Air India: ఎయిరిండియా ఉద్యోగులకు వేతన పెంపు.. వారికి ₹1.8 లక్షల వరకు బోనస్
Air India: ఎయిరిండియా సంస్థ వేతన పెంపు చేపట్టింది. ప్రభుత్వం నుంచి దక్కించుకున్నాక తొలి వేతన పెంపు ఇదే.
Air India | దిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) తమ ఉద్యోగులకు వేతన పెంపు ప్రకటించింది. పైలట్ల పనితీరు ఆధారంగా బోనస్ కూడా చెల్లించనుంది. ప్రభుత్వం నుంచి టాటాల చేతికొచ్చాక టాటా గ్రూప్ చేపట్టిన తొలి వేతన పెంపు ఇదే. ఈమేరకు వేతన పెంపు వివరాలను ఎయిరిండియా సీహెచ్ఆర్ఓ రవీంద్రకుమార్ జీపీ వెల్లడించారు. 2024 ఏప్రిల్ నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి వస్తాయని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ, వ్యక్తుల పనితీరు ఆధారంగా ఈ బోనస్ చెల్లిస్తున్నట్లు చెప్పారు.
2023 డిసెంబర్ 31 కంటే ముందు సంస్థలో చేరినవారికి ఈ పెంపు వర్తిస్తుంది. దీని ప్రకారం.. ఫస్ట్ ఆఫీసర్, కెప్టెన్ల వేతనం నెలకు రూ.5 వేలు మేర పెరగనుంది. కమాండర్ల వేతనం రూ.11 వేలు, సీనియర్ కమాండర్ వేతనం రూ.15 వేలు చొప్పున పెరగనుంది. జూనియర్ ఫస్ట్ ఆఫీసర్కు ఎలాంటి పెంపూ చేపట్టలేదు. అలాగే పనితీరు ఆధారంగా ఏడాదికి గరిష్ఠంగా బోనస్ కింద రూ.1.8 లక్షల వరకు చెల్లించనుంది. జూనియర్ ఫస్ట్ ఆఫీసర్కు రూ.42 వేలు, ఫస్ట్ ఆఫీసర్కు రూ.50వేలు, కెప్టెన్లకు రూ.60 వేలు, కమాండర్లకు రూ.1.32 లక్షలు, సీనియర్ కమాండర్లు రూ.1.80 లక్షల వరకు గరిష్ఠంగా బోనస్ అందుకుంటారు.
ఇండిగో విమానాల్లో ఇక బిజినెస్ క్లాస్
ఎయిరిండియాలో ప్రస్తుతం 18 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఎయిరిండియా గ్రూప్లో ప్రస్తుతం నాలుగు విమానయాన సంస్థలు ఉన్నాయి. ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో ఏఐఎక్స్ కనెక్ట్ (ఎయిర్ఏషియా ఇండియా); ఎయిరిండియాలో విస్తారా విలీనం కానున్నాయి. 2022 జనవరిలో ప్రభుత్వం నుంచి ఎయిరిండియాను దక్కించుకున్న టాటా గ్రూప్.. కాంట్రాక్ట్ల పునరుద్ధరణ, పరిహారం చెల్లింపు వంటివి మాత్రమే చేపట్టింది. దాదాపు రెండేళ్ల తర్వాత వేతన పెంపు చేపట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం