పెరుగుతున్న కొవిడ్ ఉద్ధృతి
రాష్ట్రంలో కొవిడ్ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. 24 గంటల్లో కొత్తగా 6,996 కరోనా కేసులు నమోదయ్యాయి. సంక్రాంతి పండగకు చాలా మంది సొంతూర్లకు వెళ్లొచ్చారు. ఈ క్రమంలో
కొత్తగా 6,996 మందికి వైరస్
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొవిడ్ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. 24 గంటల్లో కొత్తగా 6,996 కరోనా కేసులు నమోదయ్యాయి. సంక్రాంతి పండగకు చాలా మంది సొంతూర్లకు వెళ్లొచ్చారు. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా జరిగినందువల్లే కేసులు అధిక సంఖ్యలో బయటపడుతున్నాయి. సోమవారం 4,018 (17.95%) కేసులు నమోదయ్యాయి. 24 గంటలు గడిచేసరికి కొత్త కేసులు 7 వేలకు చేరువలో రావడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఉదయం 9 నుంచి మంగళవారం ఉదయం 9 గంటల మధ్య 38,055 నమూనాలు పరీక్షించారు. పాజిటివిటీ రేటు 22.67%గా చేరుకోవడం గమనార్హం. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో 48.46%, 35.21% చొప్పున పాజిటివిటీ రేటు నమోదైంది. కొవిడ్తో విశాఖ జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున నలుగురు ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో 36,108 క్రియాశీలక కేసులు ఉన్నాయి.
తిరుపతిలో 100 మంది వైద్య సిబ్బందికి
ఈనాడు, తిరుపతి: తిరుపతిలోని రుయాలో కొవిడ్ బారినపడి 25 మంది వైద్యులు/సిబ్బంది ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటుండగా... మరో 30 మంది వరకు హోం ఐసొలేషన్లో ఉన్నారు. స్విమ్స్లోనూ 50 మంది వైద్యులు/ఆసుపత్రి సిబ్బంది/వైద్య విద్యార్థులు కరోనా సోకి చికిత్స పొందుతున్నారు. సాధారణ రోగులకు, కొవిడ్ బాధితులకు సేవల్లో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్విమ్స్ డైరెక్టర్ బి.వెంగమ్మ, రుయా సూపరింటెండెంట్ భారతి తెలిపారు.
* తెలంగాణలో మంగళవారం 2,983 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 7 నెలల తర్వాత ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. మొత్తం బాధితుల సంఖ్య 7,14,639కి పెరిగింది. ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు కొవిడ్ బారినపడ్డారు. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 1,07,904 నమూనాలను పరీక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భయాలను పెంచేలా.. ‘నోరు నొక్కేసేలా..!’
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుపై సీఎం జగన్, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలే రైతులు, వివిధ వర్గాల ప్రజల్లో భయాలను మరింత పెంచేలా ఉంటున్నాయి. -
విచారణ జరగాల్సిన తీరులో జరగట్లేదన్న ఆరోపణలున్నాయి
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ప్రకియ జరగాల్సిన తీరులో జరగట్లేదన్న ఆరోపణలున్నాయని, అందువల్ల ఈ కేసును మరో రోజు ప్రత్యేకంగా వింటామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. -
ఈసీ తీరును నిరసిస్తున్నాం: బొత్స సత్యనారాయణ
కేంద్ర ఎన్నికల సంఘం తీరును వైకాపా నిరసిస్తోందని, ఆక్షేపిస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపేయండి
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
జగన్ పాలనలో ఆర్యవైశ్యులకు అన్యాయం
జగన్ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు ఎటువంటి న్యాయమూ జరగలేదని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుండూరు ఉమామహేశ్వరరావు విమర్శించారు. -
మేం వైకాపాకు మద్దతు ఇవ్వలేదు
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్... వైకాపాకు మద్దతు ప్రకటించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటనను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది బషీర్ అహ్మద్ శుక్రవారం తీవ్రంగా ఖండించారు. -
మార్గదర్శి నగదు, చెక్కులు సక్రమమే
విశాఖపట్నంలో మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థకు చెందిన సీతంపేట బ్రాంచ్ సిబ్బంది బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తుండగా స్వాధీనం చేసుకున్న నగదు, చెక్కుల్ని జిల్లా యంత్రాంగం తిరిగి అప్పగించింది. -
సింహాచలంలో వైభవోపేతంగా చందనోత్సవం
వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో కొలువైన శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారు శుక్రవారం నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
తల్లితో కలిసి నేడు పిఠాపురానికి రామ్చరణ్
అగ్ర నటుడు చిరంజీవి తనయుడు, సినీ నటుడు రామ్చరణ్ శనివారం పిఠాపురం రానున్నారు. -
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
కాకినాడ జిల్లా పిఠాపురంలో శనివారం సీఎం జగన్ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో అక్కడి అవసరాల కోసం రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ వాహనాలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశమైంది. -
‘మూడు కోట్ల ఎకరాలకు’ బీమా ఎగ్గొట్టారు
పంట వేస్తే చాలు ప్రభుత్వమే బీమా కల్పిస్తుందని నమ్మిన రైతుల్ని జగన్ నిలువెల్లా మోసం చేశారు. -
ఆసుపత్రులు ఆగం.. తగ్గేదెలా రోగం?
పదే పదే ప్రచారం చేసి లేనిది ఉన్నట్లు నమ్మించే గోబెల్స్ ప్రచారంలో జగన్ ముందుంటారు. ఏమీ చేయకున్నా చేసినట్లు చెబుతూ ప్రజలను మోసం చేసే ప్రయత్నంలో ఆయన దిట్ట. -
విద్యుత్ ఛార్జీల భారం కావాలా.. ఇంటింటా వెలుగులు కావాలా?
తెదేపా హయాంలో ప్రజలపై అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీల భారం పడింది. మేము అధికారంలోకి వచ్చాక ఆ భారాన్ని తగ్గిస్తాం’ అంటూ మైకు పట్టుకుని కొడుతూ డబ్ డబ్ (గుండె చప్పుడును తలపించేలా శబ్దం).. చెప్పిన వ్యక్తి గుర్తుకు వచ్చారా? రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో సామాన్య విద్యుత్ వినియోగదారుడిపై శ్లాబ్ వారీగా గరిష్ఠంగా 40శాతం ఛార్జీలు పెరిగాయి. దీంతో పేదలే కాదు.. ధనికులూ విద్యుత్ వాడాలంటే భయపడే పరిస్థితిని కల్పించారు. -
అరాచకపాలనలో అందరూ బాధితులే..!
అన్యాయాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో వేధింపులు.. సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెడితే ఇళ్లపై అర్ధరాత్రి బందిపోటుల్లా దాడులు.. వైకాపా రాజ్యాంగం అమలు చేస్తూ రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టి జైల్లో పడేయడం.. ఈ ఐదేళ్లల్లో జగన్ సాగించిన దమనకాండను ‘టీం స్వేచ్ఛ’ కళ్లకు కట్టినట్లు గణాంకాలతో వెల్లడించింది. -
ఏసీఏలో కోట్ల రూపాయల దుర్వినియోగం
‘ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ).. క్రీడాకారుల జీవితాలను నాశనం చేస్తోంది. కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తోంది. -
వివేకా కుమార్తె సునీత, అల్లుడు, సీబీఐ ఎస్పీ వ్యాజ్యాల కొట్టివేత
పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్సింగ్ దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది. -
ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలి
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి, ఎన్నికల నిఘా వేదిక పరిశీలకులు జీవీ కృష్ణారావు అన్నారు. -
ఆ 15 రోజులు ఎప్పటికి వచ్చేనో?
పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యమంటూ జగన్ డప్పు కొట్టుకుంటారు. తాను వచ్చాకే సంక్షేమ పథకాలను కొత్తగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లుగా బూరలు ఊదుతారు. -
ఉద్యాన రైతుకు.. ఉరి!
రాష్ట్రంలోని ఉద్యాన రైతులకు గత తెదేపా ప్రభుత్వం అండగా నిలిచింది. పూలు, పండ్లు, కూరగాయల సాగే లాభదాయకం అన్న భావన కలిగించింది. -
తుడా.. నుడా.. అనుడా.. దోచేయ్ ఎడాపెడా!
జగన్ ఏలుబడిలో వైకాపా నేతలు కొన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి ఇంకొన్నింటిని తమ వ్యక్తిగత, వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. వాటిలో పట్టణాభివృద్ధి సంస్థలు ప్రధానమైనవి. -
పేదల గొంతెండబెట్టిన జగన్!
జనానికి గుక్కెడు నీరిచ్చే.. జలజీవన్ మిషన్ (జేజేఎం) పనులకూ సహకరించని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్రెడ్డే.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!