Airtel: ఎన్నికల తర్వాత ఎయిర్టెల్ టారిఫ్ల పెంపు..!
Airtel tariffs: టెలికాం ఛార్జీల ధరలను పెంచేందుకు ఎయిర్టెల్ సిద్ధమవుతోంది. జియో మాత్రం కొత్త పంథాలో వెళ్లాలని భావిస్తోంది.
Airtel | ఇంటర్నెట్ డెస్క్: పార్లమెంట్ ఎన్నికల తర్వాత తమ టారిఫ్లను సవరించేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈవిషయంలో అగ్రగామి సంస్థలైన ఎయిర్టెల్, జియో తమదైన వ్యూహాలను ఇప్పటికే సిద్ధం చేసుకుంటున్నాయి. తమ ప్లాన్ ధరలను పెంచడం ద్వారా ఒక యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకోవాలని ఎయిర్టెల్ (Airtel) భావిస్తోంది. ప్యాకేజీ ధరలు పెంచకుండా డేటా వినియోగాన్ని మరింత పెంచి తద్వారా అధిక ధరలు కల ప్యాకేజీల వైపు వినియోగదారులను మళ్లించాలన్నది జియో (Jio) ఆలోచనగా ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
జియోతో పోలిస్తే ఎయిర్టెల్ ప్లాన్లు ఇప్పటికే కాస్త ఎక్కువగా ఉన్నాయి. ముందునుంచీ ఆ కంపెనీ తన ఆర్పును (ARPU) క్రమంగా పెంచుకుంటూ వస్తోంది. జియో సగటు ఆదాయం మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. దీనివల్ల డేటా వినియోగం పెరుగుతుందని, తద్వారా లాభం పొందొచ్చని జియో భావిస్తోంది. జియో సినిమా ప్రసారాలు ఉచితంగానే యూజర్లకు రిలయన్స్ అందిస్తోంది. అయితే, వీక్షణ అనుభూతిని మెరుగుపరుచుకోవడం కోసం యూజర్లు అధిక డేటా వెచ్చిస్తారని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నట్లు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ తన కథనంలో పేర్కొంది. దీనివల్ల టారిఫ్ ధరలను పెంచకుండానే అధిక ఆర్పును సాధించొచ్చన్నది జియో వ్యూహంగా కనిపిస్తోందని అనలిస్టులు చెబుతున్నారు.
షావోమి కారు ధర ఎంత ఉండొచ్చంటే.. సీఈఓ మాటల్లో
ఎయిర్టెల్ మాత్రం తన ఆర్పును పెంచుకోవడానికి ప్లాన్ ధరల్లో మార్పును ఎంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎన్నికలు పూర్తవగానే ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. జులై-అక్టోబర్ మధ్య 15 శాతం వరకు టారిఫ్లను పెంచొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం ఎయిర్టెల్ ఆర్పు రూ.208గా ఉంది. ఇక జియో ఆర్పు రూ.182 కాగా.. వొడాఫోన్ ఐడియా రూ.145గా ఉంది. మార్కెట్ వాటా పరంగా జియో అగ్రగామిగా ఉంది. ఎయిర్టెల్ రెండో స్థానంలో ఉంది. 18 శాతం వాటాతో వొడాఫోన్ ఐడియా మూడో స్థానంలో కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్