ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా.. మైకుల మొరాయింపు
బొప్పూడి ‘ప్రజాగళం’ సభలో సాక్షాత్తు ప్రధాని మోదీ ప్రసంగించే సమయంలోనే నాలుగుసార్లు మైకులు మొరాయించాయి. సౌండ్ సిస్టం ఉన్న ప్రాంతంలో జనాన్ని నియంత్రించడంలో పోలీసుల వైఫల్యం కారణంగా ఈ అంతరాయాలు చోటుచేసుకున్నాయి.
జనాన్ని నిలువరించడంలో పోలీసుల నిర్లక్ష్యం
కావాలనే చేశారంటున్న కూటమి నేతలు
బొప్పూడి ‘ప్రజాగళం’ సభలో సాక్షాత్తు ప్రధాని మోదీ ప్రసంగించే సమయంలోనే నాలుగుసార్లు మైకులు మొరాయించాయి. సౌండ్ సిస్టం ఉన్న ప్రాంతంలో జనాన్ని నియంత్రించడంలో పోలీసుల వైఫల్యం కారణంగా ఈ అంతరాయాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయంలో సభలో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు కూడా పట్టనట్లు వ్యవహరించారు. ప్రధాని చెప్పినా వారి తీరు మారలేదు. మైకులకు సంబంధించి డీ గ్యాలరీ పక్కనే సిస్టమ్ ఏర్పాటు చేశారు. జనం ఒక్కసారిగా ముందుకు నెట్టుకువచ్చి.. మైకుల సిస్టంపై పడిపోవడంతో అవి మొరాయించాయి. ఈ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు స్పందించి వారిని నియంత్రించలేదు. ఈ విషయాన్ని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వేదిక పైనుంచి పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్రెడ్డికి పలుమార్లు చెప్పినా ఫలితం లేకపోయింది. మైకు మొరాయించడంపై ప్రధాని సైతం అసంతృప్తికి గురయ్యారు. అంతకుముందు పవన్ కల్యాణ్, చంద్రబాబు ప్రసంగం సమయంలోనూ మైకులు కొంత సమయం పనిచేయలేదు. మైక్ సిస్టమ్కు రక్షణ కల్పించలేకపోవడం పూర్తిగా పోలీసుల వైఫల్యమేనని కూటమి నేతలు మండిపడుతున్నారు. ఓ పోలీసు ఉన్నతాధికారి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మైకుల సిస్టం ఉన్న ప్రాంతంలో సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని కూటమి నేతలు ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాయ్ రాజా కాయ్.. గెలిచేది కూటమేనోయ్!
రాష్ట్రంలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి? అధికారంలోకి వచ్చేదెవరు? ఉత్కంఠ రేకెత్తిస్తోన్న ఎన్నికల ఫలితాలపై భీమవరం బెట్టింగ్ బాబులు కూటమికే మొగ్గు చూపుతున్నారు. అధిక శాతం సీట్లలో తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతున్నారంటూ భారీగా పందేలు కాస్తున్నారు. -
ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం అందుకున్న దాఖలాల్లేవు: సూర్యనారాయణ
ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ, పీఆర్సీ బకాయిలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని.. ఈ ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం, పెన్షన్ అందని పరిస్థితులు నెలకొన్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. -
నేడు 13 జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రాబోయే అయిదు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
అతివలు మెచ్చేలా.. అందరూ వచ్చేలా: మహిళా మోడల్ పోలింగ్ బూత్ ఏర్పాటు
పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ మోడల్ పోలింగ్ కేంద్రాలను సుందరంగా తయారు చేస్తోంది. ఇందులో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని లయోల కళాశాలలో 56వ పోలింగ్ కేంద్రాన్ని మహిళా (పింక్) పోలింగ్ కేంద్రంగా తయారు చేశారు. -
జగన్ సభలకేనా బస్సులు.. ఓటేసే వారికి ఉండవా!
జగన్ సిద్ధం సభలకు వేల సంఖ్యలో బస్సులు సమకూర్చి స్వామిభక్తి చాటుకున్న ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు.. ఓటేసేందుకు సొంతూళ్లకు వచ్చే సామాన్య ప్రజలకు అవసరమైనన్ని బస్సులు ఏర్పాటు చేయకుండా వాళ్లచావు వాళ్లు చావని అనేలా వదిలేశారు. -
ఐదేళ్ల పాలన.. 50 ఏళ్ల విధ్వంసం
విభజనకు గురైన రాష్ట్రం అడుగులు ముందుకేస్తోంది... ఆంధ్రుల దశాదిశా మార్చే రాజధాని నిర్మాణానికి రంగం సిద్ధమై ఉంది... విశాఖ, అనంతపురం వంటివి పారిశ్రామికాభివృద్ధిలో పెద్ద అంగలు వేస్తున్నాయి... ఈ దశలో ఒక్క ఛాన్స్ అంటూ జగన్ వచ్చారు... రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పురోగమింపజేసే అద్భుత అవకాశం... కానీ జగన్ విధ్వంసం... విద్వేషం... వంచనలతో భ్రష్ట పాలనకు తెరతీశారు. -
దారుణాలు ఆయనవే.. దండనా ఆయనదే..
జగన్ అయిదేళ్ల పాలన వెనుదిరిగి చూస్తే ఏమున్నది గర్వకారణం? ఆయన పాలన మొత్తం ప్రజాపీడన పరాయణత్వం.. సామాన్య పౌరుడికీ స్వేచ్ఛ లేదు. సామాజిక మాధ్యమాల్లో స్పందించే వాక్ స్వాతంత్య్రం లేదు. ఆఖరికి మాజీ ముఖ్యమంత్రికీ, ఒక పార్టీ అధినేతగా ఉన్న లక్షల మంది ఆరాధ్య నటుడికీ జనాలను కలవనివ్వని వైకాపా పోలీసు గ్యాంగ్. -
పదే పదే పునాది రాళ్లు!
శంకుస్థాపనలే.. అభివృద్ధి లేదు.. ధ్వంస రచనే.. బడ్జెట్ కేటాయింపుల్లేవు.. ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించే సత్తా లేదు.. అభివృద్ధిపై సమగ్ర ప్రణాళిక లేదు.. పనులు గతప్రభుత్వ హయాంలో మొదలయ్యాయా..? వాటి ఆనవాళ్లు లేకుండా చేయడమే..! మచిలీపట్నం... రామాయపట్నం... -
పెత్తందారు ఎవరు జగన్?
‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’... అంటే దొంగే తనను పట్టుకున్న పోలీసును దొంగ అని అరిచాడని అర్థం..! ఐదేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ చేస్తోంది అదే..! అణువణువునా పెత్తందారీ, భూస్వామ్య, ఫ్యాక్షన్ లక్షణాలతో చెలరేగిపోతూ, పైగా ఇతరులపై పెత్తందారులని ముద్రవేస్తూ గొంతు చించుకోవడం ఆయనకే చెల్లింది..! ప్రజల్ని అమాయకుల్ని చేసి... -
గుంతలు ప్రకృతి పుణ్యమట!
వర్షాల కారణంగా రోడ్లు పాడైతే ఏ ప్రభుత్వమైనా ఏం చేయాలి? మళ్లీ మరమ్మతులు చేసి బాగుచేయించాలి.. అలాకాకుండా ‘మేం రోడ్లు వేశాం.. కానీ వర్షాల వల్ల పాడయ్యాయి’ అని చేతులు దులుపుకొని.. నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తే? అలాంటి ప్రభుత్వాలను ఏమనాలి? ‘చేతగాని ప్రభుత్వాలు’ అనే కదా...! -
ఓటు పాశుపతాస్త్రం.. సక్రమంగా వినియోగించుకుందాం
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. మన దేశం, మన రాష్ట్రం, మన సమాజం, వ్యక్తిగత జీవితాలు బాగుపడాలన్నా, భవిష్యత్తు ఉజ్వలంగా మారాలన్నా మనం వేసే ఓటే కీలకం. ప్రస్తుతం మన రాష్ట్ర భవితను నిర్దేశించే అత్యంత కీలక ఎన్నికలు జరుగుతున్నవి. -
పెద్దల మాట
-
కొత్త ప్రభుత్వం వచ్చాకే రిజిస్ట్రేషన్లలో కదలిక!
జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-స్టాంపింగ్ పేపర్ల (జిరాక్స్ పత్రాల మాదిరి)పై రిజిస్ట్రేషన్ ప్రక్రియ పట్ల సర్వత్రా విముఖత వ్యక్తమవుతోంది. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో అధికార మార్పిడికి అవకాశాలున్నాయన్న కారణాలతోనూ రాష్ట్రంలో ఆస్తుల క్రయవిక్రయాలు తగ్గాయి. నాన్జ్యుడీషియల్ స్టాంపు పేపర్లపై ఏళ్ల తరబడి సాగుతున్న రిజిస్ట్రేషన్ వ్యవస్థను వైకాపా ప్రభుత్వం అస్తవ్యస్తం చేసింది. -
రైతులంటే లెక్కలేనితనం..
ఒక్క ఏడాదే 47.77 లక్షల ఎకరాల్లో (2023-24 ఖరీఫ్, రబీ) పంటలు వేయలేదంటే అది తీవ్ర కరవు కాదా? వర్షాలు అనుకూలిస్తే రైతులు విత్తనం వేయకుండా ఉంటారా? వానల్లేక, సాగునీరందక 23లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా, అధికశాతం ఎండిపోయినా.. అది కరవు కాదట.. ఆయనకెక్కడా కరవే కన్పించలేదట. -
‘వన్టైం’ పదోన్నతుల పేరుతో వైద్య బోధకులకు ఎర
కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు వైద్య బోధకుల నియామకాల విషయంలో వైకాపా ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోంది. కళాశాలల ఏర్పాటుకు తగ్గట్టుగా నియామకాలను ముందుగా చేపట్టకుండా.. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తనిఖీలకు వచ్చే సమయంలో హడావుడి చేస్తోంది. -
తీరంలో గంజాయి కంపు
ఐటీ కంపెనీలు రావాల్సిన చోట.. మత్తులో బ్లేడ్బ్యాచ్లు వీరంగం వేస్తున్నాయి. ఇప్పటి వరకూ ఎన్నడూ చూడని ఘటనలు... ఊహకు అందని దారుణాలు స్థానికుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. -
సీఎం జగన్.. నలుగురు సామంతులు
ఒక రాజు.. నలుగురు సామంతులు.. ఇదీ ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో సాగిన పాలన తీరు. సీఎం హోదాలో జగన్.. ఆయనకు సామంతులుగా నలుగురు వ్యవహరించారు. ఈ ఐదేళ్ల జగన్ పాలనలో చీకటి కోణాలకు ప్రతినిధులుగా ఈ నలుగురూ నిలిచారు. -
అత్యవసర సిబ్బందికీ వేతనాలివ్వరా?
జగన్ ప్రభుత్వం అత్యవసర వైద్య సేవల సిబ్బందికీ చుక్కలు చూపిస్తోంది. -
పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయి?
పంచాయతీలకు కేంద్రం మంజూరు చేసిన 15వ ఆర్థిక సంఘ నిధులు రూ.998.84 కోట్లు ఏమయ్యాయని అఖిల భారత పంచాయతీ పరిషత్తు జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ప్రశ్నించారు. -
ఓటుకు బయలెల్లిన నగరం
ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్కు శనివారం భారీగా ప్రజలు సొంతూరి బాట పట్టారు. -
దళిత యువకుడిపై సినీ రచయిత కోన వెంకట్ దాడి
ఎన్నికల ముందు వైకాపాను వీడి తెదేపాలో చేరారనే కక్షతో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం గణపవరానికి చెందిన దళిత యువకుడు కత్తి రాజేష్పై వైకాపా బాపట్ల అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్యే కోన రఘుపతి బంధువు, కర్లపాలెం మండలం వైకాపా ఇన్ఛార్జి, సినీ రచయిత కోన వెంకట్ తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
29వసారి ఎవరెస్టు అధిరోహణ.. చరిత్ర సృష్టించిన నేపాల్ షెర్పా
-
విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది.. 2 రోజుల్లో పూర్తిస్థాయి సర్వీసులు
-
ఒక్క ఓటేనన్న ఉదాసీనత వద్దు.. మీ ఓటే చరిత్రను మార్చేయొచ్చు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
అభిమానులారా.. మ్యాచ్ ముగిశాక వెళ్లొద్దు.. మీకో స్పెషల్ ఉంది: వైరల్గా చెన్నై పోస్టు
-
హైదరాబాద్కు భారీ వర్ష సూచన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జీహెచ్ఎంసీ