కీలుబొమ్మ
అలవాటైన పనులు యాంత్రికంగా సాగుతుంటాయి. యంత్రాలు చేసే పనులు మరింత యాంత్రికంగా ఉంటాయి. యంత్రం మనిషి జీవనంలో ప్రవేశించిన తరవాత మనిషి సున్నిత భావాలు తగ్గిపోయాయి. యంత్రం పని చేస్తుంది. యంత్రాన్ని పని చేయించేవాడు మనిషే. యంత్రం మూలాన మనిషి కనబడకుండా పోతున్నాడు.
అలవాటైన పనులు యాంత్రికంగా సాగుతుంటాయి. యంత్రాలు చేసే పనులు మరింత యాంత్రికంగా ఉంటాయి. యంత్రం మనిషి జీవనంలో ప్రవేశించిన తరవాత మనిషి సున్నిత భావాలు తగ్గిపోయాయి. యంత్రం పని చేస్తుంది. యంత్రాన్ని పని చేయించేవాడు మనిషే. యంత్రం మూలాన మనిషి కనబడకుండా పోతున్నాడు.
యంత్రం ఉండవచ్చు. యంత్రం చేసే పని చాలామంది చేసే పనులకు ప్రత్యామ్నాయం కావచ్చు. కాని, యంత్రాలకు భావాలుండవు. హృదయం ఉండదు. యంత్రం చేసే పని యంత్రం చెయ్యాలి.
యంత్రాలు మనుషుల్లాగా పని చేస్తున్నాయి. మర మనుషులు ఇంట్లో ప్రవేశిస్తున్నారు. అన్ని పనులూ చేస్తున్నారు. చక్కటి మాటలు మాట్లాడుతున్నారు. సేవ చేస్తున్నారు. పాటలు పాడి ఆనందింపజేస్తున్నారు. తైతక్కలాడుతున్నారు. తథిగిణతోం అంటున్నారు.
దేవుడి చేతిలో కీలుబొమ్మే మనిషి. ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడుతుండాలి. జగన్నాటక సూత్రధారి వెనక ఉండి ఆడిస్తాడు. మనం ఆడాలి. అంతే మానవ జీవితం అంటారు వేదాంతులు. ఉపనిషత్తులు అదే విషయం చెబుతున్నాయి.
ప్రకృతి చేతిలో కీలుబొమ్మే మనిషి. ప్రకృతిని నియంత్రించాలని ఎన్నో పథకాలు వేస్తాడు. కాని, ఎక్కడో తప్పు జరిగి ప్రకృతి ముందుకు దూసుకుపోతుంది. నువ్వు నన్నందుకోలేవని తన శక్తిని నిరూపిస్తుంది. అయినా, మనిషి ఊరుకోడు. మానవుడే మహనీయు డంటాడు. ప్రయత్నం వదలడు. జీవితాన్ని సుఖవంతం చేసుకోవాలని చూస్తాడు. ఆకాశానికి నిచ్చెనలు వేస్తాడు.
దైవం చేతిలో కీలుబొమ్మే అయినా మరబొమ్మలా ఉండడు మనిషి. జడ పదార్థంలా ఉండడు. చైతన్యం కలిగి ఉంటాడు. ఎత్తుకు పైయెత్తులు వేస్తూనే ఉంటాడు.
విశ్వాన్ని నడిపించే దివ్యశక్తి తనలో కూడా ఉందని తెలుసు కనుక భగవంతుడికి ఎదురు వెళతాడు. నువ్వెక్కడున్నావని దైవం ఉనికిని ప్రశ్నిస్తూనే తన యాంత్రికతను, కీలుబొమ్మతనాన్ని వదిలించుకోవాలని చూస్తాడు.
ఇంట్లో మరబొమ్మ(రోబో) పని చేస్తుంది. కార్యాలయాల్లో, కార్ఖానాల్లో, పరిశ్రమల్లో పని చేస్తుంది. మనిషి అనే ఈ కీలుబొమ్మ విశ్వవేదిక మీద దైవం ఆడించే నాటకంలో పాత్రధారిగా ఆడుతుంది.
యంత్రానికి స్వేచ్ఛ లేదు. మనిషి చెప్పినట్లు ఆడాలి. నరుడికి స్వేచ్ఛ ఉంది. ఇచ్ఛాశక్తి ఉంది. భగవంతుడు దయామయుడు. గోవుకు తాడు కట్టి వదిలినట్లు మన పరిధుల్లో మనం వ్యవహరిస్తూనే విశ్వ దివ్యత్వానికి కట్టుబడి ఉంటాం. ప్రేమ, దయ, క్షమ, కరుణ అనే గుణాలకు స్పందిస్తూనే జీవితం సాగిస్తుంటాం.
మర బొమ్మ అనుకోకుండా చేసే తప్పులు కూడా కీలుబొమ్మ కారణంగా చేసినవే. కీలుబొమ్మలు మానవత్వం మరిచి తప్పులు చేస్తాయి. మర బొమ్మలు అలా చెయ్యవు. వాటి పరిధుల్లో అవి నడుచుకుంటాయి. వాటి నుంచి కీలుబొమ్మలైన మనుషులు నేర్చుకోవాలి. విలువల్ని కాపాడుకోవాలి. యాంత్రికత్వం నుంచి సహజత్వం వైపు ప్రయాణించాలి. మరబొమ్మకు జీవం లేదు. కీలు బొమ్మలకు జీవం ఉంది. భావం ఉంది. యోగం ఉంది. ధ్యానం ఉంది. ప్రేమ ఉంది. బంధం ఉంది. బాధ్యత ఉంది. ముఖ్యంగా కీలుబొమ్మల కదలికల్లో చైతన్యం ఉంది. ఆనందం ఉంది. అదే సత్యమై వాటిని నడిపిస్తుంది. పంచభూతాల లోహాలతో తయారైన కీలుబొమ్మలు నిజంగా బొమ్మలా? కానే కావు. విశ్వాలయ మంటపాన్ని నిత్యం మోసే, భువన శిల్పి చెక్కిన అందమైన భావనలు!
ఆనందసాయి స్వామి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్పర్శ... సాంత్వన!
స్పర్శ అంటే తాకడం. అది- తనువుకు తనువుకు; తనువుకు మనసుకు మధ్య మాత్రమే కాదు... అనేక ఇంద్రియాలకు ఆనుసంధాన వారధి. దాని శక్తి అమోఘం, అమేయం. భౌతికమైన అనుభవం, మానసికమైన అనుభూతి, ఆధ్యాత్మికంగా పరిణతిలతోపాటు మనసును, ప్రకృతిని పులకింపజేయడం, రంజింప చేయడం స్పర్శ లక్షణం. -
మౌనం మధురం
మౌనం అనేది ఉద్దేశపూర్వక నిశ్శబ్దాన్ని నొక్కి చెప్పే తపస్సు. ఇది మనిషి మాటల్ని పరిమితం చేసే పవిత్రమైన అభ్యాసం. ఆధ్యాత్మిక అనుభవానికి అవసరమైన క్రమశిక్షణ. మౌనం మనసుకు సంబంధించిన నిశ్శబ్దం. ఇది గ్రహణశక్తిని పెంపొందిస్తుంది. సత్యాన్ని ప్రతిబింబించే ప్రశాంత జలాల మాదిరి నిశ్శబ్దం విషయాలను మరింత స్పష్టంగా చూసేందుకు సహాయపడుతుంది. -
దాన విధానం
చేసిన పుణ్యం చెడని పదార్థమన్నారు తాత్వికులు. భూమ్మీద కీర్తి ఎంతకాలం ఉంటుందో మానవులు అంతకాలం స్వర్గంలో ఉంటారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల బతికిన నాలుగురోజులూ పుణ్యకార్యాలు చేసి శాశ్వతమైన యశస్సును ఆర్జించుకోవాలి. ధర్మాచరణమే పుణ్యకార్యం. సత్యం, శుచిత్వం, దయ, దానం అనే నాలుగూ ధర్మదేవతకు నాలుగు పాదాలని సంప్రదాయ భావన. -
విద్యా వినయ సంపన్నత
మనిషి కొత్త విషయాలు తెలుసుకునేందుకు, నేర్చుకొనేందుకే పుడతాడంటారు. గడచే ప్రతి క్షణం జ్ఞానాన్ని బోధిస్తూనే ఉంటుంది. పుడమి తల్లి, కన్న తల్లికన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతాయి. అరిషడ్వర్గాలు ప్రమాదకరమైనవని, సద్గుణాలు ఆనందాన్నిస్తాయని సాధనతో తెలుసుకుంటాం. అందరూ అన్నింటా మేటి అనిపించుకోవడం సాధ్యం కాదు. -
పలుకుతేనెలు
మానవులందరూ మాట్లాడతారు. కాని, అందరి మాటలు ఒకే రీతిలో ఉండవు. కొందరి మాటలు కటువుగా రాళ్లలా ఉంటాయి. కొందరి మాటలు చక్కెర పలుకుల్లా ఉంటాయి. కొందరి మాటలు విషం చిమ్ముతాయి. కొందరి మాటలు తేనెలొలుకుతాయి. -
కష్టేఫలే
ఈ సృష్టిలో గ్రీష్మరుతువు, వర్షరుతువు ఎలాగైతే ఒకదాని తరవాత మరొకటి మారుతూ ఉంటాయో అలాగే జీవితంలోను కష్టాల వెంబడి సుఖాలు వస్తూ ఉంటాయి. కాని కష్టాలు ఆవహించినప్పుడు మాత్రం కొందరు బెదిరిపోతారు. ఈ ప్రకృతిలో ఎండ తగలకుండా పెరిగిన చెట్టులేదు. కష్టం లేకుండా ఎదిగిన మనిషి లేడు. -
జీవిత సాక్షాత్కారం
చెట్టు జీవిస్తోంది. పక్షి జీవిస్తోంది. పాము జీవిస్తోంది. ఎడతెగక పారుతూ నది జీవిస్తూ ఇతరులను జీవింపజేస్తోంది. జీవనం తన స్వరూపాన్ని చూపించాలని అనుకుంటే ఆ మానవ జీవితం గొప్పదే. ఒక జీవితంలో వంద జీవితాలు అనుభవించాను అన్నారు స్వామి వివేకానంద. జీవనసారం తెలుసుకుని ధార్మిక జీవనానికి కట్టుబడి ఉండాలి అంటున్నాయి శాస్త్రాలు. -
బోనం... భాగ్యం!
ప్రశస్తమైన ప్రకృతి సకల శక్తులకు ఆలంబన. ప్రకృతి నుంచే సమస్త చైతన్యం ఉత్పన్నమవుతుంది. ఆ చైతన్యశక్తిని ఆర్ష ధర్మం పలు రూపాల్లో దర్శిస్తోంది. శక్తి లేనిదే సృష్టి మనుగడ లేదు. శక్తి నిత్యత్వం ప్రకృతికి సర్వదా నూతనత్వాన్ని ఆపాదిస్తోంది. అందుకే ప్రకృతిని పరమాత్మ రూపంగా మనం ఆరాధిస్తున్నాం. -
లోకప్రియం
ఒక్కొక్కరికీ ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. మనుషులకే కాకుండా పశువులు, పక్షులు, వృక్షాలు లాంటి వాటికి కూడా ఇష్టాలుంటాయిని ప్రకృతి పరిశీలకుల మాటల వల్ల తెలుస్తోంది. వృక్షాలకు కూడా ప్రాణం ఉంటుందని, వాటికి ప్రియమైన వాతావరణ పరిస్థితులకు స్పందించి సుఖదుఃఖాల అనుభూతి చెందుతాయని జగదీష్ చంద్రబోస్ నిరూపించారు. -
ధన్య జీవితం
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు జన్మించాక ఎప్పుడో ఒకప్పుడు మరణం అనివార్యం. -
ధర్మ పోరాటం
ఒకరిని ప్రేమించి అభిమానించి వారి రక్షణ కోసం ధర్మ సమ్మతంగా పోరాడితే అది సముచితమైందిగా హదీసులు వివరిస్తున్నాయి. అన్యాయానికి తోడ్పాటునందిస్తే అది ఆత్మహత్యా సదృశమని దివ్య ఖురాన్ గ్రంథం బోధిస్తుంది. ధర్మాధర్మాలలో ఏ వైపున ఉన్నా నా వారు నా వారే అనుకుంటే అది దురభిమానమవుతుంది. -
శుభ ఏకాదశి
ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు పంచమి, దశమి, ఏకాదశి... వంటి మంచి రోజులను ఎంచుకోవడం చాలామందికి అలవాటు. -
మహోన్నతం
మనిషికి భగవంతుడిచ్చిన వరం- మాట. మాట్లాడే శక్తి మనిషికే ఉంది. అయితే అయినదానికి, కానిదానికి మాట్లాడవలసిన అవసరంలేదు. -
హారతి
శాస్త్రోక్తంగా చేసే పూజ- పునస్కారాల్లో పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, దక్షిణ, మంత్రపుష్పం, హారతి, ప్రదక్షిణం వంటివన్నీ దేవతార్చనలోని అంశాలే. -
నాలుగు మంచి మాటలు
మైత్రి, కరుణ, ముదిత (సానుకూల మానసిక స్థితి), ఉపేక్ష అనే నాలుగు సాధనాలతో జీవితాన్ని చింతనా రహితంగా అలంకరించుకోవచ్చు. ఈ నాలుగు భావనలూ ప్రతి మనిషిలోనూ ఉంటాయి. వాటిని అభివృద్ధి చేసుకోవడంలోనే ధన్యత ఉంది. -
ఆధ్యాత్మిక సాధన
ఇహలోక బంధాల నుంచి విముక్తి కలిగించి, పారలౌకిక మార్గమేదో తెలిపి, ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపకరించే ప్రక్రియనే సాధన అంటారు. ధ్యానం, జపం, నామస్మరణ మొదలైన క్రియలతో చిత్తవృత్తుల పరుగులకు కళ్ళెం వేయడానికి చేసే ప్రయత్నమే సాధన. -
అదృష్టం - దురదృష్టం
మన జీవితంలో అదృష్టం, దురదృష్టం అనే మాటలు తరచుగా ప్రస్తావనకు వస్తాయి. కొందరిని అదృష్టవంతులుగాను, కొందరిని దురదృష్టవంతులుగాను పేర్కొంటుంటాం. దృష్టమంటే కంటికి కనిపించేది. దురదృష్టం దానికి వ్యతిరేకమైనది. కనబడనిది మనం ఊహించలేనిది. హఠాత్తుగా అనూహ్యంగా ఏదైనా మంచి జరిగినా, ప్రమాదం తప్పిపోయినా అదృష్టమనుకుంటాం. -
కష్టం-సుఖం
తన జీవితం సమస్యా రహితంగా, సుఖంగా సాగాలని ప్రతీ మనిషికి ఉండటం సమంజసమే. కాని తనకే ఏ సమస్యా రాకూడదు, తాను సుఖంగా బతికితే చాలు అనుకోవడం అనేక కష్టాలకు మూలం అవుతుంది. -
వెలుగు నుంచి చీకటికి...
కష్టసుఖాలు, సుఖదుఃఖాలు, చీకటివెలుగులన్నవి పడుగుపేకలు. అవి జీవితంలో సర్వసాధారణమని మాటవరసకు అంటాం కాని కష్టానికి, నష్టానికి, బాధకు వెరవని వారుండరు. -
అన్నమహిమ
అసంఖ్యాక ప్రాణికోటికి ఆహారం ‘అన్నం’. జఠరాగ్ని మండిపోతున్నప్పుడు ఆకలివేస్తుంది. ఆకలిని చల్లార్చడానికి అన్నం కావాలి. భోజన పదార్థాలన్నీ అన్నాలే. అన్నాన్ని తింటేనే ఆకలి చల్లారుతుంది. ఆత్మారాముడు సంతోషిస్తాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం