Airtel 5G: ఎయిర్టెల్ మైలురాయి.. 500 నగరాలకు 5జీ సేవల విస్తరణ
Airtel 5g: ఎయిర్టెల్ తన 5జీ సేవలను మరిన్ని నగరాలకు విస్తరించింది. తాజాగా మరో 235 నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించడం ద్వారా 500 నగరాల మైలురాయిని అందుకుంది.
దిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ (Bharti Airtel) తన 5జీ సేవలను వేగంగా విస్తరిస్తోంది. ఈ విషయంలో రిలయన్స్ జియోతో పోటీపడుతున్న ఆ సంస్థ.. తాజాగా మరో 235 నగరాల్లో 5జీ నెట్వర్క్ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో 500 నగరాలు/ పట్టణాల్లో తమ 5జీ నెట్వర్క్ను అందుబాటులోకి తెచ్చినట్లయ్యిందని ఎయిర్టెల్ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు జియో సైతం ఇప్పటికే 406 నగరాలు/ పట్టణాలకు తన సేవలను విస్తరించింది.
‘భారతీ ఎయిర్టెల్ 235 నగరాల్లో 5జీ నెట్వర్క్ సేవలను అందుబాటులోకి తెచ్చాం. దీంతో 500 నగరాల్లోని మా వినియోగదారులకు 5వ జనరేషన్ నెట్వర్క్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 2022 అక్టోబర్లో మొదటగా 5జీ సర్వీసులను ప్రవేశపెట్టాం. ప్రతి ఎయిర్టెల్ వినియోగదారునికి 5జీ సేవలు అందుబాటులో తీసుకురావటమే లక్ష్యంగా రోజుకు 30-40 నగరాలకు సేవలను విస్తరిస్తున్నాం. 2023 సెప్టెంబర్ నాటికి దేశంలోని నగరాలన్నింటికీ ఎయిర్టెల్ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నాం’ అని భారతీ ఎయిర్టెల్ సీటీఓ రణదీప్ సెఖోన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు