Forbes Richest List: ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలోనూ అంబానీయే టాప్
Forbes Richest List: ఇటీవల విడుదలైన హురున్ ధనవంతుల జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్న ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ.. తాజా ఫోర్బ్స్ రిచ్లిస్ట్లోనూ వారి స్థానాలను పదిలం చేసుకున్నారు.
Forbes Richest List | దిల్లీ: ఫోర్బ్స్ 100 మంది సంపన్న భారతీయుల జాబితా 2023 (Forbes India Richest List 2023)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) మళ్లీ తొలి స్థానానికి చేరారు. ఈ ఏడాది ఆయన సంపద నాలుగు బిలియన్ డాలర్లు పెరిగి 92 బిలియన్ డాలర్లకు చేరింది. ఆయన తర్వాత అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani) 68 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. హెచ్సీఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ (Shiv Nadar) (29.3 బిలియన డాలర్లు), ఓపీ జిందాల్ గ్రూప్నకు చెందిన సావిత్రి జిందాల్ (24 బిలియన్ డాలర్లు), అవెన్యూ సూపర్మార్ట్స్ రాధాకిషన్ దమానీ (23 బిలియన్ డాలర్లు) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇటీవల విడుదలైన ‘హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023’లోనూ అంబానీ, అదానీ తొలి రెండు స్థానాల్లో నిలిచిన విషయం తెలిసిందే.
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది భారత 100 మంది ధనవంతుల సంపదలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. క్రితం ఏడాది వీరందరి సంపద మొత్తం 799.32 బిలియన్ డాలర్లు. ఈసారి అది అత్యంత స్వల్పంగా పెరిగి 799.78 బిలియన్ డాలర్లకు చేరింది. స్టాక్ మార్కెట్ సూచీల్లో గణనీయ వృద్ధే నమోదైనప్పటికీ.. రూపాయి బలహీనతల వల్ల సంపదలో వచ్చిన పెరుగుదలకు గండిపడిందని ఫోర్బ్స్ తెలిపింది. ఈ జాబితా ప్రకారం సావిత్రి జిందాల్ భారత్లో అత్యంత మహిళా ధనవంతురాలు. ఈసారి ఏడుగురు తిరిగి ఈ జాబితాలో చోటుదక్కించుకున్నారు. బైజూ రవీంద్రన్, ఆయన సతీమణి దివ్యా గోకుల్నాథ్ సహా మరో ఎనిమిది మంది ఈ జాబితాలో స్థానం కోల్పోయారు.
ఫోర్బ్స్ 100 మంది సంపన్న భారతీయుల జాబితాలో కొత్తగా కేవలం ముగ్గురు మాత్రమే చేరారు. ల్యాండ్మార్క్ గ్రూప్ ఛైర్పర్సన్ రేణుకా జగతియానీ, ఏషియన్ పెయింట్స్కు చెందిన ‘దానీ’ కుటుంబం, వస్త్ర ఎగుమతి వ్యాపారంలో ఉన్న కే.పి రామస్వామి వీరిలో ఉన్నారు. 40 ఏళ్ల వయసున్న జెరోదా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ఈ జాబితాలో అత్యంత పిన్నవయస్కుడు. తన సోదరుడు నితిన్ కామత్తో కలిసి ఆయన సంపద విలువ 5.5 బిలియన్ డాలర్లు.
ఫోర్బ్స్ జాబితాలోని తొలి 10 మంది సంపన్నులు..
1. ముకేశ్ అంబానీ- 92 బి.డాలర్లు
2. గౌతమ్ అదానీ- 68 బి.డాలర్లు
3. శివ్ నాడార్- 39.3 బి.డాలర్లు
4. సావిత్రి జిందాల్- 24 బి.డాలర్లు
5. రాధాకిషన్ దమానీ- 23 బి.డాలర్లు
6. సైరస్ పూనావాలా- 20.7 బి.డాలర్లు
7. హిందుజా కుటుంబం- 20 బి.డాలర్లు
8. దిలీప్ సంఘ్వి- 19 బి.డాలర్లు
9. కుమార మంగళం బిర్లా- 17.5 బి.డాలర్లు
10. షాపూర్ మిస్త్రీ & కుటుంబం- 16.9 బి.డాలర్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది. -
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!