విశ్వ బుద్ధ పౌర్ణమి
వివేకంతో జీవిస్తున్న వ్యక్తికి మరణ భయం ఉండదు. మనల్ని మనమే రక్షించుకోవాలి. ఎవరికి వారే ఒక జ్యోతిగా మారి వెలుగునిస్తూ దారి చూపుకోవాలి. ధ్యానాన్ని ఒక పనిగా చెయ్యకూడదు. ప్రతి పనినీ ధ్యానంగా చెయ్యాలి. నియంత్రించకుండా వదిలేసిన ఆలోచనలుచేసే హాని కంటే ప్రపంచంలో ఎక్కువ హాని ఎవ్వరూ చేయలేరు.
వివేకంతో జీవిస్తున్న వ్యక్తికి మరణ భయం ఉండదు. మనల్ని మనమే రక్షించుకోవాలి. ఎవరికి వారే ఒక జ్యోతిగా మారి వెలుగునిస్తూ దారి చూపుకోవాలి. ధ్యానాన్ని ఒక పనిగా చెయ్యకూడదు. ప్రతి పనినీ ధ్యానంగా చెయ్యాలి. నియంత్రించకుండా వదిలేసిన ఆలోచనలుచేసే హాని కంటే ప్రపంచంలో ఎక్కువ హాని ఎవ్వరూ చేయలేరు. సూర్యుడు, చంద్రుడు, సత్యం- వీటిని ఎవరూ ఎక్కువ సమయం దాచిపెట్టలేరు. జీవితపు అనుభవాల లోతుల్లోంచి అటువంటి ఎన్నో అంశాల్ని ప్రపంచానికి అందజేసిన అత్యంత అరుదైన వ్యక్తి అవతారమూర్తి విశ్వతేజస్సు గౌతమ బుద్ధుడు.
బుద్ధుడు నాలుగు దివ్యసత్యాల్ని లోకానికి తెలియజెప్పాడు. అవి- దుఃఖం, దుఃఖానికి కారణం, దుఃఖం అంతమయ్యే మార్గం, దుఃఖాంతం. ఇవి మానవ జీవనానికి ఎంతో మేలుచేస్తాయి. బుద్ధుడి కీర్తిని సర్వత్రా వ్యాపింపజేశాయి. బుద్ధుడు లుంబినిలో జన్మించాడు. మహాచక్రవర్తిగా బతకలేదు. పరమ సన్యాసిగా మారిపోయాడు. బాహ్యంగా అంతా బాగానే ఉన్నా సిద్ధార్థుడికి లోలోపల ఏదో వెలితి. ఏదో జిజ్ఞాస. ఏదో చెయ్యడానికి వచ్చాను. ఏం చేస్తున్నాను? తీవ్రమైన అంతరంగ అన్వేషణ అతడిని నిలవనీయడం లేదు. సరిగ్గా అదే సందర్భంలో అతడికి నాలుగు దుఃఖాలు కంటపడ్డాయి. అవి- ముసలితనం, రోగం, మరణం, సన్యాసం. వీటిని నాలుగు దృశ్యాలు అంటారు. ఈ దృశ్యాలను దర్శించిన సిద్ధార్థుడి మనసు అంతర్ముఖమైంది. దారి దొరికింది!
ఒక రాత్రివేళ తన కుటుంబాన్ని, రాజభోగాలను వదిలి రాజప్రాసాదం నుంచి నిష్క్రమించాడు. తీవ్రమైన సత్యాన్వేషణ చేశాడు. చివరికి బోధగయలో ఒక రావిచెట్టు కింద అతడికి జ్ఞానోదయమైంది. అష్టాంగ మార్గం కనుగొన్నాడు. అదే అందరికీ జీవితాంతం బోధించాడు. బుద్ధుడు అయ్యాడు.
బుద్ధుడి ప్రసంగాలు వినడానికి ఒక వ్యాపారస్తుడి కొడుకులు అక్కడికి వచ్చి కూర్చుని ధ్యానంలో మునిగి ఉండేవారు. ఆ సమయం వృథా అని, దాన్ని వ్యాపారం కోసం వాళ్లు వినియోగిస్తే ఎంతో బావుండేదని తండ్రి అనుకున్నాడు. అలా జరగడం లేదు. ఇదంతా వృథా అని కోపం వచ్చి బుద్ధుడి సమావేశానికి వెళ్ళి బుద్ధుడి వైపు చూసి కోపంగా తిట్టి ముఖం మీద ఉమ్ము ఊశాడు. బుద్ధుడు ఆ వ్యాపారి చర్యకు ప్రతిచర్యగా ఒక నవ్వు నవ్వాడు. వ్యాపారికి అర్థం కాలేదు. అది అతడి మనసును కలచి వేసింది. రాత్రంతా నిద్రపోలేదు. తెల్లవారగానే బుద్ధుడి దగ్గరకు వెళ్ళాడు. అతడి కాళ్లమీద పడ్డాడు. క్షమించమని వేడుకున్నాడు.
బుద్ధుడు ‘నేను క్షమించను’ అన్నాడు. ఆ వ్యాపారితో పాటు అందరూ ఆశ్చర్యపోయారు. బుద్ధుడేనా ఈ మాటలు అన్నది అని ఆశ్చర్యంలో మునిగిపోయారు. కొన్ని క్షణాల తరవాత బుద్ధుడు తన మాటలకు తానే వివరణ ఇచ్చాడు. ‘నిన్న నువ్వు ఆగ్రహం ప్రదర్శించిన బుద్ధుడు ఇప్పుడు లేడు. నిన్ను క్షమించడానికి ఆయన ఉండాలి. ఆయన లేకుండా నేనెలా నిన్ను క్షమించగలను? ఒకవేళ ఆయన నాకు కనిపిస్తే నిన్ను క్షమించమని చెబుతానులే’ అన్నాడు. ‘నిన్న ఆయన మీద ఉమ్మువేసిన వ్యాపారి నువ్వు కాదు. నీలో ఒక కొత్త మనిషి ఉన్నాడు. నిన్న చెరిగిపోయింది. పాత సంస్కారాలు చెరిగిపోయి కొత్తవి వస్తాయి. మనుషులు మారతారు... మార్చేవాళ్లను బట్టి. నువ్వు తప్పు చెయ్యలేదు. లే!’ అన్నాడు బుద్ధుడు.
వైశాఖ పౌర్ణమినాడు జన్మించిన గౌతమ బుద్ధుడు వైశాఖ పౌర్ణమినాడే జ్ఞానోదయం పొందాడు. అదే వైశాఖ పౌర్ణమినాడు 80 సంవత్సరాల దివ్యజీవన సాఫల్యం పొంది, విశ్వమంతా వెలుగులీనుతూ ప్రపంచ చరిత్రలో శాశ్వత మహాపరి నిర్వాణం పొందాడు.
ఆనందసాయి స్వామి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనసుకు కళ్లెం
మనసు చంచలమైనది. అది ఒకసారి సాధు రూపాన్ని ధరిస్తే, మరొకసారి క్రూరత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఒకసారి సద్విచారాలతో నిర్మలమైతే, మరొకసారి దురాలోచనలతో మలినమవుతుంది. మనసు వేగాన్ని కొలవలేం. దాని తీవ్రతను అంచనా వేయలేం. కరుణామృతాన్ని వర్షించే మనసు కాఠిన్యానికి ఆలవాలం కావడం చాలా చిత్రమనిపిస్తుంది. -
మార్గాన్వేషణ
ఆధ్యాత్మిక జీవితం చైతన్యం... ఉల్లాసం... ప్రకాశవంతం. జీవితంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించడానికి ఆధ్యాత్మికత అవకాశం కల్పిస్తుంది. ఆధునిక జీవితంలోని దుఃఖం, నిరాశా నిస్పృహలను అది తొలగిస్తుంది. మనిషిలోని అలసటను పోగొట్టి సరికొత్త శక్తినిస్తుంది. -
పంచ సరోవరాలు
తీర్థం అంటే నీరు. నది, సరస్సు అనే అర్థాలూ ఉన్నాయి. తీర్థ తీరాల్లో వెలసిన క్షేత్రాలకు చేసే యాత్రలనే తీర్థయాత్రలంటారు. మన దేశంలో ఎన్నో జల వనరులున్నాయి. వాటిలో పంచ సరోవరాలు ప్రసిద్ధమైనవని పురాణాలు చెబుతున్నాయి. -
సత్య దర్శనం
జీవితాన్ని ఉత్సాహభరితంగా ఆస్వాదించాలి. వర్తమానంలో ప్రతి క్షణాన్ని మరలా తిరిగి రాదనే ఎరుకతో చిరస్మరణీయంగా మలచుకోవడానికి ప్రయత్నించాలి. సమాజం పట్ల చూపించే కృతజ్ఞత ఆప్యాయతలే మనం సంపాదించుకునే నిజమైన ఆస్తులు ఆప్తులు అన్న భావన గొప్ప స్పృహ. -
నిష్క్రమణ
-
కీలుబొమ్మ
అలవాటైన పనులు యాంత్రికంగా సాగుతుంటాయి. యంత్రాలు చేసే పనులు మరింత యాంత్రికంగా ఉంటాయి. యంత్రం మనిషి జీవనంలో ప్రవేశించిన తరవాత మనిషి సున్నిత భావాలు తగ్గిపోయాయి. యంత్రం పని చేస్తుంది. యంత్రాన్ని పని చేయించేవాడు మనిషే. యంత్రం మూలాన మనిషి కనబడకుండా పోతున్నాడు. -
ఆత్మనివేదనం
తన కుమారుడు ప్రహ్లాదుడి విద్యాభ్యాసాన్ని పరీక్షిద్దామనుకొని హిరణ్యకశిపుడు వాత్సల్యంతో అతణ్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని గురువుల దగ్గర ఏం నేర్చుకున్నావని, ఏది ఉత్తమమైందని తెలుసుకున్నావని అడిగాడు. -
జ్యేష్ఠం - ఎంతో శ్రేష్ఠం
జ్యేష్ఠ మాసాన్ని ఎన్నో గొప్ప పర్వదినాలు గల పావన మాసంగా భావిస్తారు. జ్యేష్ఠ నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు పౌర్ణమి ఏర్పడే మాసం జ్యేష్ఠం. ఈ నక్షత్రానికి అధిదేవత ఇంద్రుడు. ఈ మాసంలోని ఎన్నో తిథుల్లో పర్వదినాలు వస్తున్నాయి. -
వేదాంగాలు
ప్రపంచానికి అపారమైన జ్ఞానరాశిని అందిస్తున్న గ్రంథాలు వేదాలు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అనేవి నాలుగు వేదాలని అందరికీ తెలుసు. ఇవి భగవంతుడి ముఖారవిందం నుంచి వెలువడినవని, వీటిని ఎవరూ రాయలేదని సంప్రదాయజ్ఞులు అంటారు. -
వెనక్కి నడుస్తున్నాం!
జ్ఞానం వెనక అజ్ఞానం, తెలివి వెనక అమాయకత్వం, ధైర్యం వెనక భయం మనిషిని పట్టి పీడించే శత్రువులు. సుఖజీవనానికి, సంఘసామరస్యానికి మూలమైన విశ్వాసం స్థానే అవిశ్వాసం, అంధవిశ్వాసం కాటేసే కాలసర్పాల్లా కాచుకు కూర్చుంటాయి. వీటి వలలో చిక్కిన మనిషిని ఛాందస ఆలోచనలు, దురాచార పోకడలు చీకటిలోకి మరింతగా నెట్టేస్తాయి. -
పంజరంలో చిలుక
జీవుడూ బ్రహ్మమేనని, బ్రహ్మకంటే వేరుకాదని ఆదిశంకరులు చెప్పారు. బంగారు పంజరంలో చిలుకలా, రక్తమాంసాలతో ఉన్న అస్థిపంజరంలో జీవుడు చిక్కుబడి దిక్కుతోచని స్థితిలో ఉన్నాడని ఆచార్యుల వారి అభిప్రాయం. -
మనస్సాక్షి
ప్రతి వారి జీవితంలోనూ ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. ఒక్కొక్కసారి దిక్కుతోచని స్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయంలో సరైన మార్గం చూపించేది మనసే! ఎడారిలోనో, సముద్రంలోనో ప్రయాణం చేసేవారు దిక్కులు తెలియక దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితి కలగకుండా దిక్సూచి అనే చిన్న యంత్రాన్ని ఉపయోగిస్తారు. ఏ వైపున ఏముందో సూచించడం దాని పని. మనస్సాక్షి సైతం అలాంటిదే. -
విశ్వమంత వెలుగు!
పంచభూతాల్లో ఒకటైన అగ్ని అన్ని విధాలా అధికమైన ప్రాధాన్యం వహిస్తుంది. దీపారాధన, జ్యోతిప్రజ్వలన, యజ్ఞయాగాది క్రతువుల్లో అగ్నిప్రతిష్ఠ, ఆహారం ఉడికించడానికి మంట, నిప్పు, జ్వాల... పేర్లు వేరైనా అది ప్రకాశవంతమైన వెలుగు. చీకటిలో దారి చూపే మార్గదర్శి. -
ఊహలు - వాస్తవాలు
ఊహలు ఎలా ఉన్నా- నిజ జీవితంలో మనిషి పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అవి ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థికపరంగా కావచ్చు, మిత్రులతో, బంధువులతో సంబంధ బాంధవ్యాల పరంగా కావచ్చు. -
ఆంజనేయం... మహావీరం!
శ్రీరామ భక్తుడిగా రామకార్యాన్ని సఫలం చేసిన మహావీరుడు- ఆంజనేయుడు. హనుమను ‘సర్వదేవాత్మకుడు’ అని వానర గీత స్తుతించింది. శ్రీహరి జ్ఞానశక్తి, పరమేశ్వరుడి క్రియాశక్తి, బ్రహ్మ సంకల్పశక్తి ఏకోన్ముఖమై హనుమగా అభివ్యక్తమైందంటారు. విశ్వవ్యాపకమైన భగవత్ చైతన్యాన్ని ‘అంజన’గా వ్యవహరిస్తారు. -
మాటతో... చూపుతో...
రామ పరాక్రమంతో చేతలుడిగి హతాశుడై యుద్ధరంగంలో నిస్సహాయంగా నిలబడిపోయిన రావణుడితో రాముడు అన్నదల్లా ఒకేఒక్క మాట- ‘నేడు పోయి రేపు రా’ అని. ఆ ఒక్కమాట దశకంఠుణ్ని జీవచ్ఛవంగా మార్చేసింది. ముల్లోకాలను జయించిన మహాయోధుడు రావణాసురుడు. -
తమసోమా జ్యోతిర్గమయ
ఒక పండితుడు ఒకరోజు భయంకరమైన అరణ్యంలో ప్రవేశించాడు. చుట్టూ ఉన్న క్రూరమృగాలను చూడగానే అతడి గుండె జారిపోయింది. దారికోసం అటు ఇటు తిరుగుతున్నాడు. మృగాలు అతడి చుట్టూ సంచరిస్తున్నాయి. ఆ అరణ్యం చుట్టూ ఒక వల కప్పినట్టు కనిపించింది. భయంకరమైన ఆకారం గల ఒక స్త్రీ ఆ వలను తన భయంకరమైన చేతులతో కప్పుతోంది. తిరుగుతూ తిరుగుతూ ఆకులతో తీగలతో కప్పి... -
మబ్బులతో ముచ్చట్లు
మబ్బులతో ముచ్చట్లేమిటి? మబ్బులేమైనా మాట్లాడతాయా, మబ్బులకు ప్రాణం ఉందా అనే సందేహాలు కలుగుతాయి. నిజమే- మబ్బులు మాట్లాడలేవు. వాటికి ప్రాణం ఉండదు. అయినా కవిభావనలో ఇవన్నీ ఉన్నట్లే అనిపిస్తుంది. పూర్వం కుబేరుడు తన రాజధాని అలకాపురిలో యక్షరాజ్యాన్ని పాలించేవాడు. -
విన్నపాలు వినవలె...
లోక వ్యవహారంలో ప్రజలు వ్యక్తిగతంగా గాని సామూహికంగా గాని మంత్రులకో ఉన్నతాధికారులకో తమ కోరికలు సమస్యలు మనవి చేసుకోవడం చూస్తుంటాం. వాటిని విజ్ఞప్తులని విజ్ఞాపనలని వినతులని వ్యవహరిస్తారు. పైవారు కిందివారికి ఇచ్చేవి ఆదేశాలు ఆజ్ఞలు. ఈ వినతులకు ఆధ్యాత్మిక భక్తి వాఙ్మయంలో విశిష్ట స్థానం ఉంది. భక్తుడు భగవంతుడికి తన కష్టాలు విన్నవించుకొని మొరపెట్టుకోవడాన్ని కవులు వర్ణించారు. -
మోక్షదాయక నగరాలు
గరుడ పురాణ కథనం ప్రకారం మోక్షాన్నిచ్చే నగరాలు ఏడు. అవి- అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, కంచి, అవంతికా, ద్వారక. ఇవి మోక్షదాయకాలని పురాణాలు చెబుతున్నాయి. అయోధ్య కోసలరాజ్యానికి రాజధాని. సాకేతపురమనీ పిలుస్తారు. భారతదేశంలోని అతిపురాతన నగరాల్లో ఒకటి.
తాజా వార్తలు (Latest News)
-
వచ్చే వారమే రైతుల ఖాతాల్లోకి.. పీఎం-కిసాన్ నిధులు
-
ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలపై కసరత్తు.. సీఎస్, డీజీపీలతో చంద్రబాబు భేటీ
-
మైక్రోసాఫ్ట్ విజయం వెనుక భారత్.. కొనియాడిన బిల్గేట్స్
-
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి పూర్తి.. త్వరలో చుక్ చుక్ పరుగులు!
-
‘కాలర్ ఐడీ’పై ట్రయల్స్ మొదలు పెట్టిన టెలికాం కంపెనీలు
-
రాష్ట్రం కోసం నీతీశ్ ఏమి చేస్తున్నారు: ప్రశాంత్ కిషోర్