విజయానికి సోపానం
జీవితంలో ఏదో సాధించాలన్న తపన అందరికీ ఉంటుంది. ఇలాంటి తపనే లేకపోతే మనిషి బతుకు బండబారుతుంది. గుండె రాయిగా మారి చివరికి ఆ మనిషి శిలగా మిగిలిపోతాడు. జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి లక్ష్యం అంటూ ఉండాలి. ఏం కావాలో, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో... వీటిని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి.
జీవితంలో ఏదో సాధించాలన్న తపన అందరికీ ఉంటుంది. ఇలాంటి తపనే లేకపోతే మనిషి బతుకు బండబారుతుంది. గుండె రాయిగా మారి చివరికి ఆ మనిషి శిలగా మిగిలిపోతాడు. జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి లక్ష్యం అంటూ ఉండాలి. ఏం కావాలో, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో... వీటిని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. గమ్యం చేరడానికి ఒక పథకం తయారుచేసుకోవాలి. మనిషి స్వభావాన్ని బట్టి లక్ష్యం ఉంటుంది. కొందరికి డబ్బు గురించి, మరికొందరికి కీర్తి గురించి, ఇంకొందరికి భౌతిక సుఖాల గురించి తపన ఉంటుంది. ఏది అవసరం, ఏది మంచి, ఏది శాశ్వతం అని తెలుసుకుని దాన్ని తమ లక్ష్యంగా పెట్టుకునేవారు చాలా కొద్దిగా, అరుదుగా కనిపిస్తారు.
ఒక లక్ష్యం సాధించడానికి తపన ఉంటే చాలదు. అది ఎలాగైనా పొందాలన్న కోరిక లేదా ఆకాంక్ష, పట్టుదల, ఏకాగ్రత లాంటి సాధనాలను లేదా సామగ్రిని పోగు చేసుకోవాలి. మనసా వాచా కర్మణా ఆ లక్ష్యం అందిపుచ్చుకొనే వరకు నిద్రాహారాలు సవ్యంగా లేకపోయినా అధైర్యపడకూడదు. అర్ధాంతరంగా వదిలిపెట్ట కూడదు. కార్యసాధనపై మనసు పూర్తిగా లగ్నం అయితే- చిన్నాచితకా ఆటంకాలు, కాస్తో కూస్తో అసౌకర్యాలు ఇబ్బంది పెట్టవు. దృష్టితోపాటు మనసును దిటవుపరచుకుంటే లక్ష్యసాధన నల్లేరుమీద బండిలా, చకచకా సాగుతుంది. గమ్యం చేరుస్తుంది.
ఆధ్యాత్మిక రంగంలో ప్రగతి సాధించి, సుగతి పొందాలని ఆకాంక్షించేవారిని ముముక్షువు అంటారు. వారి లక్ష్యం వేరుగా ఉంటుంది. పరమార్థ సాధనే వారికి పరమగమ్యం. పరమ పురుషార్థం(మోక్షం) వారి అంతిమ లక్ష్యం. యోగాభ్యాసం, సాధన గురించే వారి తపనంతా. యోగాభ్యాసం, ఆధ్యాత్మిక సాధన గురించి మన శాస్త్రాలు విపులంగా చెబుతున్నాయి. పతంజలి యోగ శాస్త్రం ఒక ప్రామాణిక గ్రంథం. అభ్యాసయోగులకు అది దారి దీపం. లక్ష్యసాధనకు కావలసిన చైతన్యశక్తిని పుంజుకోవడం యోగాభ్యాసం. సాధన ఆ చైతన్యశక్తిని ప్రేరేపించే మార్గం. లక్ష్యసాధనకు మార్గదర్శకులైన విజేతల గురించి మన పురాణాల్లో ఇతిహాసాల్లో చాలా ఉదాహరణలున్నాయి. మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముడు ఆదర్శ మానవుడిగా ఈ సందర్భంలో మనకు స్ఫూర్తిని ఇస్తాడు. పట్టాభిషేకం బదులు తండ్రి ఆన తలదాల్చి సీతాలక్ష్మణ సమేతంగా అడవికి వెళ్ళాడు. పంచవటిలో రావణుడు అపహరించిన సీతను తిరిగి తీసుకురావడం అనే లక్ష్యం అరణ్యవాసంలో మొదటి వరస కట్టింది. ఆ లక్ష్యం నెరవేరడానికి దాశరథి చేసిన ప్రయత్నం ప్రశంసించదగ్గది. మానవ సహజమైన దుఃఖాన్ని దిగమింగి, కార్యరంగంలో నుంచున్నాడు. అడవిలో వానరులు, జాంబవంతుడు ఆయనకు అండగా నిలిచారు. నిరాశా నిస్పృహలకు లొంగకుండా సంప్రదింపులు సాగించాడు. జటాయువు సోదరుడైన సంపాతిని సంప్రదించి సముద్రం దాటి లంకను చేరగల ధీరుడెవరని ఆరాతీశాడు. మారుతిని దూతగా రావణుడి చెంతకు పంపించారు. చివరికి చిన్నారి ఉడతా తన వంతు సాయం అందించి, రాముడి దీవెనలను పొందింది. మనోధైర్యం, ఆత్మబలం, వానర సైన్యం క్రియాశీలాన్ని, వ్యూహరచనల్ని పెంపు చేశాయి. అధర్మంపైన ధర్మం విజయం సాధించింది. సీతాలక్ష్మణ సమేతంగా రాముడు పుష్పకవిమానంలో అయోధ్యకు తిరిగివచ్చి రామరాజ్యానికి శ్రీకారం చుట్టాడు.
ఇహపర సాధన భవ జలధికి నావ అంటారు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు, జీవన్ముక్తికి ముఖ్య ద్వారాలు. ఏ రూపంలోనైనా సాధన ఒక నిరంతర ప్రవాహంలా సాగినప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. సాధనవల్ల సంకల్పం నెరవేరుతుంది. యోగసాధనవల్ల అమృతత్వం సిద్ధిస్తుంది. అభ్యాసమే స్వభావంగా యోగులు ఆత్మవిజయం సాధించారు.
ఉప్పు రాఘవేంద్రరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కామరూపులు
రామాయణంలో శూర్పణఖ రాముణ్ని మోహించింది. ఆయన పొందు కోరింది. తన రాక్షస రూపాన్ని విడిచి అందాలరాశిగా మారింది. వయ్యారాలు వొలకబోసింది. మారీచుడు సీతమ్మను ఆకర్షించాలనుకొన్నాడు. -
పరమ పూజ్యులు ఆచార్యులు
భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలోనే కాక, ఈ దేశ చరిత్రలో, సంస్కృతిలో ఆదిశంకరుని ఆవిర్భావం, ఆవిష్కారం అద్భుతాంశాలు. కేరళలోని కాలడిలో జన్మించి చిన్న వయసులోనే అపార జ్ఞాన సంపదతో, దేశమంతా ముమ్మార్లు పర్యటించిన ఆ మహానీయుడు గొప్ప వాఙ్మయాన్ని అందించడమే కాక, తాత్త్విక జగతిలో సుస్థిరమైన స్థానాన్ని అలంకరించారు. -
నిర్ణయాధికారం
ప్రభువును సాక్షాత్తు విష్ణు అంశ సంభూతుడిగా శాస్త్రాలు చెబుతున్నాయి. పాలకుడు తీసుకునే నిర్ణయాల కారణంగా ఎన్నో కోట్లమంది ప్రజల జీవితాలు ప్రభావితమవుతాయి. పాలన చేసే వ్యక్తి అనేకమంది ప్రజానీకంలాగానే భూమిపై జన్మిస్తాడు. -
సింహాచల చందనోత్సవం
తెలుగునాట వెలసిన సుప్రసిద్ధ నరసింహ క్షేత్రాల్లో సింహాచలం ఒకటి. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో తృతీయ చతుర్థ అవతారాల కలయికతో వరాహ లక్ష్మీనృసింహస్వామిగా కొలువై ఉన్న దైవాన్ని అశేష భక్తకోటి దర్శించి సేవిస్తుంటారు. గోస్తని శారదా నదుల పరీవాహక ప్రాంతం మధ్య ఈ గిరిక్షేత్రం నెలకొని ఉంది. -
లోకులు పలు కాకులు
ఈ నానుడి మనం తరచుగా వింటుంటాం. లోకంలో ఉన్న మనుషుల్లో ఏ ఒక్కరి అభిప్రాయమూ వేరొకరి అభిప్రాయంతో దాదాపుగా కలవదు. ఎవరి ఆశయాలు వారివి. ఎవరి అభిరుచులు వారివి. ఎవరి అలవాట్లు వారివి. ఒకరినొకరు మార్చడమనేది అసాధ్యం. అసంభవం. -
శాంతి సౌభాగ్యాలు
కష్టకాలంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రశాంతమైన మనసులో శుభకరమైన ఆలోచనలు పుడతాయి. సమస్యలకు పరిష్కారాలు గోచరిస్తాయి. శాంతచిత్తులు రాగ ద్వేష క్రోధ రహితులవుతారు. -
సాధన పంచకం
మానవ జీవితాన్ని సక్రమ మార్గంలోకి మరల్చడానికి ఆదిశంకరాచార్యులు చేసిన రచనల్లో సాధన పంచకం ఒకటి. ఇందులో ఉన్నవి అయిదు శ్లోకాలే! ప్రతి శ్లోకానికి నాలుగు పాదాలు, ప్రతి పాదంలో రెండు బోధనల చొప్పున ఎనిమిది అంశాలు. వెరసి అయిదు శ్లోకాల్లో మొత్తం నలభై ఉపయోగకర సూత్రాలను బోధిస్తుందీ సాధన పంచకం. -
ధర్మ స్వరూపం
ఏ పని చేస్తే మనకు గానీ ఇతరులకు గానీ మంచి జరుగుతుందో అది ధర్మం. ఆ ధర్మం వల్ల మనుషులకు గానీ పశుపక్ష్యాదులకు గానీ నష్టం కలగకూడదు. పాంచభౌతిక పదార్థాలకూ చేటు కలగకూడదు. అటువంటి ధర్మం వల్ల సర్వత్రా మంచే జరగాలి. ధర్మం సముద్రం వంటిది. అది ఎంతో లోతైనది. కడలిలో రత్నాలు దాగి ఉన్నట్టే ధర్మంలో వినయం, శీలం వంటి సుగుణాలు ఇమిడి ఉంటాయి... -
విద్యాదానం
విద్య సంస్కారాన్ని నేర్పుతుంది. నైతికతను పెంచుతుంది. విద్య ద్వారా ఏది దైవమో, ఏది ధర్మమో, ఏది జడమో, ఏది చేతనమో, ఏది మట్టో, ఏది మాణిక్యమో బోధపడుతుంది. విద్యకు, వినయానికి అవినాభావ సంబంధముంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో విద్య నేర్పుతుంది. -
వైరాగ్య సుఖం
మనిషికి ఆశలు తీరనప్పుడు, ప్రయత్నాలు విఫలమైనప్పుడు, విషాద సంఘటనలు సంభవించినప్పుడు నిరాశా నిస్పృహలతో జీవితంపై విరక్తి పుట్టి సహజంగానే వైరాగ్య భావాలు ముంచెత్తుతాయి. నిజానికి వైరాగ్యమంటే తాత్కాలికంగా వచ్చిపోయే విరక్తి భావతరంగాలు మాత్రమే కాదు. -
పొందిగ్గా విజ్ఞతాయుతంగా...
సమయం సందర్భం తెలిసి మాట్లాడటం సంస్కారవంతుల లక్షణం. అలా కాకుండా అన్నింట్లో తలదూర్చి అప్రస్తుత అధిక ప్రసంగాలు చేసేవారు తమకు తెలియకుండానే అవివేకాన్ని బయట పెట్టుకుంటారు. మాటలపై అదుపు, వాటి ప్రయోగంపై పొదుపు లేకపోతే జీవితం గండిపడ్డ చెరువులా మారుతుంది. దేని గురించి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. -
గోవిందా... గోవింద!
పరమాత్ముడి అనుగ్రహం కలగాలంటే నామస్మరణే సులభమైన మార్గం. అదే విషయాన్ని పోతన ‘నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని...’ అని ప్రహ్లాదుడి పాత్రతో చెప్పించాడు. ‘గోవింద గోవిందయని పిలువరే’ అన్న పాటలోనూ ఆ విషయాన్నే చెప్పాడు అన్నమయ్య. -
నమామి నర్మదా
నదుల్ని ప్రత్యక్ష దైవస్వరూపాలుగా యజుర్వేదం అభివర్ణించింది. అలాంటి నదులతోనే నాగరికతలు పరిఢవిల్లాయి. జీవకోటి మనుగడకు పరమాత్మ జలాన్ని సృష్టించాడని పద్మపురాణోక్తి. నదుల్ని జలదేవతలుగా, నదీమతల్లులుగా ఆరాధించడం మన సంప్రదాయం. ఆ నేపథ్యంలోనిదే నదులకు నిర్వహించే పుష్కరోత్సవం. -
కర్మయోగం - జ్ఞానయోగం
పరమాత్మ సాక్షాత్కారం పొందడానికి మన శాస్త్ర గ్రంథాలు రెండు మార్గాలను సూచించాయి. వాటిలో ఒకటి కర్మయోగం, మరొకటి జ్ఞానయోగం. లోకంలో కర్మలు చేయకుండా ఎవరూ ఉండరు. ఏదో ఒకపని చేస్తూ ఫలాన్ని ఆశిస్తారు. -
సహనానికీ హద్దుంటుంది...
సహనం సంస్కారవంతమైన పదం. సహనశీలత గొప్ప మానవతా గుణం. సహనంతోనే శాంతిని సాధించాలి. నిజమే! ఎంతవరకు సహనం వహించాలనేదీ ఆలోచించాలి. కొంతవరకే సహనానికి మంచి ఫలితం ఉంటుంది. హద్దు మీరితే ఎంతటి సహనశీలుడైనా తిరగబడతాడు. సహనాన్ని కొందరు బలహీనతగా, చేతగానితనంగా భావిస్తారు. అనువుగాని చోట అధికులమనరాదు. ఒదిగి ఉండటం వల్ల చిన్నతనం రాదు. -
ధర్మమే సర్వం
‘ధర్మం పాటించండి’ అనే మాట సాధారణంగా వినిపిస్తుంది. రెండక్షరాల ఈ పదం వెనక చాలా పెద్దభావం ఉంది. లోతైన వివరణ ఉంది. చేయదగినపని, లక్షణం, స్వభావం, పద్ధతి, తగినది, దానగుణం అనే వివిధ అర్థాల్లో ఈ పదాన్ని వాడతారు. సమాజంలో ప్రతివారికీ ఏదో ఒక చేయదగిన పని ఉంటుంది. -
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ ఎన్నికలు: ‘హలో ఏపీ బైబై వైసీపీ’ సోషల్మీడియాలో ట్రెండ్
-
నష్టాల నుంచి లాభాల్లోకి.. 900 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్
-
కోతిని తప్పించబోయి ప్రమాదం.. బ్యాంకు ఉద్యోగులు మృతి
-
సీఎం నివాసంలో ఎంపీ స్వాతీమాలీవాల్పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి !
-
‘హమాస్ మద్దతుదారుల బృందంలోకి బైడెన్’.. ఆయుధ సరఫరా నిలిపివేతపై తీవ్ర వ్యతిరేకత