని, అందరి మాటలు ఒకే రీతిలో ఉండవు. కొందరి మాటలు కటువుగా రాళ్లలా ఉంటాయి. కొందరి మాటలు చక్కెర పలుకుల్లా ఉంటాయి. కొందరి మాటలు విషం చిమ్ముతాయి. కొందరి మాటలు తేనెలొలుకుతాయి. -
కష్టేఫలే
ఈ సృష్టిలో గ్రీష్మరుతువు, వర్షరుతువు ఎలాగైతే ఒకదాని తరవాత మరొకటి మారుతూ ఉంటాయో అలాగే జీవితంలోను కష్టాల వెంబడి సుఖాలు వస్తూ ఉంటాయి. కాని కష్టాలు ఆవహించినప్పుడు మాత్రం కొందరు బెదిరిపోతారు. ఈ ప్రకృతిలో ఎండ తగలకుండా పెరిగిన చెట్టులేదు. కష్టం లేకుండా ఎదిగిన మనిషి లేడు. -
జీవిత సాక్షాత్కారం
చెట్టు జీవిస్తోంది. పక్షి జీవిస్తోంది. పాము జీవిస్తోంది. ఎడతెగక పారుతూ నది జీవిస్తూ ఇతరులను జీవింపజేస్తోంది. జీవనం తన స్వరూపాన్ని చూపించాలని అనుకుంటే ఆ మానవ జీవితం గొప్పదే. ఒక జీవితంలో వంద జీవితాలు అనుభవించాను అన్నారు స్వామి వివేకానంద. జీవనసారం తెలుసుకుని ధార్మిక జీవనానికి కట్టుబడి ఉండాలి అంటున్నాయి శాస్త్రాలు. -
బోనం... భాగ్యం!
ప్రశస్తమైన ప్రకృతి సకల శక్తులకు ఆలంబన. ప్రకృతి నుంచే సమస్త చైతన్యం ఉత్పన్నమవుతుంది. ఆ చైతన్యశక్తిని ఆర్ష ధర్మం పలు రూపాల్లో దర్శిస్తోంది. శక్తి లేనిదే సృష్టి మనుగడ లేదు. శక్తి నిత్యత్వం ప్రకృతికి సర్వదా నూతనత్వాన్ని ఆపాదిస్తోంది. అందుకే ప్రకృతిని పరమాత్మ రూపంగా మనం ఆరాధిస్తున్నాం. -
లోకప్రియం
ఒక్కొక్కరికీ ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. మనుషులకే కాకుండా పశువులు, పక్షులు, వృక్షాలు లాంటి వాటికి కూడా ఇష్టాలుంటాయిని ప్రకృతి పరిశీలకుల మాటల వల్ల తెలుస్తోంది. వృక్షాలకు కూడా ప్రాణం ఉంటుందని, వాటికి ప్రియమైన వాతావరణ పరిస్థితులకు స్పందించి సుఖదుఃఖాల అనుభూతి చెందుతాయని జగదీష్ చంద్రబోస్ నిరూపించారు. -
ధన్య జీవితం
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు జన్మించాక ఎప్పుడో ఒకప్పుడు మరణం అనివార్యం. -
ధర్మ పోరాటం
ఒకరిని ప్రేమించి అభిమానించి వారి రక్షణ కోసం ధర్మ సమ్మతంగా పోరాడితే అది సముచితమైందిగా హదీసులు వివరిస్తున్నాయి. అన్యాయానికి తోడ్పాటునందిస్తే అది ఆత్మహత్యా సదృశమని దివ్య ఖురాన్ గ్రంథం బోధిస్తుంది. ధర్మాధర్మాలలో ఏ వైపున ఉన్నా నా వారు నా వారే అనుకుంటే అది దురభిమానమవుతుంది. -
శుభ ఏకాదశి
ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు పంచమి, దశమి, ఏకాదశి... వంటి మంచి రోజులను ఎంచుకోవడం చాలామందికి అలవాటు. -
మహోన్నతం
మనిషికి భగవంతుడిచ్చిన వరం- మాట. మాట్లాడే శక్తి మనిషికే ఉంది. అయితే అయినదానికి, కానిదానికి మాట్లాడవలసిన అవసరంలేదు. -
హారతి
శాస్త్రోక్తంగా చేసే పూజ- పునస్కారాల్లో పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, దక్షిణ, మంత్రపుష్పం, హారతి, ప్రదక్షిణం వంటివన్నీ దేవతార్చనలోని అంశాలే. -
నాలుగు మంచి మాటలు
మైత్రి, కరుణ, ముదిత (సానుకూల మానసిక స్థితి), ఉపేక్ష అనే నాలుగు సాధనాలతో జీవితాన్ని చింతనా రహితంగా అలంకరించుకోవచ్చు. ఈ నాలుగు భావనలూ ప్రతి మనిషిలోనూ ఉంటాయి. వాటిని అభివృద్ధి చేసుకోవడంలోనే ధన్యత ఉంది. -
ఆధ్యాత్మిక సాధన
ఇహలోక బంధాల నుంచి విముక్తి కలిగించి, పారలౌకిక మార్గమేదో తెలిపి, ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపకరించే ప్రక్రియనే సాధన అంటారు. ధ్యానం, జపం, నామస్మరణ మొదలైన క్రియలతో చిత్తవృత్తుల పరుగులకు కళ్ళెం వేయడానికి చేసే ప్రయత్నమే సాధన. -
అదృష్టం - దురదృష్టం
మన జీవితంలో అదృష్టం, దురదృష్టం అనే మాటలు తరచుగా ప్రస్తావనకు వస్తాయి. కొందరిని అదృష్టవంతులుగాను, కొందరిని దురదృష్టవంతులుగాను పేర్కొంటుంటాం. దృష్టమంటే కంటికి కనిపించేది. దురదృష్టం దానికి వ్యతిరేకమైనది. కనబడనిది మనం ఊహించలేనిది. హఠాత్తుగా అనూహ్యంగా ఏదైనా మంచి జరిగినా, ప్రమాదం తప్పిపోయినా అదృష్టమనుకుంటాం. -
కష్టం-సుఖం
తన జీవితం సమస్యా రహితంగా, సుఖంగా సాగాలని ప్రతీ మనిషికి ఉండటం సమంజసమే. కాని తనకే ఏ సమస్యా రాకూడదు, తాను సుఖంగా బతికితే చాలు అనుకోవడం అనేక కష్టాలకు మూలం అవుతుంది. -
వెలుగు నుంచి చీకటికి...
కష్టసుఖాలు, సుఖదుఃఖాలు, చీకటివెలుగులన్నవి పడుగుపేకలు. అవి జీవితంలో సర్వసాధారణమని మాటవరసకు అంటాం కాని కష్టానికి, నష్టానికి, బాధకు వెరవని వారుండరు. -
అన్నమహిమ
అసంఖ్యాక ప్రాణికోటికి ఆహారం ‘అన్నం’. జఠరాగ్ని మండిపోతున్నప్పుడు ఆకలివేస్తుంది. ఆకలిని చల్లార్చడానికి అన్నం కావాలి. భోజన పదార్థాలన్నీ అన్నాలే. అన్నాన్ని తింటేనే ఆకలి చల్లారుతుంది. ఆత్మారాముడు సంతోషిస్తాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్