IPO: దశాబ్దం తర్వాత ఎయిర్టెల్ గ్రూప్ నుంచి మరో ఐపీఓ
IPO: భారతీ ఎయిర్టెల్ నుంచి దశాబ్దం తర్వాత మరో ఐపీఓ వస్తోంది. ఏప్రిల్ తొలివారంలో ఐపీఓ సబ్స్క్రిప్షన్ ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
Bharti Hexacom IPO | ఇంటర్నెట్డెస్క్: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ అనుబంధ భారతీ హెక్సాకామ్ (Bharti Hexacom) పబ్లిక్ ఇష్యూకు సిద్ధమైంది. ఐపీఓ ద్వారా రూ.4,300 కోట్లు సమీకరించబోతోంది. సెబీ నుంచి ఇప్పటికే ఆమోదం పొందిన ఈ సంస్థ.. ఏప్రిల్ మొదటివారంలో ఈ ఐపీఓ తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
దశాబ్దం తర్వాత భారతీ గ్రూప్ నుంచి వస్తున్న ఐపీఓ ఇదీ. ఎంతోకాలంగా ఐపీఓకు రావాలని చూస్తున్న హెక్సాకామ్.. మార్చి 19న మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) నుంచి ఆమోదం పొందింది. హెక్సాకామ్లో ఎయిర్టెల్కు 70 శాతం వాటా ఉండగా.. భారత ప్రభుత్వానికి 30 శాతం వాటా ఉంది. ఐపీఓలో భాగంగా ప్రభుత్వం కొంత వాటా విక్రయించనుంది. భారతీ గ్రూప్ నుంచి చివరగా 2012లో భారతీ ఇన్ఫ్రాటెల్ ఐపీఓ వచ్చింది. ప్రస్తుతం దాన్ని ఇండస్ టవర్స్గా పిలుస్తున్నారు. ఆ తర్వాత ఆ గ్రూప్ నుంచి వస్తున్న ఐపీఓ ఇదే.
త్వరలో వాట్సప్ స్టేటస్లో నిమిషం వీడియో!
రాజస్థాన్తో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాల్లోని యూజర్లకు ఎయిర్టెల్ బ్రాండ్ కింద మొబైల్ సేవలు, ఫిక్స్డ్ లైన్ టెలిఫోన్, బ్రాడ్బ్యాండ్ సేవల్ని హెక్సాకామ్ అందిస్తోంది. ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, యాక్సిస్ క్యాపిటల్, బీఓబీ క్యాపిట్ మార్కెట్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ఈ ఐపీఓకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లు వ్యవహరించన్నాయి. హెక్సాకామ్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లాభం రూ.1,951.1 కోట్లగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో నికర లాభంలో 67.2 శాతం క్షీణించి రూ.549.2 కోట్లకు చేరింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 21.7 శాతం పెరిగి రూ.6,579 కోట్లుగా నమోదైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా