Kankipadu Casino: కంకిపాడులో క్యాసినో!
సంక్రాంతి సందర్భంగా గుడివాడలో నిర్వహించిన ‘గోవా క్యాసినో’ వ్యవహారం మరువక ముందే కృష్ణా జిల్లాలో మరో ఈవెంట్కు పెద్దలు రంగం సిద్ధం చేశారు. గోవా కల్చర్తో క్యాసినో..
ఎంపిక చేసిన వారి కోసం ఏర్పాట్లు..
అనుమతులకు దరఖాస్తులు
ఈనాడు, అమరావతి: సంక్రాంతి సందర్భంగా గుడివాడలో నిర్వహించిన ‘గోవా క్యాసినో’ వ్యవహారం మరువక ముందే కృష్ణా జిల్లాలో మరో ఈవెంట్కు పెద్దలు రంగం సిద్ధం చేశారు. గోవా కల్చర్తో క్యాసినో.. మందు పార్టీలు, సినీ తారల డ్యాన్సులు, విందులు.. ఇలా అన్నీ ఏర్పాటు చేసుకున్నారు. దీనికి ఈసారి పెనమలూరు నియోజకవర్గం వేదికగా మారింది. బుధవారం (ఈనెల 22న) రాత్రి నిర్వహించేందుకు పటిష్ఠ ఏర్పాట్లు చేసుకున్నారు. శ్రీమంతులు, అతికొద్ది మంది నేతలు.., ప్రముఖులకు ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రాలు పంపారు. ఈ విషయం మంగళవారం బయటకు రావడంతో కలకలం రేగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కంకిపాడు పట్టణంలో ఒక హోటల్, కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు. దీనికి ప్రత్యేకంగా ఆహ్వాన పత్రం ముద్రించి ఎంపిక చేసిన వారికి మాత్రమే పంపారు. ఇక్కడ గెట్ టు గెదర్ తరహాలో ఈవెంట్ నిర్వహించుకుంటున్నామని, అనుమతి ఇవ్వాలని కంకిపాడు పోలీసులకు దరఖాస్తు చేశారు. దీన్ని గన్నవరం ఏసీపీ కార్యాలయానికి పంపారు. కేవలం డాన్సులు, డీజే కోసం ఈ దరఖాస్తు చేశారు. మద్యం తాగేందుకు అనుమతి ఇవ్వాలని ఎక్సైజ్ పోలీసులకు దరఖాస్తు చేసుకోగా వారు అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. అయితే పోలీసులు మాత్రం ఈవెంట్ నిర్వహణకు అనుమతి ఇవ్వలేదు. ఉన్నత స్థాయి నుంచి ఇందుకు ఒత్తిళ్లు వచ్చాయని తెలిసింది. మంగళవారం సామాజిక మాధ్యమాల్లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. క్యాసినో నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈవెంట్ పేరుతో గోవా నుంచి అమ్మాయిలు, టాలీవుడ్, బాలీవుడ్ సినీ తారలు, ప్రముఖ గాయకులు కూడా వస్తున్నట్లు తెలిసింది. వీరికి భారీగానే అడ్వాన్సులు కూడా చెల్లించారు. కన్వెన్షన్ సెంటర్కు క్యాసినో పేరుతో అడ్వాన్సులు చెల్లించారు. ఎంట్రీ రుసుము రూ.20వేల వరకు పెట్టినట్లు సమాచారం. గత రెండు రోజులుగా కంకిపాడులో దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఈ క్యాసినో జరుగుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై కంకిపాడు పోలీసులను వివరణ కోరగా క్యాసినో విషయం తమ దృష్టికి రాలేదని, ఈవెంట్ నిర్వహణకు మాత్రమే దరఖాస్తు అందిందని, అనుమతి ఇంకా ఇవ్వలేదని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
3వ రోజుకు చేరిన భారతి సిమెంటు ఉద్యోగుల ఆందోళన
తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ.. వైఎస్సాఆర్ జిల్లా కమలాపురం మండలం నల్లింగాయపల్లెలోని భారతి సిమెంటు పరిశ్రమ వద్ద ఉద్యోగులు చేపట్టిన ఆందోళన శనివారం మూడో రోజుకు చేరింది. -
సంక్షిప్త వార్తలు
విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్కు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైకాపా నేతలు స్వాగతం పలికారు. -
ఎన్నికల విధుల నుంచి కారంపూడి సీఐ తొలగింపు
పల్నాడు జిల్లా కారంపూడి సీఐ నారాయణస్వామిని ఎన్నికల విధుల నుంచి తొలగించారు. -
ఇదీ సంగతి!
-
ఉద్యోగులను తీవ్రవాదుల్లా చూడటం తగదు
హక్కుల కోసం పోరాడే ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రవాదుల్లా చూడటం తగదని ఉద్యోగ, ఉపాధ్యాయ, సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర ఛైర్మన్ కె.సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు
శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 20 గంటలు పడుతోంది. శనివారం సాయంత్రానికి క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. -
అంజన్నకు లక్ష అరటిపండ్ల అలంకరణ
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణం రెండో బైపాస్ రోడ్డులో ఉన్న అభయాంజనేయస్వామి దేవాలయంలో 27 అడుగుల విగ్రహానికి శనివారం లక్ష అరటి పండ్లతో అలంకరణ చేశారు. -
గులకరాయి కేసులో నిందితుడి పూచీకత్తులకు కోర్టు ఆమోదం
గులకరాయి కేసులో నిందితుడు సతీష్ బెయిల్పై విడుదలయ్యేందుకు సమర్పించిన పూచీకత్తులను కోర్టు ఆమోదించింది. -
బోర్డింగ్ పాస్ తీసుకున్నాక విమానం రద్దు
తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో తరచూ విమాన సర్వీసులు రద్దు అవుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
అల్యూమినియం పరిశ్రమలో.. 35 మంది కార్మికులకు అస్వస్థత
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం రాజులపాళెం సమీపంలోని సీఎంఆర్ ఎకో అల్యూమినియం పరిశ్రమలో శనివారం విషవాయువు వెలువడి 35 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. -
ఎండ తీవ్రతకు 4 బస్సులు దగ్ధం
ఒడిశాలోని రాయగడ జిల్లా బిసంకటక్లో శనివారం ఎండ తీవ్రతకు నాలుగు బస్సులు దగ్ధమైనట్లు అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. -
రాష్ట్రంలో వడదెబ్బకు ఐదుగురి మృతి
వడదెబ్బకు గురై ప్రకాశం జిల్లాలో శనివారం ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. -
మరో రెండ్రోజుల్లో రాష్ట్రానికి ‘నైరుతి’
రాబోయే 2 లేదా 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. -
నేటి నుంచి టోల్ మోత.. అర్ధరాత్రి నుంచి పెరగనున్న ఛార్జీలు
ఎన్హెచ్ఏఐ టోల్ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ 3 (ఆదివారం అర్ధరాత్రి) నుంచి పెరగనున్నాయి. -
సముద్ర తీరంలో బంగారం వేట
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలోని సాగర తీరానికి బంగారు రేణువులు కొట్టుకొస్తున్నాయని స్థానికులు వాటి వేటలో పడ్డారు. -
అతిసారానికి మరో ఇద్దరి బలి
విజయవాడలో అతిసారం మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కలుషిత జలాలు తాగడం వల్ల ఇప్పటికే నగరంలో ఎనిమిది మంది చనిపోగా.. తాజాగా శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం ఇద్దరు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. -
పాముకాటుకు, ముల్లుకు తేడా తెలీదా డాక్టరూ!
అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి వైద్యుల నిర్లక్ష్యం వల్ల తమకు దూరమయ్యాడని బాధిత తల్లిదండ్రులు ఫ్లెక్సీతో వినూత్నంగా నిరసన తెలిపారు. -
డోలాయమానంలో 7 కొత్త వైద్య కళాశాలల ప్రారంభం
వైకాపా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో 2025-26 సంవత్సరంలో కొత్తగా ఏర్పాటు కావాల్సిన 7 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తరగతుల ప్రారంభంపై సందేహాలు ముసురుకున్నాయి. -
అన్న పానీయాల్లో నాణ్యత ‘గోవిందా గోవింద!’
కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరుని నిలయం తిరుమల. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునిగా లక్షలమంది భక్తుల పూజలందుకునే స్వామి కొలువైన ఈ పుణ్యక్షేత్రం నిత్యకల్యాణం, పచ్చతోరణం. దేశ, విదేశాల్లోని హిందూ భక్తులు నిత్యం వేలల్లో తిరుమల సందర్శించి మొక్కులు తీర్చుకుంటారు. -
భోగాపురంలో ‘భూ’చాళ్లు!
భోగాపురం మండలం బసవపాలెంలో ఓ రైతుకు 1.30 ఎకరాల డి-పట్టా భూమి ఉంది. ఓ వ్యక్తి ఈ భూమి కొనడానికి ఈయనతో రూ. 12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. -
‘జల’దరిస్తున్న విజయవాడ
కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ బంగ్లాలకు శుద్ధి చేసిన, స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తుంటారు. నీటిలోనూ నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తారు.