Ambani - Adani: తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
అంబానీ, అదానీ తొలిసారి చేతులు కలిపారు. ఓ పవర్ ప్రాజెక్ట్ విషయంలో వీరి మధ్య భాగస్వామ్యం కుదిరింది.
Ambani - Adani | దిల్లీ: ఇద్దరూ ప్రముఖ వ్యాపార వేత్తలు. దేశంలో అత్యంత ధనవంతులు. పైగా గుజరాత్ నుంచి వచ్చిన వారే. వ్యాపార దిగ్గజాలైన అంబానీ, అదానీ (Ambani - Adani) గురించి చెప్పాలంటే ఇంతకంటే ఉపోద్ఘాతం అవసరం లేదేమో బహుశా! వీరిద్దరూ ఏళ్లుగా వ్యాపారాలు చేస్తున్నా ఎవరి వ్యాపారాలు వారివి. ఎవరి వ్యూహాలు వారివి. అలాంటి వారు తొలిసారి చేతులు కలిపారు. అదానీకి చెందిన ఓ పవర్ ప్రాజెక్ట్లో రిలయన్స్ తాజాగా 26 శాతం వాటా కొనుగోలు చేసింది. తద్వారా కుబేరుల మధ్య తొలిసారి వ్యాపార భాగస్వామ్యం నెలకొంది.
అదానీ పవర్ లిమిటెడ్కు చెందిన మధ్యప్రదేశ్లోని మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్లో రిలయన్స్ 5 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. 500 మెగావాట్ల విద్యుత్ను తమ సొంత అవసరాలకు (క్యాప్టివ్) వినియోగించుకోనుంది. ఈ విషయాన్ని ఇరు సంస్థలూ వేర్వేరు స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్లో పేర్కొన్నాయి. 20 ఏళ్లకు రిలయన్స్తో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదురినట్లు అదానీ పవర్ తన ఫైలింగ్లో పేర్కొంది. 2800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన పవర్ ప్లాంట్లో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్ను క్యాప్టివ్ యూనిట్ కోసం కేటాయించినట్లు తెలిపింది. ఇవే వివరాలను రిలయన్స్ సైతం తన ఫైలింగ్లో వెల్లడించింది. సాధారణంగా క్యాప్టివ్ జనరేటింగ్ ప్లాంట్ నుంచి సొంత అవసరాలకు విద్యుత్ను వినియోగించాలంటే ఆ కంపెనీలో 26 శాతం వాటా ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. ఈ పవర్ను దేనికోసం రిలయన్స్ వినియోగించబోయేదీ స్పష్టత లేదు. ఇప్పటికే గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో రిలయన్స్కు క్యాప్టివ్ యూనిట్లు ఉన్నాయి.
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
టాప్ కోసం పోటీ..
ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ.. ఏళ్లుగా వేర్వేరు వ్యాపారాల్లో ఉన్నారు. అంబానీ.. ఆయిల్, గ్యాస్, రిటైల్, టెలికాం విభాగాలపై దృష్టి సారించగా.. అదానీ ఇన్ఫ్రా, పోర్టులు, ఎయిర్పోర్టులు, మైనింగ్ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఇరు సంస్థలూ పోటీ పడుతున్నాయి. ఇప్పటికే రెండు సంస్థలు పెద్ద ఎత్తున పెట్టుబడులు ప్రకటించాయి. 5జీ స్పెక్ట్రమ్ విషయంలోనూ ఇరు సంస్థలు పోటీ పడ్డాయి. అదానీ కంపెనీ ప్రజావసరాల కోసం వినియోగించే స్పెక్ట్రమ్ జోలికెళ్లలేదు. ఇక ఎన్డీటీవీని టేకోవర్ చేయడం ద్వారా అదానీ గ్రూప్ మీడియా రంగంలోకీ ప్రవేశించింది. తద్వారా మీడియా రంగంలోనూ ఇరువురి మధ్య పోటీ నెలకొంది. ఆసియాలోనే సంపన్నుల జాబితాలో నంబర్ 1 స్థానం కోసం వీరిద్దరూ పోటీ పడుతున్న వేళ ఈ కొనుగోలు జరగడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల