Holidays: నవంబరులో 15 రోజులు బ్యాంకులకు సెలవు!
నవంబరులో బ్యాంకులకు వర్తించే సెలవుల (Holidays) జాబితాను ఆర్బీఐ (RBI) విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: నవంబరు నెలలో ఉన్న సెలవుల (Holidays) జాబితాను రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసింది. నవంబర్లో రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలు, ఇతర పండుగలు కలిపి మొత్తం 15 రోజులు సెలవులు ఉన్నట్లు ఆర్బీఐ క్యాలెండర్ పేర్కొంది. సెలవుల జాబితాను ఆర్బీఐ ప్రతి నెలా రూపొందిస్తుంది. నెగొషబుల్ ఇన్స్ట్రూమెంట్స్ యాక్ట్, హాలిడే, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలిడే అండ్ బ్యాంక్స్ క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ అనే మూడు కేటగిరీలను దృష్టిలో ఉంచుకొని ఆ జాబితాను తయారు చేస్తుంది. ఈ క్యాలెండర్ ప్రకారం కొన్ని సెలవులు ఆయా ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని, బ్యాంకును బట్టి మారుతుంటాయి. బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు. బ్యాంకులకు వర్తించే సెలవుల జాబితా ఇదే..
రిలయన్స్ ఎస్బీఐ భాగస్వామ్యంలో క్రెడిట్ కార్డ్.. ప్రయోజనాలు ఇవే!
- నవంబరు 1వ తేదీన కర్ణాటక (కన్నడ రాజ్యోత్సవ), మణిపుర్ (కత్), హిమాచల్ప్రదేశ్ (కర్వా చౌత్) నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో సెలవు ఉంది.
- నవంబరు 10వ తేదీన అగర్తల, దెహ్రాదూన్, గ్యాంగ్టక్, ఇంఫాల్, కాన్పూర్, లఖ్నవూ పట్టణాల్లో వంగల ఫెస్టివల్ నేపథ్యంలో సెలవు.
- నవంబరు 11 నుంచి 14 వరకు వారాంతం, దీపావళి నేపథ్యంలో దేశంలోని చాలా రాష్ట్రాల్లో సెలవులు వచ్చాయి.
- నవంబరు 15న గ్యాంగ్టక్, ఇంఫాల్, కాన్పూర్, కోల్కతా, లఖ్నవూ సహా హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక పండుగల నేపథ్యంలో బ్యాంకులకు సెలవు.
- నవంబరు 20న బిహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఛత్ పండుగను నిర్వహిస్తారు.
- నవంబరు 23న ఉత్తరాఖండ్, మణిపుర్ రాష్ట్రాల్లో స్థానిక పండుగలు ఉన్నాయి.
- నవంబరు 25-27 వరకు వారాంతం, కార్తిక పూర్ణిమ, గురునానక్ జయంతి.
- నవంబరు 30న కనకదాసు జయంతి సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులు పనిచేయవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా మరింత భారం
పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులను తట్టుకునేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. -
కేకేఆర్ చేతికి హెల్తియమ్ మెడ్టెక్
సర్జికల్ సూదుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు సంస్థ హెల్తియమ్ మెడ్టెక్లో మెజార్టీ వాటాను, అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ రూ.7,000 కోట్ల (840 మిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేయనుందని తెలిసింది. -
సైబర్ దాడులు.. మనపై ఎక్కువే
అమెరికా, బ్రిటన్ తర్వాత అంతర్జాతీయంగా ‘ఫిషింగ్’ దాడులను అత్యధికంగా ఎదుర్కొంటున్నది మన దేశమే. భారత దేశంపై జరిగిన సైబర్ దాడుల్లో 33% టెక్నాలజీ రంగంపైనే కనిపించాయని స్కేలర్ అనే సైబర్ భద్రతా సంస్థ తన నివేదికలో పేర్కొంది. -
ప్రయాణ - పర్యాటకంలో 5.82 కోట్ల ఉద్యోగాలు!
దేశీయంగా పర్యాటకానికి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆ రంగంతో పాటు ప్రయాణ రంగంలోనూ ఉపాధికి భారీ అవకాశాలు కలగనున్నాయి. -
ఎయిరిండియా క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితి తగ్గింపు
దేశీయ మార్గాల్లో క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితిని ఈనెల 2 నుంచి తగ్గించినట్లు ఎయిరిండియా తెలిపింది. తక్కువ ధర ఉండే ఎకానమీ తరగతి ప్రయాణికులు ఇకపై 15 కిలోలే ఉచితంగా క్యాబిన్ లగేజీగా తీసుకెళ్లొచ్చని వెల్లడించింది. -
కోటక్ బ్యాంక్ లాభం రూ.5,302 కోట్లు
ప్రైవేటు రంగ కోటక్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.5,302 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది 25% అధికం. -
రెండేళ్లలో మళ్లీ చిన్న కార్ల హవా
దేశీయ విపణిలో చిన్న కార్ల విభాగం 2026 చివరికల్లా లేదా 2027 నాటికి పుంజుకునే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా అంచనా వేస్తోంది. -
రూ.15,000 కోట్ల రుణాల కోసం వొడాఫోన్ ఐడియా యత్నాలు!
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో పాటు ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచీ రూ.15,000 కోట్ల (1.8 బిలియన్ డాలర్ల) రుణాలు తీసుకునేందుకు వొడాఫోన్ ఐడియా చర్చలు సాగిస్తోందని సమాచారం. -
మన ఎగుమతులకు అంతర్జాతీయ అనిశ్చితులే బెంగ
అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సంఘం ఫియో అంచనా వేస్తోంది. -
పేటీఎం సీఓఓ భవీశ్ గుప్తా రాజీనామా
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి (సీఓఓ) భవీశ్ గుప్తా రాజీనామా చేశారు. పేటీఎంలో రుణ వ్యాపారం, ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపులు, కాంప్లియెన్సెస్ తదితర విభాగాలను భవీశ్ నడిపించేవారు. -
సంక్షిప్త వార్తలు
డీమార్ట్ సూపర్మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్, మార్చి త్రైమాసికంలో రూ.563 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.460 కోట్లతో పోలిస్తే, ఇది 22.39% అధికం. -
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
layoffs: ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20 వేల మందిని సాగనంపాయి.
తాజా వార్తలు (Latest News)
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?