Forbes Richest List: ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలోనూ అంబానీయే టాప్
Forbes Richest List: ఇటీవల విడుదలైన హురున్ ధనవంతుల జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్న ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ.. తాజా ఫోర్బ్స్ రిచ్లిస్ట్లోనూ వారి స్థానాలను పదిలం చేసుకున్నారు.
Forbes Richest List | దిల్లీ: ఫోర్బ్స్ 100 మంది సంపన్న భారతీయుల జాబితా 2023 (Forbes India Richest List 2023)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) మళ్లీ తొలి స్థానానికి చేరారు. ఈ ఏడాది ఆయన సంపద నాలుగు బిలియన్ డాలర్లు పెరిగి 92 బిలియన్ డాలర్లకు చేరింది. ఆయన తర్వాత అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani) 68 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. హెచ్సీఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ (Shiv Nadar) (29.3 బిలియన డాలర్లు), ఓపీ జిందాల్ గ్రూప్నకు చెందిన సావిత్రి జిందాల్ (24 బిలియన్ డాలర్లు), అవెన్యూ సూపర్మార్ట్స్ రాధాకిషన్ దమానీ (23 బిలియన్ డాలర్లు) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇటీవల విడుదలైన ‘హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023’లోనూ అంబానీ, అదానీ తొలి రెండు స్థానాల్లో నిలిచిన విషయం తెలిసిందే.
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది భారత 100 మంది ధనవంతుల సంపదలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. క్రితం ఏడాది వీరందరి సంపద మొత్తం 799.32 బిలియన్ డాలర్లు. ఈసారి అది అత్యంత స్వల్పంగా పెరిగి 799.78 బిలియన్ డాలర్లకు చేరింది. స్టాక్ మార్కెట్ సూచీల్లో గణనీయ వృద్ధే నమోదైనప్పటికీ.. రూపాయి బలహీనతల వల్ల సంపదలో వచ్చిన పెరుగుదలకు గండిపడిందని ఫోర్బ్స్ తెలిపింది. ఈ జాబితా ప్రకారం సావిత్రి జిందాల్ భారత్లో అత్యంత మహిళా ధనవంతురాలు. ఈసారి ఏడుగురు తిరిగి ఈ జాబితాలో చోటుదక్కించుకున్నారు. బైజూ రవీంద్రన్, ఆయన సతీమణి దివ్యా గోకుల్నాథ్ సహా మరో ఎనిమిది మంది ఈ జాబితాలో స్థానం కోల్పోయారు.
ఫోర్బ్స్ 100 మంది సంపన్న భారతీయుల జాబితాలో కొత్తగా కేవలం ముగ్గురు మాత్రమే చేరారు. ల్యాండ్మార్క్ గ్రూప్ ఛైర్పర్సన్ రేణుకా జగతియానీ, ఏషియన్ పెయింట్స్కు చెందిన ‘దానీ’ కుటుంబం, వస్త్ర ఎగుమతి వ్యాపారంలో ఉన్న కే.పి రామస్వామి వీరిలో ఉన్నారు. 40 ఏళ్ల వయసున్న జెరోదా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ఈ జాబితాలో అత్యంత పిన్నవయస్కుడు. తన సోదరుడు నితిన్ కామత్తో కలిసి ఆయన సంపద విలువ 5.5 బిలియన్ డాలర్లు.
ఫోర్బ్స్ జాబితాలోని తొలి 10 మంది సంపన్నులు..
1. ముకేశ్ అంబానీ- 92 బి.డాలర్లు
2. గౌతమ్ అదానీ- 68 బి.డాలర్లు
3. శివ్ నాడార్- 39.3 బి.డాలర్లు
4. సావిత్రి జిందాల్- 24 బి.డాలర్లు
5. రాధాకిషన్ దమానీ- 23 బి.డాలర్లు
6. సైరస్ పూనావాలా- 20.7 బి.డాలర్లు
7. హిందుజా కుటుంబం- 20 బి.డాలర్లు
8. దిలీప్ సంఘ్వి- 19 బి.డాలర్లు
9. కుమార మంగళం బిర్లా- 17.5 బి.డాలర్లు
10. షాపూర్ మిస్త్రీ & కుటుంబం- 16.9 బి.డాలర్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
iPhones cheaper: ఐఫోన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడమే దీనికి కారణం. -
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
Sundar Pichai: భారత్లోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ ఖరగ్పూర్ నుంచి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. -
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
Stock market: దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్