Air India: ఎయిరిండియా ఉద్యోగులకు వేతన పెంపు.. వారికి ₹1.8 లక్షల వరకు బోనస్
Air India: ఎయిరిండియా సంస్థ వేతన పెంపు చేపట్టింది. ప్రభుత్వం నుంచి దక్కించుకున్నాక తొలి వేతన పెంపు ఇదే.
Air India | దిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) తమ ఉద్యోగులకు వేతన పెంపు ప్రకటించింది. పైలట్ల పనితీరు ఆధారంగా బోనస్ కూడా చెల్లించనుంది. ప్రభుత్వం నుంచి టాటాల చేతికొచ్చాక టాటా గ్రూప్ చేపట్టిన తొలి వేతన పెంపు ఇదే. ఈమేరకు వేతన పెంపు వివరాలను ఎయిరిండియా సీహెచ్ఆర్ఓ రవీంద్రకుమార్ జీపీ వెల్లడించారు. 2024 ఏప్రిల్ నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి వస్తాయని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ, వ్యక్తుల పనితీరు ఆధారంగా ఈ బోనస్ చెల్లిస్తున్నట్లు చెప్పారు.
2023 డిసెంబర్ 31 కంటే ముందు సంస్థలో చేరినవారికి ఈ పెంపు వర్తిస్తుంది. దీని ప్రకారం.. ఫస్ట్ ఆఫీసర్, కెప్టెన్ల వేతనం నెలకు రూ.5 వేలు మేర పెరగనుంది. కమాండర్ల వేతనం రూ.11 వేలు, సీనియర్ కమాండర్ వేతనం రూ.15 వేలు చొప్పున పెరగనుంది. జూనియర్ ఫస్ట్ ఆఫీసర్కు ఎలాంటి పెంపూ చేపట్టలేదు. అలాగే పనితీరు ఆధారంగా ఏడాదికి గరిష్ఠంగా బోనస్ కింద రూ.1.8 లక్షల వరకు చెల్లించనుంది. జూనియర్ ఫస్ట్ ఆఫీసర్కు రూ.42 వేలు, ఫస్ట్ ఆఫీసర్కు రూ.50వేలు, కెప్టెన్లకు రూ.60 వేలు, కమాండర్లకు రూ.1.32 లక్షలు, సీనియర్ కమాండర్లు రూ.1.80 లక్షల వరకు గరిష్ఠంగా బోనస్ అందుకుంటారు.
ఇండిగో విమానాల్లో ఇక బిజినెస్ క్లాస్
ఎయిరిండియాలో ప్రస్తుతం 18 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఎయిరిండియా గ్రూప్లో ప్రస్తుతం నాలుగు విమానయాన సంస్థలు ఉన్నాయి. ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో ఏఐఎక్స్ కనెక్ట్ (ఎయిర్ఏషియా ఇండియా); ఎయిరిండియాలో విస్తారా విలీనం కానున్నాయి. 2022 జనవరిలో ప్రభుత్వం నుంచి ఎయిరిండియాను దక్కించుకున్న టాటా గ్రూప్.. కాంట్రాక్ట్ల పునరుద్ధరణ, పరిహారం చెల్లింపు వంటివి మాత్రమే చేపట్టింది. దాదాపు రెండేళ్ల తర్వాత వేతన పెంపు చేపట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నాన్న నేర్పిందే నా పిల్లలకూ చెప్పాను’.. వేదాంత చీఫ్ భావోద్వేగ పోస్ట్
Anil Agarwal: ఫాదర్స్డే సందర్భంగా వేదాంత వ్యవస్థాపకుడు అనిల్ అగర్వాల్ తన నాన్నను గుర్తుకు తెచ్చుకున్నారు. ‘‘ఎక్స్’’ వేదికగా సుదీర్ఘ పోస్ట్ చేశారు. -
ఓటీటీ సబ్స్క్రిప్షన్లతో వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్
Vodafone Idea: దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో అందుబాటులో ఉండేలా వొడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను తీసుకొచ్చింది. దీని వ్యాలిడిటీ నెల రోజులు. -
రెట్టింపు ఉత్పత్తిపై దృష్టి
ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ ఎన్ఎండీసీ లిమిటెడ్ రెట్టింపు ఉత్పత్తిపై దృష్టి సారించింది. దీనికి తగ్గట్లుగా పెట్టుబడులు సిద్ధం చేస్తోంది. -
కొత్త వ్యాపారాల్లో అయిదింతల వృద్ధి లక్ష్యం
వ్యాపారాల విలువను గణనీయంగా పెంచుకోవడంపై మహీంద్రా గ్రూపు దృష్టి సారిస్తోందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టరు, సీఈఓ అనిశ్ షా తెలిపారు. -
నియంత్రణ పటిష్ఠమైనా మోసాలు తగ్గట్లేదు: కేపీఎంజీ సర్వే
నియంత్రణ చర్యల్లో పలు మార్పులు చేసినా, మోసాల సంఖ్య తగ్గడం లేదని తమ సర్వేలో పాల్గొన్న వాళ్లలో ఎక్కువ మంది వెల్లడించినట్లు కేపీఎంజీ వెల్లడించింది. -
తాజా ఉత్తీర్ణులకు హుషారే
గత ఆరు నెలల్లో తాజా ఉత్తీర్ణుల (ఫ్రెషర్స్) నియామకాలు 5% పెరిగాయని ఓ నివేదిక వెల్లడించింది. ఐటీ రంగ పరిస్థితి క్రమంగా మెరుగవుతుండటం ఇందుకు కారణమని పేర్కొంది. -
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ ఇ-స్కూటర్ యాంపీర్ నెక్సస్
గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్కు చెందిన ఇ-మొబిలిటీ విభాగం గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రై.లి. తన ఫ్యామిలీ విద్యుత్ స్కూటర్ యాంపీర్ నెక్సస్ను ఆవిష్కరించింది. -
అవిన్యా బ్రాండ్పై టాటా ప్రీమియం విద్యుత్తు కార్లు
టాటా మోటార్స్, ప్రీమియం విద్యుత్తు కార్లను అవిన్యా బ్రాండ్పై ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతోందని సమాచారం. -
సంక్షిప్త వార్తలు(7)
ఈ ఏడాది, వచ్చే సంవత్సరానికి అంతర్జాతీయంగా ముడిచమురు వినియోగ అంచనాల్లో ఎటువంటి మార్పులు చేయడం లేదని పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్) తాజాగా వెల్లడించింది. 2024లో రోజుకు 2.25 మిలియన్ బ్యారెళ్లు, వచ్చే ఏడాదిలో రోజుకు 1.85 మిలియన్ బ్యారెళ్ల చొప్పున చమురుకు గిరాకీ పెరుగుతుందన్నది ఒపెక్ అంచనా. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. -
గృహ రుణాన్ని ఆమోదించే ముందు బ్యాంకులు ఏమేం చూస్తాయ్?
ఇంటిపై రుణం ఇచ్చే ముందు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి?
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘నాన్న నేర్పిందే నా పిల్లలకూ చెప్పాను’.. వేదాంత చీఫ్ భావోద్వేగ పోస్ట్
-
టీమ్ఇండియా కోచ్గా గంభీర్ ఫిక్స్? ఆ డిమాండ్కు ఓకే చెప్పిన బీసీసీఐ!
-
విష్వక్ సేన్ కీలక నిర్ణయం.. ముఖ్య అతిథిగా హాజరై
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ఇద్దరి మృతి
-
తిరుమలలో భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి: జె.శ్యామలరావు