Kokapet Neopolis: ఎకరం రూ.100 కోట్లు!
హైదరాబాద్ చరిత్రలోనే ఎకరా భూమి అత్యధిక ధర పలికింది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో కోకాపేటలో 239, 240 సర్వే నంబర్లలో అభివృద్ధి చేసిన నియో పోలిస్ లేఅవుట్లలో తాజాగా ఎకరం రూ.100.75 కోట్లకు అమ్ముడుపోయింది.
కోకాపేట నియోపోలిస్లో కోట్ల వర్షం!
10వ నంబరు ప్లాట్లో రికార్డు ధర
3.6 ఎకరాలకు రూ. 362.70 కోట్లు
రికార్డు స్థాయిలో ఎకరా సగటు ధర రూ.73.23 కోట్లు
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ చరిత్రలోనే ఎకరా భూమి అత్యధిక ధర పలికింది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో కోకాపేట(Kokapet)లో 239, 240 సర్వే నంబర్లలో అభివృద్ధి చేసిన నియో పోలిస్(Neopolis) లేఅవుట్లలో తాజాగా ఎకరం రూ.100.75 కోట్లకు అమ్ముడుపోయింది. లే అవుట్లోని ప్రధాన రోడ్డుకు పక్కనే ఉన్న 10వ నంబరు ప్లాటులో 3.6 ఎకరాలుండగా, ఎకరం రూ.100.75 కోట్ల చొప్పున మొత్తం రూ.362.70 కోట్లు వచ్చాయి. కిందటిసారి వేలంలో కంటే గరిష్ఠ ధర ఎకరాకు రూ.40 కోట్లు ఎక్కువగా పలకడం విశేషం. కోకాపేటలోని నియో పోలిస్లో రెండో విడతగా ఏడు ప్లాట్లలోని 45.33 ఎకరాలకు గురువారం హెచ్ఎండీఏ ఈ-వేలం నిర్వహించింది. షాపూర్జీ పల్లోంజీ, ఏపీఆర్, మై హోం, రాజ్పుష్పా తదితర దిగ్గజ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలే కాకుండా కొన్ని చిన్న సంస్థలు, కంపెనీలు పోటాపోటీగా ఈ-వేలంలో పాల్గొన్నాయి. ఉదయం 6, 7, 8, 9 ప్లాట్లకు, మధ్యాహ్నం 10, 11, 14 ప్లాట్లకు వేలం నిర్వహించారు. ఉదయం గరిష్ఠ ధర ఎకరాకు రూ.75.50 కోట్లు పలకగా, మధ్యాహ్నం సెషన్లో ఏకంగా గరిష్ఠ ధర రూ. 100 కోట్లు దాటేసింది. పదో నంబరు ప్లాటు కోసం ఏపీఆర్ గ్రూపు- రాజ్పుష్పా, హ్యాపీహైట్స్ పోటాపోటీగా వేలంలో పాల్గొన్నాయి. చివరికి హ్యాపీ హైట్స్ నియో పోలిస్, రాజ్పుష్పా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కలిపి అత్యధిక ధర కోట్ చేయడంతో వారికి కేటాయించారు. ఉదయం జరిగిన సెషన్లో ఎకరాకు (8వ ప్లాటు) కనీస ధర రూ.68 కోట్లు కాగా, మధ్యాహ్నం రెండో సెషన్లో కనిష్ఠ ధర ఎకరాకు (11వ ప్లాటు) రూ.67.25 కోట్లు. మొత్తంగా 45.33 ఎకరాలకు రూ.3,319.60 కోట్ల ఆదాయం వచ్చింది. ఎకరాకు సరాసరి రూ.73.23 కోట్లు ధర పలకడం ఆల్ టైం రికార్డుగా భావిస్తున్నారు.
మౌలిక వసతులకే రూ.450 కోట్లు
కోకాపేటలో నియో పోలీస్ పేరుతో హెచ్ఎండీఏ 531.45 ఎకరాల్లో లే అవుట్ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రూ.450 కోట్లతో రహదారులతో పాటు తాగునీరు, మురుగునీటి వ్యవస్థ, భారీ కేబుళ్ల కోసం ప్రత్యేక మార్గం, ఇతర అన్ని రకాల సదుపాయాలు కల్పించారు. మొత్తం ఈ భూమిలో 329.22 ఎకరాలను ఇప్పటికే వివిధ సంస్థలకు కేటాయించారు. మిగతా 202.23 ఎకరాల్లో తొలి విడత వేలంలో కొంత భూమిని విక్రయించగా, రికార్డు స్థాయిలో ధర పలికింది. అత్యధికంగా ఎకరా రూ.60 కోట్లకు అమ్ముడుపోయింది. దీంతో అప్పట్లో రూ.2 వేల కోట్ల వరకు భారీ ఆదాయం సమకూరింది. అదే ఉత్సాహంతో మిగిలిన 45.33 ఎకరాలకు ఈ-వేలం నిర్వహించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఎకరా రూ.35 కోట్లు కనీస అప్సెట్ ధరగా పేర్కొన్నారు. దీని ప్రకారం మొత్తం 45.33 ఎకరాలకు కేవలం అప్సెట్ ధరే 1586.55 కోట్లు. కనీస బిడ్ పెంపు కూడా రికార్డుస్థాయిలో ఎకరాకు రూ.25 లక్షల వంతున నిర్ణయించారు. తాజా వేలంలో అధికారులు అనుకున్న దానికంటే భారీ స్పందన వచ్చింది. గతం కంటే రూ.1,300 కోట్లు అదనంగా సమకూరింది. మొత్తం లేఅవుట్ను బహుళ ప్రయోజనాల జోన్ కింద కేటాయించారు. ప్రత్యేకంగా ల్యాండ్ యూజ్ లాంటివి అవసరం లేదు. కార్యాలయాలు, సంస్థలు, నివాస గృహాలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ల నిర్మాణానికి ఈ స్థలం అనువుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 100 శాతం క్లియర్ టైటిల్ ఉన్న ప్రభుత్వ భూమి కావడంతో మంచి డిమాండ్ వచ్చింది.
తెలంగాణ ప్రగతి, పరపతికి దర్పణం: సీఎం కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ వేలంలో హైదరాబాద్ భూములు ఎకరాకు రూ.100 కోట్లకు పైగా ధర పలకడం తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి అద్దం పడుతోందని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలు పోటీపడి భారీమొత్తంలో ధర చెల్లించి భూములు కొనడాన్ని ఆర్థిక కోణంలోనే కాకుండా ప్రగతి కోణంలోనూ చూడాలని సీఎం పేర్కొన్నారు. భూములకు పెరుగుతున్న క్రేజ్.. హైదరాబాద్ నగరాభివృద్ధిలో వర్తమాన పరిస్థితికి దర్పణం పడుతోందన్నారు. తెలంగాణ వస్తే హైదరాబాద్ ఆగం అవుతుందని, భూముల రేట్లు పడిపోతాయని భయభ్రాంతులకు గురిచేసేలా, నగర ఆత్మగౌరవాన్ని కించపరిచిన వారి చెంప చెళ్లుమనిపించే చర్యగా అభివర్ణించారు. తెలంగాణకు ఎవరెంతగా నష్టం చేయాలని చూసినా, పట్టుదలతో పల్లెలు, పట్టణాలను ప్రగతిపథంలో నడిపిస్తున్నామని, హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా నగరాభివృద్ధికి కృషిచేస్తున్న హెచ్ఎండీఏ అధికారులు, మంత్రి కేటీఆర్, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ను సీఎం అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఐప్యాక్ కార్యాలయానికి జగన్
వైకాపాకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ఐ-ప్యాక్ సంస్థ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి జగన్ గురువారం సందర్శించనున్నారు. -
నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్
ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ గురువారం నుంచి ప్రారంభమవుతుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. -
అసలేం జరుగుతోంది?.. ఏఎన్యూ స్ట్రాంగ్రూం సమీపంలో నిఘా వర్గాల సమావేశం
పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్రూంల భద్రతపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. తిరుపతిలో స్ట్రాంగ్రూంను పరిశీలించేందుకు వెళ్లిన చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా నాయకులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. -
రాజంపేట నుంచి వచ్చి మరీ అరాచకం
ఎన్నికల అనంతరం తాడిపత్రిలో కొనసాగుతున్న వైకాపా ప్రేరేపిత దాడులు, ఘర్షణలను అదుపు చేసేందుకంటూ ఆ పార్టీ అరాచకాలకు కొమ్ముకాసే అధికారి అయిన డీఎస్పీ వీఎన్కే చైతన్యను పంపించటం తీవ్ర వివాదాస్పదమవుతోంది. -
హింస పెచ్చరిల్లుతుంటే మీరేం చేస్తున్నారు?
రాష్ట్రంలో పోలింగ్ రోజు, అనంతరం చోటు చేసుకున్న హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. -
సుప్రీం చెప్పినా.. మేమెందుకు వింటాం!
‘‘ప్రతివాది సమర్పించిన ఫొటోల్లో తేదీలు, సమయం, అక్షాంశాలు, రేఖాంశాలు చూస్తే.. యంత్రాలతో ఇసుక తవ్వకాలను జాతీయ హరిత ట్రైబ్యునల్ నిషేధించినప్పటికీ.. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్నాయనేది ప్రాథమికంగా తెలుస్తోంది. -
తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య దమనకాండ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో డీఎస్పీ వీఎన్కే చైతన్య తెదేపా నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడ్డారు. తెదేపా నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి గృహాన్ని బుధవారం తెల్లవారు జామున ప్రత్యేక బలగాలతో ముట్టడించి వీరంగం సృష్టించారు. -
పోలింగ్లో రికార్డులు బద్దలు
ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా రికార్డు స్థాయిలో 81.86% (పోస్టల్ బ్యాలట్తో కలిపి ) పోలింగ్ నమోదైంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ జరిగిన నాలుగు విడతల పోలింగ్లో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో ఓటింగ్ జరగలేదు. -
జెన్కో థర్మల్ కేంద్రాలకు ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ బొగ్గు
పశ్చిమ బెంగాల్లోని ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఈసీఎల్) నుంచి హైగ్రేడ్ బొగ్గును జెన్కో తీసుకుంటోంది. దీన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుకు ప్రత్యామ్నాయంగా కృష్ణపట్నం థర్మల్ యూనిట్లో వినియోగించనుంది. -
పర్యాటక సేవలు మరింత ఖరీదు!
పర్యాటకుల కోసం కొత్తగా అనేక అదనపు సౌకర్యాలు కల్పించి ఆకట్టుకోవాల్సిన రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. -
రాష్ట్ర పునర్విభజన అంశాలపై నివేదికలు రూపొందించండి
జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఇంకా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. -
అసలైన ప్రజాసేవకుడు కాటన్
నాటి బ్రిటిష్ ప్రభుత్వం సహకరించకపోయినా.. పట్టుబట్టి గోదావరి డెల్టాలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించేందుకు అనువుగా ధవళేశ్వరం ఆనకట్ట, కాలువలు నిర్మించిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ అని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. -
పోలీసు వలయంలో పల్నాడు
రెండురోజులుగా అల్లర్లతో అట్టుడుకుతున్న పల్నాడు జిల్లాలో పోలీసు ఉన్నతాధికారులు శాంతిభద్రతలను అదుపులోకి తెస్తున్నారు. -
ఆ నాలుగు నియోజకవర్గాలకు ప్రత్యేక బలగాలు
పోలింగ్ తర్వాత హింస చెలరేగిన తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
పోలింగ్ తర్వాత.. నిప్పు రాజేస్తోందెవరు?
పోలింగ్ తర్వాత ప్రజ్వరిల్లిన హింసాకాండను నియంత్రించడంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. -
సంక్షిప్త వార్తలు (8)
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ వెబ్ అప్లికేషన్ సామర్థ్యం పెంచడానికి ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) షెడ్యూల్ ప్రకటించిందని ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
117 నియోజకవర్గాల్లో 80% పైనే పోలింగ్
సార్వత్రిక ఎన్నికల్లో 81.86% పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల నాటితో పోలిస్తే పోస్టల్ బ్యాలట్లతో కలిపి 2.09% పెరిగింది. మొత్తం 3.33 కోట్లమంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
తిరుమల ఘాట్రోడ్డులో చిరుత సంచారం
తిరుమల ఘాట్రోడ్డులో చిరుత సంచరించడం కలకలం సృష్టించింది. ఈ నెల 12న భక్తుల బృందం కారులో అలిపిరి నుంచి తిరుమలకు రెండో ఘాట్రోడ్డులో వెళ్తుండగా ఓ చిరుత రోడ్డును దాటడం డ్యాష్బోర్డు కెమెరాలో రికార్డయింది. -
15 లోక్సభ నియోజకవర్గాల్లో 80% పైనే పోలింగ్
రాష్ట్రంలో 15 లోక్సభ నియోజకవర్గాల్లో 80% పైగా పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఒంగోలు లోక్సభ పరిధిలో 87.06% మంది ఓటర్లు కదం తొక్కారు. -
పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం
ఈ ఎన్నికల్లో పట్టణ ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. పట్టణ ప్రాంతాల్లో ఓటు వేయడానికి అంతగా ఆసక్తి చూపరన్న అభిప్రాయాన్ని ఈ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు తప్పని నిరూపించారు. -
జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి..
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డిలతోపాటు నిందితులు దాఖలు చేసిన సుమారు 130 డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణను హైదరాబాద్ సీబీఐ ప్రధాన కోర్టు జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది.
తాజా వార్తలు (Latest News)
-
350 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. 22,310 పైన నిఫ్టీ
-
పోలీస్స్టేషన్లోనే కానిస్టేబుల్ ఆత్మహత్య!
-
తెదేపా నేత కొనకళ్ల నారాయణకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
‘భారత్ చంద్రుడిపై కాలుమోపింది.. మనమేమో..’: పాక్ పార్లమెంట్లో ఆసక్తికర చర్చ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
బాలికలతో బలవంతపు వ్యభిచారం.. అరెస్టయిన వారిలో డీఎస్పీ