పంజరంలో చిలుక
జీవుడూ బ్రహ్మమేనని, బ్రహ్మకంటే వేరుకాదని ఆదిశంకరులు చెప్పారు. బంగారు పంజరంలో చిలుకలా, రక్తమాంసాలతో ఉన్న అస్థిపంజరంలో జీవుడు చిక్కుబడి దిక్కుతోచని స్థితిలో ఉన్నాడని ఆచార్యుల వారి అభిప్రాయం.
జీవుడూ బ్రహ్మమేనని, బ్రహ్మకంటే వేరుకాదని ఆదిశంకరులు చెప్పారు. బంగారు పంజరంలో చిలుకలా, రక్తమాంసాలతో ఉన్న అస్థిపంజరంలో జీవుడు చిక్కుబడి దిక్కుతోచని స్థితిలో ఉన్నాడని ఆచార్యుల వారి అభిప్రాయం. హాయిగా ఆకాశవీధిలో స్వేచ్ఛగా ఎగిరే పక్షిని బంధించి ఉంచడం నేరం. దానికీ స్వేచ్ఛగా జీవించే హక్కు ఉన్నదని జీవకారుణ్య సంస్థలు ఉద్యమించాయి. పక్షులు, జంతువులు, నోరులేని జీవాలు వాటి బాధను అవి చెప్పుకోలేవు. తెలివైన మనిషికి వాటిని సంరక్షించి ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ఉన్నది. లోకం అంతా సుఖంగా ఉండాలని ఆప్త వాక్యం చెబుతున్నది.
ఉత్తమ జీవి అయిన మనిషి మిగతా జీవరాశుల బాగోగులు చూడాలి. అందుకు తాను సిద్ధంగా ఉండాలి. ముందుగా తాను రంగుల కలలతో తన చుట్టూ అల్లుకున్న బంగారు పంజరాన్ని ఎలా వదిలించుకోవాలని ఆలోచించాలి. ‘దేహమే దేవాలయం, జీవుడే దేవుడు’ అన్న వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల విపరీత భావనలకు అవకాశం కలుగుతున్నది. జీవుడు నేరక చిలుక పంజరంలో చిక్కుబడిన చందాన, ఈ శరీరం తనది అనుకోవడం వల్లే అన్ని అనర్థాలకూ తెరలేస్తున్నది. ‘నేను దేహాన్ని కాను... ఈ దేహం నాది కాదు’ అన్న ఎరుక కలిగినప్పుడే, జీవుడు బ్రహ్మ అవుతాడు.
‘నీవు ఆత్మవు బ్రహ్మవు’ అని వేదోపనిషత్తులు చెబుతున్నాయి. అజ్ఞానంవల్ల పంజరాన్ని, చిలుకను వేరుగా చూడలేక, మనిషి మాయాసంసారంలో తానే ఒక పంజరపు చిలుక అయ్యాడు. దేహాత్మ భావనతో పంజరపు చిలుకలా బాధపడుతున్నాడు. అందుకే దేవుడని దేవాలయంలో కూచోబెట్టి తనలా చూస్తున్నాడు. కళ్లారా చూసుకోవడానికి భగవంతుడినీ తనలా మలచుకున్నాడు.
దేహమే దేవాలయం అన్నప్పుడు, దేవాలయాన్ని రోజూ శుభ్రం చేసినట్టు, పవిత్రంగా శరీరాన్ని ఇంద్రియాలను మనసును శుభ్రం చేసుకోవాలి. సరిదిద్దుకోవాలి. దేవాలయాన్ని పరిశుభ్రం చేయడానికి పరివారం ఉన్నది. దేహాలయాన్ని అలా ఉంచుకోవడానికి ఎవరికి వారే ప్రయత్నించాలి. ఈ ప్రపంచం జీవరాశులకు ఒక అతిథి గృహంలాంటిది. బాటసారులు అక్కడ సేదదీరి మళ్ళీ ముందుకు సాగుతారు. అలాగే, దేహం జీవుడికి తాత్కాలికమైన నెలవు. అద్దెకు దిగి ఈ ఇల్లు నా సొంతం అంటే చట్టం ఒప్పుకోదు. లోకం చిన్నచూపు చూస్తుంది.
శరీరానికి మరోపేరు ఉపాధి. ఉపాధి అంటే ఆసరా! అది ఆత్మకు బందిఖానా కాకూడదు. ఏరు దాటడానికి నావను ఉపయోగించిన విధంగానే వాడుకోవాలి. అభిమానం, అనురాగం పెంచుకుంటే బతుకంతా పంజరంలో చిలుక కాపురం అవుతుంది. నిష్కామకర్మ యోగం ద్వారా, ఆత్మను ప్రసన్నం చేసుకోవచ్చు. అలాంటివాడే యోగి. నిజమైన సన్యాసి. మనిషి తనను తానే ఉద్ధరించుకోవాలి- అని ఆత్మసంయమన యోగం(గీ.6-5)లో భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ గీతోపదేశం చేశాడు. నిష్కామకర్మ చేపట్టిన యోగిని యోగారూఢుడు అంటారు. అతడికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా నిత్యం యోగసాధన చేయాలి. యోగారూఢుడికి తన ఆత్మ మిత్రుడు. శరీరాన్ని, మనసును, ఇంద్రియాలను జయించినవాడు తనకు తానే మిత్రుడు. వాటికి దాసోహం అనేవాడికి అవే శత్రువులు. శత్రువులను మిత్రులుగా మార్చుకోగలిగితే భగవంతుడి సాక్షాత్కారం తప్పకుండా కలుగుతుంది. దైవసాక్షాత్కారానికి ముఖ్యమైన మూడు రహదారులున్నాయి. భక్తి జ్ఞాన వైరాగ్యాలు దారులు వేరైనా గమ్యానికి చేర్చే సాధనామార్గాలు. ఎరుక కలిగిన చిలుక ఎగిరిపోక తప్పదు!
ఉప్పు రాఘవేంద్రరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్పర్శ... సాంత్వన!
స్పర్శ అంటే తాకడం. అది- తనువుకు తనువుకు; తనువుకు మనసుకు మధ్య మాత్రమే కాదు... అనేక ఇంద్రియాలకు ఆనుసంధాన వారధి. దాని శక్తి అమోఘం, అమేయం. భౌతికమైన అనుభవం, మానసికమైన అనుభూతి, ఆధ్యాత్మికంగా పరిణతిలతోపాటు మనసును, ప్రకృతిని పులకింపజేయడం, రంజింప చేయడం స్పర్శ లక్షణం. -
మౌనం మధురం
మౌనం అనేది ఉద్దేశపూర్వక నిశ్శబ్దాన్ని నొక్కి చెప్పే తపస్సు. ఇది మనిషి మాటల్ని పరిమితం చేసే పవిత్రమైన అభ్యాసం. ఆధ్యాత్మిక అనుభవానికి అవసరమైన క్రమశిక్షణ. మౌనం మనసుకు సంబంధించిన నిశ్శబ్దం. ఇది గ్రహణశక్తిని పెంపొందిస్తుంది. సత్యాన్ని ప్రతిబింబించే ప్రశాంత జలాల మాదిరి నిశ్శబ్దం విషయాలను మరింత స్పష్టంగా చూసేందుకు సహాయపడుతుంది. -
దాన విధానం
చేసిన పుణ్యం చెడని పదార్థమన్నారు తాత్వికులు. భూమ్మీద కీర్తి ఎంతకాలం ఉంటుందో మానవులు అంతకాలం స్వర్గంలో ఉంటారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల బతికిన నాలుగురోజులూ పుణ్యకార్యాలు చేసి శాశ్వతమైన యశస్సును ఆర్జించుకోవాలి. ధర్మాచరణమే పుణ్యకార్యం. సత్యం, శుచిత్వం, దయ, దానం అనే నాలుగూ ధర్మదేవతకు నాలుగు పాదాలని సంప్రదాయ భావన. -
విద్యా వినయ సంపన్నత
మనిషి కొత్త విషయాలు తెలుసుకునేందుకు, నేర్చుకొనేందుకే పుడతాడంటారు. గడచే ప్రతి క్షణం జ్ఞానాన్ని బోధిస్తూనే ఉంటుంది. పుడమి తల్లి, కన్న తల్లికన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతాయి. అరిషడ్వర్గాలు ప్రమాదకరమైనవని, సద్గుణాలు ఆనందాన్నిస్తాయని సాధనతో తెలుసుకుంటాం. అందరూ అన్నింటా మేటి అనిపించుకోవడం సాధ్యం కాదు. -
పలుకుతేనెలు
మానవులందరూ మాట్లాడతారు. కాని, అందరి మాటలు ఒకే రీతిలో ఉండవు. కొందరి మాటలు కటువుగా రాళ్లలా ఉంటాయి. కొందరి మాటలు చక్కెర పలుకుల్లా ఉంటాయి. కొందరి మాటలు విషం చిమ్ముతాయి. కొందరి మాటలు తేనెలొలుకుతాయి. -
కష్టేఫలే
ఈ సృష్టిలో గ్రీష్మరుతువు, వర్షరుతువు ఎలాగైతే ఒకదాని తరవాత మరొకటి మారుతూ ఉంటాయో అలాగే జీవితంలోను కష్టాల వెంబడి సుఖాలు వస్తూ ఉంటాయి. కాని కష్టాలు ఆవహించినప్పుడు మాత్రం కొందరు బెదిరిపోతారు. ఈ ప్రకృతిలో ఎండ తగలకుండా పెరిగిన చెట్టులేదు. కష్టం లేకుండా ఎదిగిన మనిషి లేడు. -
జీవిత సాక్షాత్కారం
చెట్టు జీవిస్తోంది. పక్షి జీవిస్తోంది. పాము జీవిస్తోంది. ఎడతెగక పారుతూ నది జీవిస్తూ ఇతరులను జీవింపజేస్తోంది. జీవనం తన స్వరూపాన్ని చూపించాలని అనుకుంటే ఆ మానవ జీవితం గొప్పదే. ఒక జీవితంలో వంద జీవితాలు అనుభవించాను అన్నారు స్వామి వివేకానంద. జీవనసారం తెలుసుకుని ధార్మిక జీవనానికి కట్టుబడి ఉండాలి అంటున్నాయి శాస్త్రాలు. -
బోనం... భాగ్యం!
ప్రశస్తమైన ప్రకృతి సకల శక్తులకు ఆలంబన. ప్రకృతి నుంచే సమస్త చైతన్యం ఉత్పన్నమవుతుంది. ఆ చైతన్యశక్తిని ఆర్ష ధర్మం పలు రూపాల్లో దర్శిస్తోంది. శక్తి లేనిదే సృష్టి మనుగడ లేదు. శక్తి నిత్యత్వం ప్రకృతికి సర్వదా నూతనత్వాన్ని ఆపాదిస్తోంది. అందుకే ప్రకృతిని పరమాత్మ రూపంగా మనం ఆరాధిస్తున్నాం. -
లోకప్రియం
ఒక్కొక్కరికీ ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. మనుషులకే కాకుండా పశువులు, పక్షులు, వృక్షాలు లాంటి వాటికి కూడా ఇష్టాలుంటాయిని ప్రకృతి పరిశీలకుల మాటల వల్ల తెలుస్తోంది. వృక్షాలకు కూడా ప్రాణం ఉంటుందని, వాటికి ప్రియమైన వాతావరణ పరిస్థితులకు స్పందించి సుఖదుఃఖాల అనుభూతి చెందుతాయని జగదీష్ చంద్రబోస్ నిరూపించారు. -
ధన్య జీవితం
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు జన్మించాక ఎప్పుడో ఒకప్పుడు మరణం అనివార్యం. -
ధర్మ పోరాటం
ఒకరిని ప్రేమించి అభిమానించి వారి రక్షణ కోసం ధర్మ సమ్మతంగా పోరాడితే అది సముచితమైందిగా హదీసులు వివరిస్తున్నాయి. అన్యాయానికి తోడ్పాటునందిస్తే అది ఆత్మహత్యా సదృశమని దివ్య ఖురాన్ గ్రంథం బోధిస్తుంది. ధర్మాధర్మాలలో ఏ వైపున ఉన్నా నా వారు నా వారే అనుకుంటే అది దురభిమానమవుతుంది. -
శుభ ఏకాదశి
ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు పంచమి, దశమి, ఏకాదశి... వంటి మంచి రోజులను ఎంచుకోవడం చాలామందికి అలవాటు. -
మహోన్నతం
మనిషికి భగవంతుడిచ్చిన వరం- మాట. మాట్లాడే శక్తి మనిషికే ఉంది. అయితే అయినదానికి, కానిదానికి మాట్లాడవలసిన అవసరంలేదు. -
హారతి
శాస్త్రోక్తంగా చేసే పూజ- పునస్కారాల్లో పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, దక్షిణ, మంత్రపుష్పం, హారతి, ప్రదక్షిణం వంటివన్నీ దేవతార్చనలోని అంశాలే. -
నాలుగు మంచి మాటలు
మైత్రి, కరుణ, ముదిత (సానుకూల మానసిక స్థితి), ఉపేక్ష అనే నాలుగు సాధనాలతో జీవితాన్ని చింతనా రహితంగా అలంకరించుకోవచ్చు. ఈ నాలుగు భావనలూ ప్రతి మనిషిలోనూ ఉంటాయి. వాటిని అభివృద్ధి చేసుకోవడంలోనే ధన్యత ఉంది. -
ఆధ్యాత్మిక సాధన
ఇహలోక బంధాల నుంచి విముక్తి కలిగించి, పారలౌకిక మార్గమేదో తెలిపి, ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపకరించే ప్రక్రియనే సాధన అంటారు. ధ్యానం, జపం, నామస్మరణ మొదలైన క్రియలతో చిత్తవృత్తుల పరుగులకు కళ్ళెం వేయడానికి చేసే ప్రయత్నమే సాధన. -
అదృష్టం - దురదృష్టం
మన జీవితంలో అదృష్టం, దురదృష్టం అనే మాటలు తరచుగా ప్రస్తావనకు వస్తాయి. కొందరిని అదృష్టవంతులుగాను, కొందరిని దురదృష్టవంతులుగాను పేర్కొంటుంటాం. దృష్టమంటే కంటికి కనిపించేది. దురదృష్టం దానికి వ్యతిరేకమైనది. కనబడనిది మనం ఊహించలేనిది. హఠాత్తుగా అనూహ్యంగా ఏదైనా మంచి జరిగినా, ప్రమాదం తప్పిపోయినా అదృష్టమనుకుంటాం. -
కష్టం-సుఖం
తన జీవితం సమస్యా రహితంగా, సుఖంగా సాగాలని ప్రతీ మనిషికి ఉండటం సమంజసమే. కాని తనకే ఏ సమస్యా రాకూడదు, తాను సుఖంగా బతికితే చాలు అనుకోవడం అనేక కష్టాలకు మూలం అవుతుంది. -
వెలుగు నుంచి చీకటికి...
కష్టసుఖాలు, సుఖదుఃఖాలు, చీకటివెలుగులన్నవి పడుగుపేకలు. అవి జీవితంలో సర్వసాధారణమని మాటవరసకు అంటాం కాని కష్టానికి, నష్టానికి, బాధకు వెరవని వారుండరు. -
అన్నమహిమ
అసంఖ్యాక ప్రాణికోటికి ఆహారం ‘అన్నం’. జఠరాగ్ని మండిపోతున్నప్పుడు ఆకలివేస్తుంది. ఆకలిని చల్లార్చడానికి అన్నం కావాలి. భోజన పదార్థాలన్నీ అన్నాలే. అన్నాన్ని తింటేనే ఆకలి చల్లారుతుంది. ఆత్మారాముడు సంతోషిస్తాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం