జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం.
వైకాపాకు వంత పాడేలా మరో వికృత క్రీడ
బ్యాంకుల్లో పింఛను నగదు జమ చేసేలా నిర్ణయం
32 మంది వృద్ధుల ఉసురు పోసుకున్నా.. అదే తీరు
మళ్లీ ఇబ్బందులకు గురిచేసి ఆ నెపాన్ని విపక్షాలపై వేసే కుట్ర
సీఎస్ను నడిపిస్తున్నది జగన్, ధనుంజయరెడ్డిలే
సరిపడా సిబ్బంది ఉన్నా ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి మోకాలడ్డు
ఈనాడు - అమరావతి
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. ఇది పింఛను పంపిణీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి ఆడుతున్న ‘జగనా’్నటకం. ఇంటింటికీ వెళ్లి పింఛను పంపిణీ చేయకుండా ఉండేందుకు ఎన్ని రకాలు కుట్రలు, కుతంత్రాలు పన్నాలో అన్నింటినీ ఆయన అమలు చేస్తున్నారు. ఏప్రిల్ 1న లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను పంపిణీ చేయకుండా మండే ఎండల్లో గ్రామ, వార్డు సచివాలయాలకు రప్పించడంతో 32 మంది వృద్ధులు మరణించారు. అయినా మే 1న పింఛను పంపిణీకి మరింత దారుణమైన ఆదేశాలు జారీచేశారు. పింఛనుదారుల బ్యాంకుఖాతాల్లో నగదు జమచేస్తామంటూ వారి ఇళ్లకు ఎక్కడో దూరంలో ఉండే బ్యాంకుల చుట్టూ తిప్పే కుట్ర పన్నారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటి ఠారెత్తిస్తున్న పరిస్థితుల్లో ఇది వృద్ధుల ప్రాణాలకు ఎంత ప్రమాదకరమో తెలియదా అని సీఎస్ను ప్రజలు నిలదీస్తున్నారు. అయినా వారిని ఇళ్ల నుంచి బయటకు రప్పించేలా నిర్ణయం తీసుకోవడమేంటని అడుగుతున్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల దగ్గరకు వెళ్లలేము మహాప్రభో.. ఇంటి దగ్గరే ఇవ్వాలని పింఛనుదారులు వేడుకుంటుంటే.. గతనెల కంటే మరిన్ని ఇక్కట్లకు గురిచేసే నిర్ణయాన్ని తీసుకుని వైకాపా సేవలో తరించేందుకే ఆయన మొగ్గుచూపారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడేశారు. ఈ కుతంత్రం అమలుకు తెరముందు జవహర్రెడ్డి కనిపిస్తున్నా.. వెనుక నుంచి నడిపిస్తున్నదంతా సీఎం జగన్, ధనుంజయరెడ్డిలే. పింఛనుదారులకు ఇబ్బంది లేకుండా నగదు పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. తగినంత మంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నా.. ఇంటింటికీ పంపిణీ చేయడానికి ఉన్న ఇబ్బందేమిటి? నేరుగా బ్యాంకుఖాతాల్లో జమచేయడానికి ఇతర పథకాలు వేరు, పింఛన్ల పంపిణీ వేరు. గత ఐదేళ్లుగా పింఛనుదారుల ఇళ్లవద్దనే నగదు అందిస్తూ వారికి అలవాటు చేశారు. రాజకీయంగా అత్యంత సున్నితమైన ఈ విధానంలో ఏ మాత్రం మార్పులు చేసినా... పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. ఆ విషయం సీఎస్కు తెలిసినా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే అది వైకాపాకు వంతపాడటమే అవుతుంది. పింఛనుదారులను ఇబ్బందులకు గురిచేసి ఆ నెపాన్ని తెదేపాపై వేసే కుట్ర పన్నుతున్నట్లు కనిపిస్తోంది.
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పింఛనుదారుల ఇళ్ల వద్దకే పింఛను అందించవచ్చని కలెక్టర్లందరూ ముక్తకంఠంతో చెప్పారు. అయినా అలా పంపిణీ చేయడానికి మాత్రం మనసు రావట్లేదు. మీరు ప్రజాప్రయోజనాలే ధ్యేయంగా పనిచేయాల్సిన ఐఏఎస్ అధికారి కదా... మరి ఎందుకు రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని సీఎస్ జవహర్ రెడ్డిని పింఛనుదారులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో 1.35 లక్షల మంది సచివాలయ సిబ్బంది ద్వారా రెండు, మూడు రోజుల్లోనే మొత్తం లబ్ధిదారులందరికీ ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేసే వీలున్నా... ఇలాంటి వికృత నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8,047 బ్యాంకులున్నాయి. వాటిలో సిబ్బంది అంతా పింఛను పంపిణీ కోసమే ఉండరు. చాలామంది పింఛనుదారుల వద్ద ఏటీఎం కార్డులు ఉండవు. బ్యాంకు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేకుండా మైనస్లోకి వెళ్లినవి కూడా ఎక్కువగానే ఉంటాయి. పింఛను డబ్బు ఖాతాల్లో పడగానే ఎప్పటినుంచో ఉన్న పెండింగ్ ఛార్జీలన్నీ వాటిలోంచే కోత వేస్తారు. పైగా పింఛనుదారులు బ్యాంకుకు వెళ్లినరోజే నగదు ఇవ్వకుండా గంటలతరబడి వేచి ఉన్న తర్వాత... మర్నాడో, ఆ మర్నాడో రమ్మని తిప్పుతారు. 2019లో తెదేపా ప్రభుత్వం పసుపు-కుంకుమ కింద బ్యాంకుల్లో నగదు జమ చేసినప్పుడు క్యూలైన్లలో మహిళలు నిల్చుని ఎన్ని ఇబ్బందులు పడ్డారో లబ్ధిదారులందరికీ గుర్తుండే ఉంటుంది.
వృద్ధులను అటూ ఇటూ తిప్పడమే
మొత్తం 65.95 లక్షల మంది పింఛనుదారుల్లో 34 లక్షల మంది వృద్ధులే. ఒంటరిగా బ్యాంకులకు వెళ్లలేనివారు లక్షల్లోనే ఉంటారు. ఇలాంటి వృద్ధులందరూ మరొకరిని వెంట తీసుకుని బ్యాంకులకు వెళ్లాలి. ఒక్కొక్కరు రూ.200-400 రవాణా ఖర్చు భరించాలి. తిండి ఖర్చు అదనం. అక్కడికి వెళ్లిన తర్వాత విత్డ్రా ఫాం రాయడమూ ఒక ఇబ్బందే. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకింగ్ సేవాకేంద్రాల నుంచి నగదు తీసుకోడానికి వేలిముద్రలు వేయాలి. చాలామంది వృద్ధులకు వేలిముద్రలు పడవు. అప్పుడు అక్కడినుంచి మండల కేంద్రానికో... బ్యాంకు ఉన్న ఇంకోచోటుకో వెళ్లాలి. ఒకరకంగా చూస్తే ఇదంతా వారిలో ఆందోళన నింపే ప్రయత్నమే అవుతుంది.
గత నెల కంటే మరింత నరకయాతన
బ్యాంకుల్లో నగదు జమచేస్తే ఆధార్ కార్డు లింక్ అయిన బ్యాంకుకే నగదు వెళుతుంది. కొందరికి రెండు, మూడు బ్యాంకుల్లో ఖాతాలున్నాయి. ఏ ఖాతాకు ఆధార్ లింక్ అయిందో చాలామందికి తెలియదు. ఎందులో డబ్బు జమవుతుందో అర్థం కాదు. కొందరు ఆధార్తో లింక్ అయి ఉన్న ఖాతాల నుంచి లావాదేవీలు జరపరు. దీనివల్ల ఆ ఖాతాలు మనుగడలో ఉండవు. ఏ బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయిందనే వివరాలు సచివాలయాలకు పంపుతామని చెప్పారు. అంటే మళ్లీ దీనికోసం వారు గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లాల్సిందే. అది తెలుసుకున్న తర్వాత బ్యాంకులకు వెళ్లాలి. ఇప్పటికే ఏప్రిల్ 1న గ్రామ, వార్డు సచివాలయాలకు రప్పించి నానాకష్టాలకు గురిచేశారు. ఇప్పుడు సచివాలయానికి, ఆ తర్వాత బ్యాంకుకు వెళ్లేలా దారుణమైన నిర్ణయం తీసుకుని, పింఛనుదారులను మరింత నరకయాతన పెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
సచివాలయ ఉద్యోగులకు 2-3 రోజులే
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ సిబ్బందికి అత్యవసర పనులేమీ లేవు. ఉన్న ఏకైక పని లబ్ధిదారులకు పింఛన్లు అందించడమే. అందుబాటులో కావలసినంత మానవ వనరులున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందే 1.35 లక్షల మంది ఉన్నారు. ఈ లెక్కన ఒక్కో సచివాలయ ఉద్యోగి పంచాల్సిన పింఛన్లు 49 మాత్రమే. ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి పట్టే సమయం మహా అయితే 2-3 రోజులు. ఇంత సాధారణమైన లెక్కను ఐదో తరగతి పిల్లలు కూడా చేసేస్తారు. ఇలాంటి మామూలు విషయం అత్యంత సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన జవహర్రెడ్డికి తెలియకుండా ఉండదని, తెలిసినా ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నారని లబ్ధిదారులు మండిపడుతున్నారు.
వైకాపా శ్రేణుల అఘాయిత్యాలకు ఊతమివ్వడమే
అత్యంత బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న సీఎస్ ఒక రాజకీయ పార్టీకి కొమ్ముకాసేలా ఎలా వ్యవహరిస్తారని పలువురు నిలదీస్తున్నారు. ఏప్రిల్లో పింఛన్ల పంపిణీ సందర్భంగా, వృద్ధుల్ని మండుటెండలో ఊరేగించిన వైకాపా నాయకుల్లో ఒక్కరిపైనా ఆయన చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు బ్యాంకుల వద్ద పింఛనుదారుల్ని పడిగాపులు కాసేలా నిర్ణయం తీసుకోవడం వారికి మరింత ఊతమివ్వడమే అవుతుంది. పోలింగ్ తేదీ అత్యంత సమీపంలో ఉండగా... వారు చెలరేగిపోతే దానికి బాధ్యులెవరన్న ప్రశ్నలు వస్తున్నాయి.
సర్వాధికారాలు సీఎస్ వద్దే కదా..
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే సర్వాధికారి. ఎన్నికల కమిషన్ కూడా వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయొద్దని చెప్పిందే తప్ప, ఇంటింటికీ పంపిణీ చేయొద్దని చెప్పలేదు. బ్యాంకుల్లో నగదు జమచేస్తే ఎదురయ్యే ఇబ్బందులేంటనేది ప్రభుత్వాధిపతిగా ఆయన సులభంగా గుర్తించగలరు. ఇన్నాళ్లూ ఆయనకంటే జూనియర్ అయిన ధనుంజయరెడ్డి చెప్పిందే వేదంగా పాటిస్తూ వచ్చారు. కొన్ని లక్షల మంది అభాగ్యుల ప్రయోజనాలు ముడిపడి ఉన్న పింఛన్ల పంపిణీ వ్యవహారంలోనైనా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఏ ప్రయోజనాలు... ఆయనను వెనక్కు లాగుతున్నాయోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముందుగానే ‘నైరుతి’ జల్లు
ఉక్కపోత, వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఈసారి కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
వేధించారు.. ఓటూ తీసేశారు!.. ఏబీ వెంకటేశ్వరరావుపై వైకాపా ప్రభుత్వ కసి
డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఐదేళ్లుగా కక్ష సాధించిన వైకాపా ప్రభుత్వం.. చివరికి ఆయన, ఆయన సతీమణి ఓటు హక్కు లేకుండా చేసింది. -
ఓట్ల పండుగకు 42 బస్సుల్లో వచ్చిన యువత
మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్న దృఢ సంకల్పంతో ఐటీ ఉద్యోగులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గానికి చెందిన యువత పెద్ద సంఖ్యలో హైదరాబాద్లో ఉద్యోగాల నిమిత్తం ఉంటోంది. -
ఓటెత్తిన ‘ప్రజా’స్వామ్యం
రాష్ట్ర ప్రజలు ఓటెత్తారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటిచెప్పారు. గంటలకొద్దీ క్యూలైన్లలో నిలబడి మరీ వజ్రాయుధం లాంటి ఓటుహక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, మహిళలు, యువత.. ఇలా అన్ని వర్గాలవారు చాలా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. -
ఎన్నికల వేళ వైకాపా విధ్వంసకాండ
ఏజెంట్లను భయపెట్టారు.. కూర్చుంటే తలకాయలే ఉండవని హూంకరించారు.. సాయంత్రం తిరిగి ఇళ్లకూ వెళ్లరని హెచ్చరించారు.. రేపటి నుంచి ఊళ్లలో తిరగలేరని బెదిరించారు. పోలీసులు ఉన్నా బెదరకుండా కిరాతకంగా వ్యవహరించారు. -
ప్రజా చైతన్యంపై పిడిగుద్దులు
ఎమ్మెల్యే అయినా, ఇంకెవరైనా కూడా పోలింగ్ కేంద్రంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందే. అంతే తప్ప, ఇష్టారాజ్యంగా లోపలకు వెళ్తామంటే కుదరదు. అలా పౌరస్పృహతో.. నిబంధనలు పాటించాలని తెనాలి వైకాపా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను అడగడమే ఆ ఓటరు తప్పయిపోయింది. -
మాచర్లలో రక్తం పారాల్సిందే..!
ఆటవిక పాలనను మించిన అరాచకాలకు మాచర్ల నియోజకవర్గ ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధమైన వేళ.. అరాచకశక్తులు మరింతగా పేట్రేగిపోయాయి. ఐదేళ్లుగా నమ్ముకున్న దాడులు, బెదిరింపులు, హెచ్చరికలు, హింసనే ఎన్నికల రోజున ఆఖరి అస్త్రంగా ప్రయోగించారు. -
ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదు
రాష్ట్రంలో చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉండబోదన్నారు. -
పోలింగ్ కేంద్రం వద్ద అంగన్వాడీల ఆట సాయం
చిత్తూరు నగరంలోని బాలాజీ నగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఓటు వేసేందుకు అనేక మంది మహిళలు తమ చిన్నారులతో పోలింగ్ కేంద్రాలకు సోమవారం చేరుకున్నారు. -
ఓటేశాం.. వెళ్లొస్తాం!.. తెలంగాణ బాటపట్టిన ప్రజలు
సొంత ఊరిలో ఓట్లేసిన ప్రజలు సాయంత్రానికి తిరిగి తెలంగాణ బాటపట్టారు. కార్లు, బస్సులు.. ఏ వాహనం దొరికితే అది పట్టుకొని హైదరాబాద్కు బయల్దేరారు. హైదరాబాద్ వైపు వచ్చే రహదారుల్లో సోమవారం సాయంత్రం 5 గంటల దాటాక ఒక్కసారిగా రద్దీ పెరిగింది. -
భర్త మరణించినా.. ఓటు విలువ చాటిన భార్య
ఓ వైపు భర్త మృతిచెందినా.. తనలోని బాధను దిగమింగుకుని ఓటుపై అవగాహన కలిగిన చిరుద్యోగిగా ఓ మహిళ తన ప్రాథమిక హక్కు వినియోగించుకున్నారు. -
జనచైతన్య సంస్థల డైరెక్టర్ శకుంతల కన్నుమూత
జనచైతన్య గ్రూప్ సంస్థల వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ మాదల శకుంతల(86) గుంటూరు రాజేంద్రనగర్లోని స్వగృహంలో సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. -
సంకల్పం ముందు వైకల్యం ఎంత!
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని బీవీనగర్ ప్రాంతానికి చెందిన సురేశ్.. తన 12 ఏళ్ల వయసులో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయారు. -
నది దాటారు.. ఓటేశారు..
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని చోళపదం పంచాయతీకి చెందిన రెబ్బ, వనదార గిరిజన గ్రామాల ప్రజలు నదిలో నుంచి కాలినడకన వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
పుట్టెడు దుఃఖంలోనూ ఓటేసిన వృద్ధురాలు
ఓటు విలువ తెలియక కొందరు ఇళ్లకే పరిమితమవుతుంటే.. పుట్టెడు దుఃఖాన్ని భరించి 80 ఏళ్ల వృద్ధురాలు తన కర్తవ్యాన్ని చాటారు. -
రెండు రౌండ్ల కాల్పులు.. ముగ్గురికి గాయాలు
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ భూమిలోకి రెండురౌండ్లు కాల్పులు జరపడంతో.. ఆ ధాటికి రాళ్లు ఎగిరి తగలడంతో ముగ్గురు గాయపడ్డారు. -
సీబీఎస్ఈ ఫలితాల విడుదల
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12 తరగతుల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. అబ్బాయిలపై అమ్మాయిలు పైచేయి సాధించారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాల రద్దు.. భర్త కడసారి చూపునకు దూరమై!
-
పిల్లల జీవితాన్ని ఎవరు రిస్క్లో పెట్టమన్నారు: రష్మి
-
దిల్లీ మద్యం కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
వైట్హౌస్లో ‘సారే జహాసె అచ్ఛా..’ ‘పానీపూరీ’ల విందు
-
పాక్ ప్రభుత్వ కంపెనీలన్నీంటిని ప్రైవేటీకరిస్తాం: ప్రధాని షెహబాజ్
-
దిల్లీ vs లఖ్నవూ.. ప్లేఆఫ్స్పై నేటి మ్యాచ్ ఫలితం ప్రభావమెంత?